welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, December 18, 2008

Think Simple to Solve Complex Problems

1. When NASA began launching astronauts into space, they found out that the astronauts' pens wouldn't work at zero gravity  (ink wouldn't flow down to the writing surface). It took them one decade and  $12 million to solve this problem. They developed a pen that worked at zero gravity, upside down, underwater, on practically any surface including crystal, and at temperatures ranging from below freezing to over 300 degrees C. 
And what did the Russians do? The Russians used a pencil. 
 
2. One of the most memorable case studies on Japanese management techniques was the case of the empty soap box, which occurred in one of Japan's biggest cosmetics companies. The company received a complaint that a consumer had bought a soap box that was empty. Immediately the authorities isolated the problem to the assembly line, which transported all the packaged boxes of soap to the delivery department. For some reason, one soap box went through the assembly line empty. Management asked its engineers to solve the  problem. Post-haste, the engineers worked hard to devise an X-ray machine with high-resolution monitors manned by two people to watch all the soap boxes that passed through the line, to make sure they were not empty. No doubt, they worked hard and they worked fast but they spent whoopee amount of time and money to do  so. 
But when a rank-and-file employee in a small company was posed with the same problem, he did not get into the complications of X-rays, etc but instead came out with another solution. He bought a strong industrial electric fan and pointed it at the assembly line. He switched the fan on, and as each soap box passed the fan, it simply blew the empty boxes out of the line. 
 
3. A 50 feet long trailer having 48" wheels got stuck while entering a midtown tunnel in New York because it was approximately 0.2 feet taller  than the height of the tunnel. The fire department and the state department of transportation spent the whole day searching for a solution, to no avail. 
Then a child, aged about 9 years, asked his father, "Why can't they take out the air from the tyre tubes? The height will automatically come down." 
 
 
Moral: Always look for simple solutions. And learn to focus on solutions, not on problems. 
 
Smile is the only curve which sets many problems straight

దుఃఖానికి ఆమడ దూరం?

దుఃఖానికి ఆమడ దూరం?
మారుతున్న ధోరణి
'నాగరికత' తెస్తున్న మార్పు
దిగమింగుకోవడం సరికాదు
సంతోషం ఒక్కటే కాదు.. ఎంత వద్దనుకున్నా మన జీవితాల్లో దుఃఖానిదీ పెద్ద పాత్రే. కట్టలు తెంచుకుని ఉబికివచ్చే దుఃఖాన్ని బయటకు వదిలేస్తే.. మనసు తేలిక పడుతుంది. గుండెబరువు దిగుతుంది. కానీ కాలంతో పాటే ఇప్పుడు 'దుఃఖం' తీరుతెన్నులూ మారిపోతున్నాయి. నేడు ఎంతో మంది ఆత్మీయులో, బంధువులో చనిపోయినప్పుడు కూడా ఏడ్వటం, కాస్త బిగ్గరగా దుఃఖించడాన్ని 'అనాగరికమైన' వ్యవహారంగా భావిస్తున్నారు.

ఆత్మీయతలు కొరవడుతుండడం, ఆర్థిక అసమానతలు, మనుషులు దూరందూరంగా జీవిస్తుండడం లాంటి అంశాలు నేటి తరాన్ని మానసికంగా బాగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సహజంగానే దుఃఖం గాఢత తగ్గిపోతోంది. మరోవైపు ఏడ్వటాన్ని చిన్నతనంగా భావిస్తూ దుఃఖాన్ని లోలోపలే దాచుకుంటున్నవారి సంఖ్యా పెరుగుతోందనీ, ఇదంతా నాగరికత ఫలితమేననీ చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు.

''మా తాతయ్య చనిపోయినప్పుడు నాన్నమ్మతో పాటు ఇంట్లో అందరం తల్చుకుని తల్చుకుని మరీ చాలా రోజులు ఏడ్చాం. దాన్ని ఆపుకోలేకపోయేవాళ్లం. చుట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని సహజంగానే పరిగణించేవారు. ఇప్పుడా వాతావరణాన్ని ఊహించడం కూడా కష్టం. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఎవరైనా చనిపోతే ఆ దుఃఖం, ఏడుపులు ఆ రోజుకే.. ఇంకా చెప్పాలంటే ఆ కొద్ది గంటలకే పరిమితవుతున్న ఉదాహరణలు ఎన్నో'' అని గతాన్నీ, వర్తమానాన్నీ విశ్లేషిస్తున్నారు 50 ఏళ్ల వీరాంజనేయులు. బాధను వ్యక్తీకరించే తీరులో కూడా కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయని చెప్పటానికి ఆయన తరం అనుభవాలే సాక్ష్యం. ''ఇటీవల మా పిన్ని చనిపోయినప్పుడు ఆమె కూతుళ్లు మాట వరసకైనా ఏడ్వకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. నా ఉద్దేశం వాళ్లు ఏడ్వాలని కాదుగానీ వారిలో ఆ బాధ, భావన కనబడకపోవటం చిత్రమనిపించింది'' అని తన అనుభవాన్ని వివరించారు మహబూబ్‌నగర్‌కి చెందిన ఎస్.బుచ్చిరెడ్డి. ఆత్మీయులు పోయినప్పుడు ఎవరికైనా అప్రయత్నంగానే ఏడుపు ముంచుకొస్తుంది. ఒకప్పుడు ఆత్మీయులంతా కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు ప్రతిచోటా కనబడేవి. కానీ, ఇప్పుడిలాంటి వాతావరణం కేవలం గ్రామాలకే పరిమితమవుతోంది. పట్టణాల్లోని ఇరుకిరుకు అపార్టుమెంట్ జీవితాల్లో 'సభ్యత' పెద్ద అడ్డుగోడగా నిలుస్తోందని బాధపడ్డారు హైదరాబాద్‌లో నివసించే శ్రీనివాసరావు. రోజురోజుకీ నగర జీవితాలు బిజీగా మారుతుండడం, రెక్కలు రాగానే దారులు వేరైపోతుండటం లాంటివి అనుబంధాలనూ, ఆత్మీయతలనే కాదు, దుఃఖాన్నీ పల్చన చేస్తున్నాయి.

''మొన్న మా మామయ్య చనిపోయారు. ఆయనకి సంతానం లేదుగానీ తన ఒక్కగానొక్క తమ్ముడిని ఆయనే పెంచి పెద్దచేసి ఉద్యోగం కూడా ఇప్పించారు. ఆయన పోయినప్పుడు చెన్నై నుంచి ఆ తమ్ముడు వచ్చాడుగానీ కంట చుక్క నీరు కూడా కనబడకపోవటం ఆశ్చర్యమనిపించింది'' అని వివరించారు నల్గొండ జిల్లాకు చెందిన కె.నర్సింహ. ఆత్మీయులతో ఉండే అనుబంధాలను, జ్ఞాపకాలను అంత తేలికగా తుడిచేసుకోవటం ఆయనకు ఎక్కడలేని విస్మయాన్ని కలిగించింది. ''ఒకప్పుడు అన్నదమ్ములు విడిపోయినా అంతా దగ్గరగానే ఉండేవారు. ఒకరి అవసరానికి ఒకరు తోడుగా నిలిచేవారు. అనుబంధాలూ సజీవంగా ఉండేవి. కాబట్టే, దగ్గరివాళ్లు పోయినప్పుడు సహజంగానే దుఃఖం వచ్చేది'' అని వివరిస్తున్నారు నెల్లూరుకు చెందిన జి.భవాని. బాబాయి చనిపోతే ఆమె ఇటీవలే తమ ఊరు వెళ్లివచ్చారు. ఉద్యోగరీత్యా మర్నాడే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ''వస్తూనే నెత్తిన వెయ్యి పనులు. ఇక అందరితో కలిసి ఆ దుఃఖాన్ని పంచుకునేదిమాత్రం ఏముంటుంది'' అని ప్రశ్నిస్తున్నారామె. దూరంగా ఉండటం, బిజీ జీవితాలవల్లనే కాబోలు.. తాను వెంటనే రోజువారీ పనుల్లో మునిగిపోయానని చెబుతారామె.

నిజానికి ఒక్క మరణ సందర్భాల్లోనే కాదు.. మొత్తమ్మీదే దుఃఖం తగ్గిపోయిందంటున్నారు ఖమ్మం జిల్లా వాసి మాధవి. ''మా అమ్మాయి అత్తారింటికి వెళ్లేటప్పుడు నాకు ఏడుపొస్తుందిగానీ.. తను మాత్రం నిబ్బరంగానే ఉంటుంది. పైగా రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, ఆ మాత్రం దానికి ఏడుస్తావెందుకని నాకే ధైర్యం చెబుతుంది'' అంటారామె. అలాగని తన మనసులో బాధ లేదనుకోవటం లేదనీ, దాన్ని తను బయటకు వ్యక్తం చేయటం లేదంటారామె. ఇలా నేటి యవతరంలో మనసులోని భావాలను దాచుకోవటం, అణచిపెట్టుకోవటం పెరుగుతున్న మాట వాస్తవమేనంటూ ఇది విపరీతమైన ఫలితాలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు క్లినికల్ సైకాలజిస్టు కె.నిరంజన్‌రెడ్డి. ''ప్రెషర్ కుక్కర్‌లో సేఫ్టీవాల్వ్ లాగానే... మనసులోని బాధని బయటకు పంపిచడానికి ఏడుపు కూడా ఒక మార్గంగా పనిచేస్తుంది. దీన్ని లోలోనే అణచుకుంటే నిద్ర సరిగా పట్టకపోవటం, దిగులు ఎక్కువ కావటం, ఆకలి తగ్గడం, బలహీనత, భయంకరమైన కలలు వంటివన్నీ మొదలవుతాయి'' అని ఆయన చెబుతున్నారు.

ఎవరైనా చనిపోయినప్పుడు కొన్నిరోజుల పాటు సంతాప దినాలుగా పాటించడం, అంతా ఊరడించటం తదితర సంప్రదాయాలన్నీ మనసులోని దుఃఖాన్ని పారదోలే ప్రయత్నాలే. వీటివల్ల దుఃఖంలో ఉన్నవారికి 'అందరూ తమ వెంటే ఉన్నారన్న' భావన కలుగుతుంది. ఒక రకంగా ఏడుపు కూడా 'సామాజిక భద్రత'లో భాగమే. అందుకే ఇది కొరవడటం సమాజానికే మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు ఆత్మీయులు పోతే ఏడ్చేందుకు రాజులు అద్దె మనుషులను పెట్టుకునేవారు. రాజులమైన తాము ఏడవటమేంటని బింకాలు పోయేవారు. రాజులే పోయాక మనకెందుకీ డాంబికాలు 

Monday, December 01, 2008

నార్ల వెంకటేశ్వరరావు

నార్ల వెంకటేశ్వరరావు తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్ల గా కూడా వీరు ప్రసిద్ధులు. 


ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. 

హేతువాది గా, మానవతావాది గా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించాడు.నార్ల వారి సొంత గ్రంధాలయంలో 20000 పుస్తకాలు ఉండేవట.


కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లిష్‌లో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. 'స్వరాజ్య', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించి 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రజ్యోతి' పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు.ఎడిటర్‌గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి,నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు. సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. రాజగోపాలాచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు- దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదకశస్త్రాలను ప్రయోగించారు. 

అదేవిధంగా మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి 'ఎవరు రాశారో తెలియదుగానీ వారికి సాష్టాంగ నమస్కారం' అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదన్న వాదనను ఆయన తుదికంటా వ్యతిరేకించారు. హేతువాదిగా నిలిచారు. సామాజిక పరిణామాలను భౌతికవాద దృష్టితో పరిశీలించడం నార్ల ప్రత్యేకత. జీవితాన్ని మానవతావాదిగా తరచిచూడటం ఆయన విశిష్టత. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ నార్ల విరచించిన 'సీతజోస్యం' ఛాందసవాదులకు చెంపపెట్టులాంటిది. రామాయణాన్ని; రామ, రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్యభావజాలానికి సవాలు విసురుతూ ఆయన రాసిన 'శంభూక వధ' అట్టడుగువర్గాల తరఫున పూరించిన సమరశంఖమనే చెప్పాలి. బౌద్ధమతాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు.తాను నమ్మిన విషయాన్ని శక్తిమంతంగా చెప్పడంలో నార్ల అద్వితీయుడు. ఆయన రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన.ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం 'ఆంధ్రజ్యోతి' ఆవిర్భావం. ' ఆంధ్రప్రభ' నుంచి వైదొలిగి సంపాదకత్వం వహించడానికి చేతిలో పత్రిక లేకుండా 'నిరుద్యోగి'గా ఉన్న నార్ల కోసం కొందరు ముఖ్యులు పూనుకొని పెట్టిన పత్రిక అది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల. 'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల 'ఆంధ్ర ప్రభ', 'ఆంధ్రజ్యోతి' ద్వారా సమర్థంగా కొనసాగించారు.తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు. 

తెలుగు పట్ల ఇంతటి మమకారం లేకపోతే కోటంరాజు రామారావు, మానికొండ చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్తు, ఖాసా సుబ్బారావులాగా నార్ల కూడా ఢిల్లీకో, లక్నోకో వెళ్ళి ఆంగ్ల పత్రికల సంపాదకుడిగా కీర్తి గడించేవారు.సంపాదకుడు అనే మాట ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు.ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా' అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల.'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు.


నార్ల వారి మాటలు యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు.ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు.సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.బడు వాడేవాడు బడుద్ధాయి.

Sunday, November 30, 2008

telugu Dr Ghazal Srinivas in new Guinness Book


the great Telugu singer Dr Ghazal Srinivas has got a place in Guinness Book of World records . He has set a new record by singing Ghazals on Gandhism in 76 languages. He was also proactive and took initiative in spreading Gandhism across the world crossing the boundaries of sub continent.

Well known Telugu singer Dr Ghazal Srinivas has got a place in Guinness Book of World records today. He has set a new record by singing Ghazals on Gandhism in 76 languages. He was also proactive and took initiative in spreading Gandhism across the world crossing the boundaries of sub continent.

about Ghazal Srinivas

Ghazal Srinivas divinely gifted genius hails from Palakol, West Godavari District, in Andhra Pradesh. He has scaled the heights of International Fame as Prince and Pioneer of singing Telugu Ghazals. Srinivas has been singing and performing Telugu Ghazals since 1986. He has developed a unique style of his own – a care free, effortless and sonorous singing. He makes use of Kanjeera, a common instrument, as his only accompaniment. Characteristically Ghazal Srinivas analyzes each stanga of the Ghazal that he sings and brings out the hidden literary beauty of it as he explains to the audience.


Honorary Doctorate

Dr Ghazal Srinvas conferred Honorary Doctorate from Acharya Nagarjuna University, Andhra Pradesh in the Year 2008 for his contribution to Art of Ghazal singing and world peace.

Thursday, November 13, 2008

నేటి తెలుగుకు మేటి వెలుగు - అద్భుత


తెలుగు భాష ప్రాచీనమైందంటూ రాజముద్ర ఎట్టకేలకు పడింది. అసలు అధ్యాయం మొదలైంది. ప్రాచీన హోదా కిరీటమొక్కటే తెలుగుభాషను బతకించజాలదు. అమ్మకు అమ్మ ఉండేదని అంగీకరించినంత మాత్రాన ఒనగూడే ప్రయోజనం నామమాత్రమే. ఆత్మగౌరవం ఆయువు పోసుకుంది- అంతే! ఎంతసేపూ గతంలో గెంతులువేసి బావుకొనేదేం ఉండదు. తాతలు తాగిన నేతి వాసనల్ని చర్చకు పెట్టి లాభంలేదు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అంటగట్టలేం.

ప్రాచీనహోదా ఇచ్చినందుకు మహా అయితే ఏటా కొన్ని కోట్ల రూపాయల నిధులు ముట్టచెబుతారు. ఆ మొత్తంతో ఏం వెలగబెడతారన్నదే అసలు ప్రశ్న. పొరుగు రాష్ట్రంలోలాగా మనకంటూ పకడ్బందీ అనువాద విభాగం లేదు. అముద్రిత గ్రంథాలెన్నో శిథిµలావస్థకు చేరుతున్నాయి. ఆ జాబితా మన చేతుల్లో లేదు. పోనీ అకాడమీలను పునరుద్ధరిద్దామంటే- గతంలోని చేదు అనుభవం మనల్ని వెంటాడుతోంది. రచయితమ్మన్యులు తమ ప్రాపకం కోసం అకాడమీలను భ్రష్టుపట్టించి ఆధిపత్యపోరుకు తెరతీసిన నీచచరిత్ర ఇటీవలి మాటే. సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీలను ఎన్టీఆర్ ఉన్నపళంగా రద్దు చేశారనటం నిజం కాదు. వాటి రద్దుకు దారితీసేలా కుళ్లు రాజకీయాలు రాజ్యమేలాయన్నది నిన్నటి సూర్యాస్తమయం అంతటి ఎర్రని నిజం!

ప్రస్తుత శుభసందర్భంలో తెలుగుభాష విశిష్టత గురించి వూరూరా సభలు పెట్టి వూదరకొట్టినందువల్ల ఉపయోగం శూన్యం. ఆంధ్రత్వ మాంధ్రభాషాచ నల్పస్య తపసఃఫలమ్ (ఆంధ్రులుగా పుట్టడం, ఆంధ్రభాష వ్యవహరించడం తపస్సిద్ధి పుణ్యమే) అంటూ ఢిల్లీ పాదుషాను మెప్పించిన గోదావరి వాసి అప్పయ్యదీక్షితులు ఏనాడో తెలుగుభాషకు జేజేలు పలికారు. అంతక్రితమే 'క్రీడాభిరామ' కర్త 'దేశభాషలందు తెనుగులెస్స' అంటూ తెలుగుకు పట్టం కట్టాడు. 'తెనుగు' అన్నమాట పరిమితమైన అర్థంలో భాషాపరంగానే చెలామణిలో ఉన్నందువల్ల దాన్ని తెలుగుగా మార్చి ఆముక్తమాల్యద కర్త 'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నాడు. తమిళకవి సుబ్రమణ్య భారతి 'సుందర తెనుంగు' అన్నాడని మురిసిపోనక్కరలేదు. అచ్చులతో అంతమయ్యే అరుదైన పదసంపద కలిగి- డాంటీ, పెట్రార్క్, బొకాసియోలు మెరుగులు దిద్దిన ఇటాలియన్ భాషతో మన భాషని పోల్చి, 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా వినుతికెక్కేట్టు చేసిన నావికుడు నికొలయ్ కోంటి పేరు తలచుకుంటే ఒరిగేదేం లేదు. దేశానికి హిందీ, ఆంగ్లభాషలతో పాటు అధికారభాష కాదగ్గ అర్హత తెలుగుభాషకుందని ఆంగ్లశాస్త్రవేత్త హాల్డేన్ భావిస్తే ఏముంది... మన పాలకులకు ఆపాటి స్పృహ ఉండాలిగాని! పాత అణాలపై ఆనాటి ఆంగ్ల పాలకులు 'ఒక అణా' అంటూ ఆంగ్ల, హిందీ, బెంగాలీ, తెలుగు భాషల్లో ముద్రించిన ముచ్చట్లు స్వపరిపాలకులు మరిచారు.

రాజకీయ గ్రహణం పట్టి భాషల ఉనికి మసకబారిపోతోంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ఎన్నో ప్రాంతీయ భాషలు, ముఖ్యంగా ఆఫ్రికన్ భాషలు మట్టికొట్టుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అయిదువేల భాషలు వ్యవహారంలో ఉన్నాయని అంచనా. నేడు రమారమి రెండువేల భాషల రెక్కలు విరిగి ప్రపంచభాషల సంఖ్య మూడువేలకు పడిపోయింది.

ఇప్పుడు మనముందున్న సమస్యల్లా- నేటి అవసరాలకు సరిపడేలా తెలుగు భాషను రూపొందించేందుకు త్వరపడటం. ప్రాచీనత విషయం పక్కన ఉంచి ఆధునికతవైపు మనం దృష్టి సారించాలి. ఆధునిక భాషగా తెలుగు మనగలిగేలా మనం నడుం బిగించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన సిసలైన భాషాభిమానుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. పీజీ స్థాయిలో తెలుగును అభ్యసించిన వాళ్లకు ఉపాధి అవకాశాలు అందివచ్చేలా హామీ ఇవ్వగలగాలి. ప్రహసనంగా మారిన జిల్లాకో విశ్వవిద్యాలయం ప్రణాళికలో ఎం.ఎ. (తెలుగు) కోర్సుకు అంతంతమాత్రం చోటుండటం ఆలోచించాల్సిన విషయం. ఎం.ఎ (తెలుగు)లో పత్రికారచనను రెండు పేపర్లుగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పాఠ్యప్రణాళికను కొత్త విశ్వవిద్యాలయాలు సిద్ధం చేసుకోలేకపోవటం అంతుబట్టని విషయం. ఓవైపు ఆరువేల బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో సీబీయస్ఈ కోర్సును ప్రవేశపెడుతున్న మన సర్కారు, ఆధునికభాషగా తెలుగును ఏ మేరకు నిలబెడుతుందన్న విషయంలో సవాలక్ష సందేహాలున్నాయి. యాభైఆరు అక్షరాల తెలుగు వర్ణమాల విషయంలో ప్రామాణికత సాధించాల్సి ఉంది. ప్రాచీన ద్రావిడ మాతృకలో పదహారు హల్లులూ, పది అచ్చులూ మాత్రమే ఉన్నాయి. క్రీ.శ. ఏడో శతాబ్ది తెలుగులో పది అచ్చులూ, ఇరవైఒక్క హల్లులూ ఉండగా కాలక్రమంలో సంస్కృత ప్రభావంతో మహాప్రాణ వర్ణాలు పది (శ, ష, హ...) వచ్చి చేరాయి. ప్రాకృతం నించీ 'ఱ' ప్రవేశించింది. మరీ ఎక్కువగా తెలుగులోకి యాభైవేలకుపైగా సంస్కృత పదాలు చేరి అచ్చతెలుగు కనుమరుగైంది. తెలుగు భాషకు అడ్డుగోడగా ఆంగ్లమే కాకుండా సంస్కృతమూ వచ్చి చేరింది. ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పొరేట్ కళాశాలల్లో సంస్కృతం స్థానంలో ద్వితీయభాషగా తెలుగును కనీసమాత్రంగానైనా అధికారభాషా సంఘం ఎందుకని అమలు చేయలేకపోతోందో చూడాలి. తెలుగు మీడియం పొత్తాల్లో తెలుగుపాలు ఎంతన్నది ఓ ధర్మసందేహం. సకశేరుకాలు (వెన్నెముక కలిగిన జీవులు), అకశేరుకాలు (వెన్నెముక లేని ప్రాణాలు)... వంటివి ఏ ఒక్కరికైనా బోధపడతాయా అన్నది ప్రశ్న. తెలుగులో సంతకంచేయని ఆచార్యులున్న భాషమనది. ఆంగ్లమాధ్యమంలో తరించిన సుపుత్రులున్న తెలుగు భాషోద్యమకారులు మనసొత్తు. ఇన్ని వైరుధ్యాల నడుమ తెలుగుభాష నడుం బెణక్కుండా ఆధునిక భాషగా రాణించటానికి పెద్దపెట్టున కృషి జరగాలి. అందుకు మన మనసుల విస్తీర్ణం పెరగాలి.

విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?


సంస్కృతం,తమిళం తో పాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలు గా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి.

తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు.

హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకర శాస్త్రి వాపోయారు.ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.

లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదా నిధుల్ని వినియోగించాలి.

సంస్కృతం,తమిళం తో పాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలు గా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.

మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి. తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.

1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం.

తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు. హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకరశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి వాపోయారు.
ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.ఇంగ్లీషు,తమిళ భాషల లాగా మన తెలుగులిపి సంకేతములు ప్రక్కప్రక్కనే కూడా ఉండేలా లిపిసంస్కరణ (ఇంకా రాయలేదు లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదాద్వారా వచ్చే నిధుల్ని వినియోగించాలి.

చక్కని తెలుగుకు చాంగుభళా!

చక్కని తెలుగుకు చాంగుభళా!
- రావూరి ప్రసాద్
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... ఏది నిజమైన ఆస్తి?

ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-
'ఎవరికైనా ఆస్తిఏముంటుంది?
సంగీతంలో సప్తస్వరాలు
సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ వైతాళికుడు గురజాడ వందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు-

నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!

ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి

తెలుగుభాషకు ప్రాచీన హోదా

తేనెలొలుకు భాష తెలుగుభాష, తెలుగు భాష మాట్లాడినా, చదివినా, విన్నా నిస్సందేహంగా అమృతంలా ఉంటుంది.అందుకు తగ్గట్లే రాష్ట్ర అధికార తెలుగు భాషా సంఘం చేసిన అవిరాళ కృషికి నేడు ఫలితం దక్కింది. ఇందుకుగానూ తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలుగు భాషాభిమానులకు తీపికబురు అందింది. తెలుగుభాషకు ప్రాచీనహోదా దక్కింది.
తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం వెనక రాష్ట్ర అధికార తెలుగు భాషా సంఘం చేసిన ప్రయత్నాలు ఆమోఘమైనవి. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో తెలుగు భాషా సంఘం కీలక పాత్ర వహించింది.ఈ వార్త వెలువడడం వెనక భాషాభిమానులు, విద్యావేత్తలు, కవులు, రచయితల కృషి మరువలేనిది. అంతేకాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఎబికె ప్రసాద్ చేసిన ప్రయత్నాలెన్నో.ఎబికే తెలుగు భాషా ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగుభాషకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఏబికే ప్రసాద్ నేతృత్వంలో తెలుగు భాషా సంఘం ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.
మాతృభాష విషయంలో గాంధీజీ ఆశించిన లక్ష్యాలు అనుకున్న విధంగా నెరవేరలేదు. స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలను స్పూర్తిగా తీసుకున్న ఏబికే అందుకు తగ్గట్లుగానే భాషా ఉద్యమానికి నడుంబిగించారు. ప్రపంచకీరణ పేరిట వ్యాపార ప్రయోజనాల కోసం మాతృభాషలను మింగజూసే ఆంగ్లీకరణ విధానం, తెలుగు భాషకు తెలుగు దనానికి చేటు తీసుకొచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఇప్పటికే తెలుగు భాషకు తీవ్రమైన నష్టం జరిగిపోయింది. పాఠశాల దశలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చివరకు మన ఇళ్లల్లో కూడా తెలుగు వాడకం కరువవడమే నేడు కరువైపోతున్న తరుణంలో తెలుగుభాషా సంఘం ప్రయత్నాలు ఆరంభించి అందులో సఫలీకృతమయింది.ఈ సందర్భంలో తెలుగు భాషా సంఘం ప్రదానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిలకు కృతఙ్ఞతలు తెలియజేసింది. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించినందుకు ప్రతి తెలుగువాడి ఇంట ఆనందం వెల్లువెరుస్తోంది.

నలుగురి కోసం 'నారాయణ'

నలుగురి కోసం 'నారాయణ'
సామాజిక సంబంధాలకే పెద్దపీట
అందరినీ కలుపుకుపోవడమే ఉత్తమం
మారుతున్న యువత ధోరణి
గుడికి వెళతారు.. కానీ పెద్దగా భక్తి లేదు. అర్చనలు చేస్తుంటారు.. కానీ అంత ఆసక్తితో కాదు. నేటి యువతలో భక్తి కొరవడుతోందని ఓవైపు.. లేదు మళ్లీ పెరుగుతోందని మరోవైపు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతను పలకరిస్తే.. ''భక్తిమాటెలా ఉన్నా 'సంప్రదాయాలను' మాత్రం వదులుకోం'' అని స్పష్టంగా చెబుతుండటం విశేషం!

''దేవునిపై నాకు ప్రత్యేకంగా నమ్మకం లేదు. అలాగని అపనమ్మకమూ లేదు. ఒక రకంగా ఆ విషయానికి నేను అంత ప్రాధాన్యం ఇవ్వను. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నలతోపాటు పండగలు జరుపుకుంటాను. బంధువులతో కలిసి చర్చికి వెళ్తా'' అని చెబుతారు కేరళకు చెందిన చైత్ర. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నారామె. భగవంతునిపై అంతగా నమ్మకం లేనప్పుడు చర్చికి ఎందుకు వెళతారు అని అడిగితే.. అందరితో కలవటం కోసం అని అంటారు! వెళ్లకపోతే అందరికీ దూరంగా విడిగా ఉండాల్సి వస్తుంది, అలా ఉండటం నాకు ఇష్టం లేదని చెబుతున్నారు చైత్ర. నేటి యువత ఆధ్యాత్మిక విషయాలు, ఆచార వ్యవహారాలను వేర్వేరుగా చూస్తున్నారనటానికి చైత్ర ఓ నిదర్శనం. ఈ ధోరణి కొద్దిమందికే, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్న సంపత్‌ను కదిలించినా ఇలాంటి అభిప్రాయమే వినిపిస్తుంది. ''దేవుని విషయంలో నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలేమీ లేవు. మిత్రులతో కలిసి ఎప్పుడైనా గుడికి వెళ్తుంటా. కాకపోతే గాఢమైన భక్తేమీ లేదు. ఓ పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్లని గమనిస్తూ ఉంటా'' అని అంటారు. పెళ్లి సంప్రదాయబద్ధంగా చేసుకుంటారా? లేక రిజిస్ట్రేషన్‌లాంటి పద్ధతుల్లో పయనిస్తారా? అని అడిగితే మొదటి దానికే తన ఓటు అని ఘంటాపథంగా చెప్పారు. ''పెళ్లంటే అమ్మానాన్నా, బంధువులు, స్నేహితులు... వీరందరితో ముడివడిన అంశం. నా ఒక్కడికే పరిమితమైంది కాదు. వాళ్లందరి అభిప్రాయాలను, నమ్మకాలను కాదని నేను వెళ్లను. అందిరినీ కలుపుకొని పోతేనే ఆనందం కదా'' అని తన దృక్పథాన్ని వివరిస్తారు సంపత్.

మార్పు వస్తోంది
ఇప్పటికీ ఎంతో దీక్షగా పూజలు, ఉపవాసాలు చేసే యువతీయువకులూ కొదవ లేదు. నల్గొండకు చెందిన మనోహర్ పొద్దున్నే సూర్యనమస్కారంతోనే దినచర్య ప్రారంభిస్తారు. ప్రతీ శనివారం తప్పకుండా గుడికి వెళ్తారు. జీవితంలో ఏది జరగాలన్నా భగవంతుని కృప ఉండాలనీ, దానికి మన ప్రయత్నం తోడుగా నిలవాలని చెబుతారు. మరోవైపు 'గాఢ భక్తికి కారణం భయమేనంటారు' నిజామాబాద్‌కు చెందిన ఎంఏ విద్యార్థి శ్రీకాంత్‌రెడ్డి. ''దేవుణ్ణి నమ్మకపోతే ఏమైనా అవుతుందేమోనని భయం. ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌కు ముందు పూజలు చెయ్యలేదా? ఆ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకమే వాళ్లకు ఉంటే పూజలు చేసేవారా?'' అని ప్రశ్నిస్తారు. విషయం ఏమిటంటే ఆయన కూడా దేవున్ని నమ్ముతారు. మరి, మీకున్న భయమేమిటి అని అడిగితే, ''జీవితంలో ఎలా స్థిరపడతానో అనే భయం. ఆ తర్వాత అనువైన భార్య దొరకాలని, పిల్లలు పుట్టాలని ఇలా... కోరికలు వాటితోపాటే భయాలు వస్తూనే ఉంటాయి'' అని నిర్మొహమాటంగా తన అంతరంగాన్ని వెల్లడిస్తారు. భయం మాటెలా ఉన్నా.. యువతరం భక్తిలో ఆధ్యాత్మికమైన గాఢత లేకపోవటం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతున్న వాస్తవం. యువత ఆలోచనల్లో వస్తున్న ఇలాంటి మార్పుల వల్లే భక్తి-సంప్రదాయాలు రెండూ ఇప్పుడు వేర్వేరు దార్లుగా మారిపోయాయి.

దేని దారి దానిదే
గతంలో భక్తి, సంప్రదాయం రెండూ కలిసిపోయే ఉండేవి. గుడికి వెళ్లటంలో, పూజలు చేయటంలో ఎంత ఉత్సాహం కనిపించేదో పండగలు, తంతుల్లోనూ అంతగా మమేకమయ్యేవారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అవినాభావం తగ్గుతోంది. పరీక్షల సమయంలోనో, ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వచ్చినప్పుడో, మరేదైనా సమస్య తలెత్తినప్పుడో తప్ప దైనందిన జీవితంలో దైవానికి తొలిప్రాధాన్యం ఇవ్వటం తక్కువేనంటున్నారు చాలామంది యువకులు. ఆడపిల్లలు మాత్రం ఇందుకు కొద్దిగా భిన్నం. రోజువారీ భక్తిగా ఉండే ఆడపిల్లల సంఖ్య కొంత ఎక్కువగానే కనబడుతోంది. ఈ భక్తి మోతాదు యువతలో ఎలా ఉన్నా.. సంప్రదాయాలకు మాత్రం అంతా పెద్దపీట వేస్తుండటం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గుంటూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్‌నే తీసుకుంటే... తాను దేవున్ని నమ్మనని, నాస్తికుణ్ణని చెబుతారు. ఏడాది క్రితం ఆయన పెళ్లి మాత్రం సంప్రదాయబద్ధంగానే జరిగింది. పెళ్లితంతుపై నమ్మకం లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే 'అమ్మానాన్న బాధపడతారు, అందరూ నన్ను దూరంగా ఉంచుతారు. అంత రిస్కు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ తంతు కాదంటే పెద్ద రభస. అదే తలూపితే.. అంతా ఎంజాయ్ చేస్తారు కదా' అంటారు.

మొత్తానికి వ్యక్తిగత నమ్మకాలెలా ఉన్నా.. సామాజిక జీవనానికి సంప్రదాయాలే ఆలంబనగా నిలుస్తున్నాయన్న విషయం యువత అభిప్రాయాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ పాలూనీళ్లలా కలగలిసిపోయిన భక్తి-ఆచారాలను.. నేటి యువత హంసలా నేర్పుగా వేరు చేస్తుండటం విశేషం

Tuesday, November 11, 2008

వెబ్‌లో అంత్యక్రియలు

దహన సంస్కారం.. దేశదేశాలా వీక్షణం వెబ్‌లో అంత్యక్రియలు ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం ఎన్నారైల్లో ప్రత్యేక ఆసక్తి;అయ్యో.. కడసారి చూపైనా దక్కలేదే&; ఆత్మీయులు చనిపోయినప్పుడు దూరప్రాంతాలు, విదేశాల్లోని బంధువులు అనుకునే మాటే ఇది. కానీ.. దీనికీ ఓ అత్యాధునిక పరిష్కారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. అంత్యక్రియల తంతు యావత్తూ ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇప్పుడు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి.

ఇప్పటికే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు సంస్థలు ఈ సదుపాయాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ప్రసారాలు మున్ముందు మరింతగా విస్తరించటం తథ్యమంటున్నారు పరిశీలకులు.వివేక్ అమెరికాలో ఉంటాడు. గుజరాత్‌లో ఉండే తన అమ్మమ్మ ఓ రోజు హఠాత్తుగా చనిపోయింది. తానున్న పరిస్థితిలో వెంటనే బయలుదేరి రావటం అసంభవం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? అయినవాళ్లందరికీ దూరంగా.. ఒక్కరే తమలోతాము కుమిలిపోతారు. కానీ వివేక్ అలా విచారించలేదు. అమెరికాలోనే ఉండి అమ్మమ్మ అంత్యక్రియలను, అక్కడ చేరిన బంధువులందరినీ ప్రత్యక్షంగా చూశాడు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అంతా వెబ్‌కాస్ట్; మహిమ. గుజరాత్‌లోని ముక్తిధామ్ శ్మశానవాటిక ఇంటర్‌నెట్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందిస్తోంది మరి. దూరప్రాంతాల్లో ఉన్న బంధువుల కోసం దహనక్రియలను ఇలా నెట్‌ద్వారా ప్రసారం చేస్తోంది. దీనికోసం తమ వెబ్‌సైట్ ్ఝ్య్త్మ్ౖట్త్చ్ఝ.్న్్ణలో ప్రత్యేక స్థానాన్ని కేటాయించింది. అంత్యక్రియలకు రాలేకపోయిన బంధువులు, స్నేహితులకు నిజంగా ఇక్కడే, తమవారందరితో ఉన్నామన్న భావన కలిగించడమే దీని ఉద్దేశం; అని అంటున్నారు ఈ ముక్తిధామ్ మేనేజర్ అశోక్ ఆచార్య.

కుమారుడు అమెరికా నుంచి రావటంలో జాప్యం జరగటంతో ఓ వృద్ధుడి శవాన్ని రెండురోజుల వరకు అలాగే ఉంచాల్సి వచ్చింది. అప్పుడే మాకీ ఆలోచన వచ్చింది. స్థానిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల సాయంతో కొద్దిరోజుల్లోనే దీన్ని ప్రారంభించాం అని చెప్పారు. వారి శ్మశానవాటికలో రెండు వెబ్ కెమెరాలను ఇంటర్నెట్‌కు అనుసంధానం చేశారు. కావలసిన వారంతా పాస్‌వర్డ్ తీసుకుని దేశవిదేశాల్లో ఎక్కడున్నా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పైగా ఈ సేవ మొత్తం నామమాత్రంగా ఒకే ఒక్క రూపాయికి అందిస్తుండటం విశేషం. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి రావటంతో ప్రసార నాణ్యత పెరగటమే కాకుండా, దీనికయ్యే ఖర్చూ తగ్గిందనీ, ఇలా ఇప్పటివరకూ 18 దేశాల్లోని బంధువులు 300 మంది అంత్యక్రియలను చూడగలిగారని అశోక్ తెలిపారు. నెలకు దాదాపు 8 అంత్యక్రియలను ఇలా వెబ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు.ఇలాంటి శ్మశానవాటికే చెన్నైలో మరోటి ఉంది. మద్రాస్ సెమెటరీస్ బోర్డ్ తమ వెబ్‌సైట్ ద్వారా అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది. క్రైస్తవుల కోసం ఉద్దేశించిన ఈ శ్మశానవాటిక.. ప్రత్యక్షప్రసారంతో పాటు వాటిని రికార్డు చేసి మరీ తమ సైట్‌లో ఉంచుతోంది. కావాలనుకుంటే దాన్ని డీవీడీ రూపంలోనూ తీసుకోవచ్చు.మొత్తానికి వూపందుకుంటున్న ఈ కొత్త ధోరణి.. అంత్యక్రియలకు హాజరుకాలేని కుటుంబ సభ్యులు, బంధువులకు ఎంతో చింత తీరుస్తోంది. ఇక ఇంటర్నెట్లో పెళ్లిచూపులే కాదు.. ఆఖరి చూపులూ చూస్కోవచ్చు!

Tuesday, October 21, 2008

గోంగూర పచ్చడి gongura pachhadi

గోంగూర పచ్చడి రుచి తెలియనివారు ఆంధ్ర లో ఉండరు. ప్రతి సుభా కార్యామునకు గోంగూర పచ్చడి సుబాసుచికము.

కావలసిన పదార్థాలు :

గోంగూర... రెండు కట్టలు(లేత)
పచ్చిమిరపకాయలు... తగినన్ని
ఎండుమిరపకాయలు... పోపుకు సరిపడా
నూనె... సరిపడా
ఉల్లిపాయలు... రెండు
వెల్లుల్లిపాయలు... గుప్పెడు రేకలు
కరివేపాకు... పోపుకు సరిపడా
మెంతులు... కాసిన్ని
ఆవాలు, జీలకర్ర... పోపుకు సరిపడా
ఉద్దిపప్పు, శనగపప్పు... పోపుకు సరిపడా
ఇంగువ పొడి... చిటికెడు

తయారీ విధానం :
ముందుగా గోంగూరను విడిపించుకుని, నీటిలో రెండు లేదా మూడుసార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాల్సినన్ని పచ్చిమిరపకాయలను తొడిమలు తీసి పక్కన ఉంచుకోవాలి. వెడల్పు బాణలిలో కాస్తంత నూనె వేసి వేడిచేయాలి. అందులో ముందుగా పచ్చిమిర్చి వేసి, కాసేపు వేగిన తరువాత గోంగూరను వేసి మూత పెట్టి సన్నని మంటపై ఉడికించాలి.

ఆవిరికి ఉడికి గోంగూర బాగా దగ్గరై ముద్దగా వచ్చిన తరువాత దించేసి పక్కన వేడి పోయేంతదాకా ఆరబెట్టుకోవాలి. తరువాత గోంగూర ముద్దకు ఉప్పు కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

తాలింపు పెనంలో కాస్తంత ఎక్కువగానే నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువపొడి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కలిపి పోపు పెట్టుకోవాలి.

పోపుగింజలు, వెల్లుల్లిపాయలు బాగా వేగిన తరువాత మిక్సీలో రుబ్బుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలియబెట్టాలి. ఉప్పు సరిపోయేంత ఉందో, లేదో చూసుకుని ఆయిల్ పైకి తేలేంతదాకా సన్ననిమంటపై కాసేపు ఉంచాలి. అంతే పుల్ల పుల్లని గోంగూర పచ్చడి రెడీ.

తెలుగువారి లోగిళ్ళలో ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండే ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నానికి కమ్మటి నేతిని కలుపుని తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ ఆనందం మీకు కూడా అనుభవంలోకి రావాలంటే వెంటనే గోంగూర పచ్చడిని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు కదూ...!

గమనిక :పచ్చడిలో వేసి అందులోనేఆనియన్ ముక్కలు కలిపి తింటే వావ్ భలేరుచి :)
(
నేనైతే కొన్ని ఎండు మిర్చిని చేత్తో నులిపి కలుపుతాను :)
English :
Gongura Chutney

this is most favorable food in andhra . i think every one in andhra pradesh are in found of taste with it. so i am helping for some self cooking NRi by this post.

Recipe:

I bunch of gongura - Leaves plucked and washed
1 big onion - cut into big chunks
8 green chillies
¼ tsp of salt
2 teaspoons of peanut oilIn an iron skillet, heat peanut oil. Add and saut? the onion chunks and green chillies to light brown color on medium-high heat.

remove to a plate.In the same skillet, add gongura leaves and stir-fry them on medium-high for few minutes until they come together and lose their bright green color. Remove to a plate and let cool.Take them all in a mortar, add salt and with a pestle grind them to a coarse consistency.Serve with rice, dal and a curry with little bit of ghee sprinkled on, for a traditional Andhra meal.


Monday, October 20, 2008

మనసు మంచి 'ముత్యం'

మనసు మంచి 'ముత్యం'
బస్టాండ్‌లు.. రైల్వేస్టేషన్‌లు.. చెత్తకుప్పలు... ఆస్పత్రులు.. గుళ్లు.. ఇలా ఎక్కడెక్కడో వదిలేసిన నెలల శిశువులను అక్కున చేర్చుకుంటుందామె. పురిటిబిడ్డలను పొదివిపట్టుకుని పెంచిందామె. లాలపోసింది... బువ్వపెట్టింది... పెద్దయ్యాక విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లిళ్లు చేసే బాధ్యతకూడా తానే స్వీకరించింది.

పొత్తిళ్లలో శిశువులుగా ఆమె నీడన చేరిన ఎందరో నేడు పట్టభద్రులయ్యారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. అయినా, ఆమెతో అనుబంధాన్ని మాత్రం వీడలేదెవరూ. ఇంతకీ ఈమె ఎవరంటారా! కర్నూలు జిల్లాకు చెందిన ముత్తులక్ష్మి. ఇరవై ఎనిమిదేళ్లుగా ఇదే సేవలో తరిస్తోంది. ముత్తులక్ష్మి పెళ్లే చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశమే ఆమెకు కలుగలేదు. మదర్ థెరిస్సానే స్ఫూర్తి అంటుందామె.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ముత్తులక్ష్మి ఆశ్రమం ఉంది. ముత్తులక్ష్మి స్వగ్రామం మంత్రాలయం మండలం ఖగ్గలు. ముంబాయిలో ఉండేవారామె తలిదండ్రులు. అప్పుడే ఆమెలో ఈ సేవాతత్పరతకు బీజం పడింది. 'పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు మా బడికి మదర్ థెరిస్సా వచ్చారు. పిల్లలందరినీ ముద్దాడిన మదర్ నన్ను మాత్రం పట్టించుకోనేలేదు. ఎంతో చిన్నబుచ్చుకున్నాను. బోలెడంత ఏడుపొచ్చింది. కనీసం ఆమె చేతిస్పర్శ భాగ్యం కూడా కలగలేదే.. ఎందుకిలా జరిగిందని నాలో నేనే కుమిలిపోయా. అయితే, మదర్ వీడ్కోలు తీసుకునేముందు నవ్విన నవ్వు మరచిపోలేకపోయాను. ఆమె చూపు నన్ను వెన్నాడుతూనే ఉండేది. ఆ తర్వాత కొన్నిరోజులకు మా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. రైల్వేఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు వినపడిన పసిపాప ఆక్రందన నన్ను కదిలించింది. వెతగ్గా ప్లాట్‌ఫారంపై ఎవరో వదిలి వెళ్లిన పసిగుడ్డు కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. అప్పుడర్థమైంది. ఇక నుంచి నేనాచరించాల్సిన ధర్మం అదేనని. మదర్ సందేశం కూడా అదేనేమో..' అంటుందామె 28 ఏళ్లనాటి అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ... తర్వాతే జ్యోతిఆశ్రమం ఏర్పాటైంది. దాని నిర్వహణకోసం ముత్తులక్ష్మి ఎవరి పైనా ఆధారపడాలనుకోలేదు. కూలీ డబ్బులతోనే ఉన్నంతలో అందరికీ భోజనం పెట్టగలిగింది. ధర్మాత్ములందించిన సాయంతో శక్తిమేరకు పిల్లలకు విద్యాబుద్ధులూ చెప్పించింది. తానేదో ఘనకార్యం చేశాననుకోవడం లేదంటుందామె. ఉన్నంతలో ఆర్తులకు సాయపడ్డానన్న సంతృప్తి చాలు అంది 'వసుంధర'తో. ఉడతాభక్తిన సాటిమానవులకు ఆమె చేస్తున్న సాయం అభినందనీయం కాదంటారా!
- ఎస్. రవీందర్‌రావు,

భయపెడుతున్న భాష!

భయపెడుతున్న భాష! ఉద్యోగులకూ ఇంగ్లిషు పాట్లు-స్వల్పకాల కోర్సులు నిష్ఫలం-గ్రామీణులకు పెద్ద బెంగ ఒకప్పుడు భారతీయుల్ని ఇంగ్లిషు వారు 'విభజించి' పాలించారు. ఇప్పుడా పని ఇంగ్లిష్ చేస్తోంది. ఈ భాషపై పట్టున్నవారు చదువుల్లో, ఉద్యోగాల్లో రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోతుంటే.. లేనివారు ఎక్కడికక్కడే చతికిలపడుతున్నారు.


కార్పొరేట్ సంస్కృతి పెరుగుతున్న కొద్దీ వీరు తీవ్రమైన న్యూనతలోకీ జారిపోతున్నారు. దీనంతటికీ చిన్నతనం నుంచీ సరైన ఆంగ్ల బోధన లేకపోవడమే ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు. ఇంగ్లిష్ అంటే ఒకప్పుడు విద్యార్థులకు మాత్రమే భయం. కానీ ఇటీవలి కాలంలో చాలా మందిని ఇది జీవితాంతం వెన్నాడుతోంది. ముఖ్యంగా ఉద్యోగార్థులకు కునుకు పట్టనీయడంలేదు. ఇంటర్వ్యూల్లో, ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో ప్రతి చోటా ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరవుతోంది. ఫలితంగా ఎంతో మంది ప్రతిభ ఉండీ, కేవలం ఇంగ్లిష్‌లో వెనకబడిన కారణంగా పైకెదగలేకపోతున్నారు. లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయడంతో రెండుసార్లు పదోన్నతి వచ్చింది. ఇప్పుడు మా సంస్థ తరపున పొరుగు రాష్ట్రాలకూ వెళ్తున్నా.


కానీ, ఇంగ్లిష్ అంతగా రాకపోవడంతో సరిగా మాట్లాడలేకపోతున్నా. కేవలం ఇంగ్లిష్ రావడం వల్లే మా సహచరుడొకరు చాలా పేరు తెచ్చుకున్నాడు. చివరికి హోటళ్లలో వెయిటర్లు కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే నాకు ఎంత నామోషీగా ఉంటుందో అంటున్నారు బీమా కంపెనీ ఉద్యోగి శివలింగం. ఎలాగైనా ఇంగ్లిష్‌ను దారిలోకి తెచ్చుకోవాలని ఓ 'స్పోకెన్ ఇంగ్లిషు కోర్సు'లో చేరారాయన. అలాగే ఇటీవలే నార్కట్‌పల్లి నుంచి వచ్చిన వెంకటేశ్ ఓ హెచ్ఆర్ ట్రైనీ ఇంటర్వ్యూకి వెళ్లాడు. అక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ యూ ఆర్ డూయింగ్ అనే వాక్యాల్లో వ్యాకరణం పరంగా ఏది సరైనదో చెప్పమంటే తేల్చుకోలేకపోయాడు. ఉద్యోగం చేజారింది. ఇలాంటి చిన్నచిన్న తేడాలను గుర్తుపట్టడం కూడా ఎందుకంత కష్టంగా మారుతోంది? దీనికి, చిన్నతనం నుంచీ సరైన ఆంగ్లబోధన లేకపోవడం, చుట్టుపక్కల ఈ భాష మాట్లాడే వాతావరణం కొరవడడం, తెలుగులో ఆలోచించి ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించడమే కారణం అంటున్నారు 'రమేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్' డైరెక్టర్ సంజయ్. వీటన్నింటినీ మించి ఆత్మవిశ్వాసం లేకపోవటం పెద్ద అవరోధంగా నిలుస్తోంది. నల్గొండలో ఎంబీఏ చేశా. ఇంటర్వ్యూల్లో ఇంగ్లిష్‌లోనే వివరాలు చెప్పమంటున్నారు. మాట్లాడితే ఎక్కడ తప్పులు దొర్లుతాయేమోనని, నవ్వుతారేమోనని భయం అంటున్నాడు 26 ఏళ్ల ఎం.శ్రీనివాస్.

ఇలా ఇంగ్లిష్, సాఫ్ట్‌స్కిల్స్‌లో నైపుణ్యం కొరవడడం వల్ల.. ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇంజినీరింగ్ అభ్యర్థుల్లో 65%-75% మంది, ఇతర అభ్యర్థుల్లో 83% మంది ఎంపిక కావడం లేదని 'నాస్కామ్స్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్' కూడా తేల్చింది. వీరందరికీ ప్రస్తుతం ఆంగ్ల భాషణ శిక్షణ సంస్థలే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామీణ విద్యార్థులే ఎక్కువగా చేరేవాళ్లు. కానీ ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నవారిలో 95% మంది ఉద్యోగార్థులే అంటున్నారు హైదరాబాద్‌లో రామకృష్ణమఠం నడిపే లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి అనుపమానంద. ఇంగ్లిష్ కోసం ఏటా 12 వేల మంది ఈ సంస్థను ఆశ్రయిస్తుండడం విశేషం. మరో సంస్థ రస్సెల్స్‌లో కూడా స్పోకెన్ ఇంగ్లిషు కోసం వచ్చేవారి సంఖ్య ఏటా 25% పెరుగుతోంది. గత రెండేళ్లలో పరిస్థితి చాలా మారిందంటున్నారు సంస్థ ప్రతినిధి.

ఇప్పుడు చాలా సంస్థలు 'కార్పొరేట్ ఇంగ్లిష్', సాఫ్ట్ స్కిల్స్ కలిపి నేర్పించే కోర్సుల మీద దృష్టిపెడుతున్నాయి. చిన్నతనం నుంచీ పిల్లలకు స్కూళ్లలో సరైన ఆంగ్లబోధన లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏ భాషనైనా పూర్తిస్థాయిలో నేర్చుకోవడానికి ఆరేళ్లు చాలు. అందుకే మన దగ్గర పదో తరగతి దాకా తృతీయ భాషగా ఉన్న ఇంగ్లిష్‌ని ఇంటర్మీడియట్‌లో ప్రథమ భాషగా చేశారు. అంటే 5 నుంచి పదోతరగతి పూర్తయ్యేసరికి ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధిస్తారన్నదే మూల భావన. కానీ, ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పదో తరగతిలో 90% మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా ఇంటర్‌లో ఇంగ్లిష్ అంటేనే బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ విద్యాసంస్థల్లో బోధనా సౌకర్యాలు కొరవడడం, నైపుణ్యంగల ఉపాధ్యాయులు లేకపోవడం, పిల్లలు కూడా ఆ సమయంలో ఇంగ్లిషు ప్రాధాన్యాన్ని అంతగా గుర్తించకపోవడం ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు స్వామి అనుపమానంద.


ఇలాంటి వాతావరణంలో చదువుకున్నవారే డిగ్రీ పూర్తయినా ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి ఇంగ్లిష్ కారణంగా బోల్తా పడుతున్నారు. వెంటనే నేర్చేసుకోవాలని 'క్రాష్ కోర్సుల'ను ఆశ్రయిస్తున్నా.. నిజానికి అప్పటికప్పుడు ఇంగ్లిషు మాట్లాడడం అసాధ్యం. స్వల్పకాలిక కోర్సుల వల్ల అభ్యర్థులకు వచ్చేది నాలుగు ఇంగ్లిషు పదాలే తప్ప భాష కాదు అన్నది నిపుణుల వాదన. అందుకే వీరిలో చాలా మంది అక్కడా ఇమడలేక ఆ కోర్సులను మధ్యలోనే మానేస్తుంటారు. నేను మూణ్నెళ్ల స్పోకెన్ ఇంగ్లిషు కోర్సులో చేరా. గ్రామర్ అర్థమవుతున్నట్టున్నా మాట్లాడటం రాలేదు. ఇక నా వల్ల కాదని మానేశా అంటున్నారు మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీహరి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నతనం నుంచీ ఇంగ్లిష్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో పత్రికలు, పుస్తకాలు చదవడం, బాగా వినడం, తోచిన ఆలోచనలను సొంతంగా రాయడం, బెరుకులేకుండా ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.(

సమతతో సమృద్ధా? మతంతో పతనమా?

సమతతో సమృద్ధా? మతంతో పతనమా?
గురుచరణ్‌దాస్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ ఛాందసవాదుల బాంబు దాడులు, ఒరిస్సాలో క్రైస్తవులపై హిందూ మౌఢ్యుల దాడులు పాతగాయాలను రేపాయి. మనల్ని మళ్లీ రెండు వర్గాలుగా చీలుస్తున్నాయి. అంతర్జాతీయ సంక్షోభంతో పాటు స్వదేశంలో మత ఛాందసవాదం కూడా భారత ఆర్థికాభివృద్ధికి సవాళ్లు విసురుతోంది. మనం ఆశిస్తున్న భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తోంది. భారత్ శాంతియుతంగా కొనసాగించే ఆర్థికాభివృద్ధి 21వ శతాబ్దపు విజయగాథగా నిలుస్తుందా? లేదా మత యుద్ధాలతో మన భవిష్యత్తు గాడి తప్పుతుందా?

ఆధునిక, సంపన్న, ప్రజాస్వామిక దేశంగా భారత్ మారడాన్ని ఎవరూ ఆపలేరన్నది నా విశ్వాసం. ఇస్లామిక్, హిందూ అతివాదాలు అరాచక సంస్కృతికి రెండు భిన్న ముఖాలు. కాలక్రమేణా అవి ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. కొంతకాలం తర్వాతైనా ఛాందసవాదులు మంచి ఉద్యోగాలను, ఇళ్లను, తమ పిల్లలకు చక్కటి పాఠశాలలను పొందుతారు. యుద్ధం కంటే శాంతికి మద్దతు పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి పోరాటం కంటే వ్యాపారమే మంచి సాధనం అవుతుంది. విశ్వాసం, సహకారం ముందు హింస తలవంచుతుంది. తద్వారా రాజకీయ ఇస్లాంవాదం, రాజకీయ హిందూవాదం విఫలమవుతాయి. ఈ వాదనను చరిత్ర నిరూపించింది. గత రెండు శతాబ్దాల్లో సానుకూల సామాజిక వ్యవస్థలన్నింటినీలోనూ ప్రజాస్వామ్యం, మార్కెట్ ఆర్థిక విధానాల కలయిక విజయవంతమైంది. భూస్వామ్యం, రాజరికం, నియంతృత్వం, కమ్యూనిజం తదితర వ్యవస్థలపై ఉదార ప్రజాస్వామ్యం పైచేయి సాధించింది. శతాబ్దం క్రితం ప్రపంచంలో 10 ప్రజాస్వామ్య దేశాలుండగా ఇప్పుడు 120 ఉన్నాయి.

భవిష్యత్తు సంక్షోభాలు దేశాల మధ్య కాకుండా మత, సాంస్కృతిక నాగరకతల మధ్య తలెత్తుతాయని 'ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' అనే గ్రంథంలో రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ వాదించారు. ఎదుగుతున్న ఇస్లామిక్‌వాదం, బలమైన శక్తిగా మారుతున్న చైనాతో చేతులు కలిపి పశ్చిమదేశాలకు సవాలు విసురుతుందని ఆయన అంచనా వేశారు. అయితే కమ్యూనిజం పతనమయ్యాక చాలా దేశాల్లో పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడతాయని 'ది ఎండ్ ఆఫ్ హిస్టరీ' అనే గ్రంథంలో ఫ్రాన్సిస్ ఫుకుయామా సూత్రీకరించారు. తద్వారా ప్రపంచం శాంతియుతంగా మారతుందని అభిప్రాయపడ్డారు. మనుషులు సంపన్నులయ్యాక ఒకానొక దశలో షాపింగ్‌మాళ్లు, వినియోగ సంస్కృతి పట్ల విసుగుచెందుతారనీ, కొత్తరకమైన సంతృప్తి కోసం మతాన్ని, యుద్ధాన్ని ఆశ్రయిస్తారని విశ్లేషించారు. అమెరికాలో క్రైస్తవం పునరుజ్జీవం పొందడం ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు. దీన్ని 'ద నెక్ట్స్ క్రిస్టెన్‌డమ్: ద రైజ్ ఆఫ్ గ్లోబల్ క్రిస్టియానిటీ' పేరుతో ఫిలిప్ జెంకిన్స్ గ్రంథస్తం చేశారు. విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, రాజకీయంగానూ కీలకపాత్ర పోషించే సరికొత్త మిషనరీ క్రైస్తవత్వాన్ని గుర్తించారు. ఈ కొత్త మిషనరీలు భారీగా సాగిస్తున్న మత మార్పిడులే భారత్‌లో హిందూ అతివాదవర్గాల ప్రతిఘటనకు కారణమా అన్నది సందేహం.

తీవ్ర ఇస్లామిక్‌వాదం లేదా జిహాదిజం మతపరమైన సిద్ధాంతంగా కంటే రాజకీయ భావనగానే కనిపిస్తోంది. సయ్యిద్ కుతుబ్, బిన్ లాడెన్‌లు రాజకీయ హింసావాదాన్ని ఉపయోగించుకున్నారు. ఇది ఇస్లాం నుంచి వచ్చింది కాదు. ఐరోపాలోని అతివాద, అరాచక సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చింది. ఈ ప్రమాదకర ధోరణి తన రాజకీయ లక్ష్యాల కోసం ఇస్లాంను ఉపయోగించుకుంది. పశ్చిమ దేశాలకు దూరంగా ఉండే అరబ్, ఐరోపా ముస్లింలలో దీనికి పట్టు దొరికింది. ఇక ఉగ్రవాద సవాలు నుంచి భారత ఉదార ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకోవాలన్నది ప్రశ్న. ఈ విషయంలో ఇప్పటివరకు మనం అమెరికా కంటే చక్కటి పరిణతితోనే ప్రతిస్పందించాం. వారి తరహాలో అందరినీ అనుమానించే తీరును మనం అనుసరించలేదు. ఇది ఉగ్రవాదుల స్త్థెర్యాన్ని దెబ్బతీసి ఉండాలి. అయితే అనేకమంది ఉదార ముస్లింల మధ్యలో ఉన్న అతి కొద్దిమంది ఉగ్రవాదులను పట్టుకోవడంలో మన భద్రతా సంస్థలు విఫలమయ్యాయి. మరో 9/11 దాడి జరగకుండా నివారించిన అమెరికా తరహాలో మనం వ్యవహరించలేకపోయాం. దీన్నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పౌరులకు మత, కులపరమైన గుర్తింపును కొనసాగించడం ద్వారా వ్యక్తులుగా వారి ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో ప్రభుత్వంకూడా విఫలమైంది. మన రాజ్యాంగం ప్రకారం ఒక సమూహంకంటే వ్యక్తి ఔన్నత్యాన్ని కాపాడడమే ప్రభుత్వ ప్రాధాన్యంకావాలి. అయితే ఓటు బ్యాంకు వ్యవస్థలో ఇదేమంత సులభం కాదు. ఆధునిక లౌకికవాద రాజకీయాలు రాత్రికిరాత్రి పుట్టుకురాలేదు. పశ్చిమదేశాల్లో దీనికి కొన్ని శతాబ్దాలు పట్టింది. ఈ విషయంలోనే ఇస్లామిక్ ప్రపంచం సమస్యను ఎదుర్కొంటోంది. ఇక భారత్‌లో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. మన ఉదార ప్రజాస్వామ్యం మతతీవ్రవాదంపై విజయం సాధిస్తుంది. చివరికి బహుళత్వ, లౌకిక, శాంతియుతభారతం సాకారమవుతుంది.
-వ్యాసకర్త ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాకు మాజీ ఛైర్మన్, ఎండీ.
'ముక్తాభారత్' గ్రంథ రచయిత.

humanism can be written as religion

In India, atheism finds its voice Team DNA Monday, October 13, 2008 03:29 IST

Atheists — traditionally defined as those who disbelieve in God or religion — have found their voice in the wake of the religious tension riving the globe's societal fabric.

Across the planet, the number of atheist organisations has increased, and India has been no exception to this trend. The Federation of Indian Rationalist Associations that started in 1997, is an umbrella body comprising more than 50 rationalist and atheist organisations.

These organisations believe in the supremacy of humanism above religion, and are committed to spreading this message. The Science and Rationalists' Association of India is one such organisation, based in Kolkata, that has waged the battle to make Humanism a viable and legally recognised ideology, and won. The association' s founder, Prabir Ghosh, says, "In 1993, we won the case in court, and now 'humanism' can be written, wherever one's religion needs to be stated." Elaborating on his faith in humanism, he says, "I have read a lot about religion, and I realised that none of them tell the truth. All religions believe they are the most superior and this results in fights. I then recognised humanism as the most important:

Think about your fellow human beings and treat them as equal." The Atheist Centre, one of the oldest atheist organisations in India, started in 1940 in Andhra Pradesh. This organisation was started by Goparaju Ramachandra Rao and Saraswathi Gora to initiate social change in rural India, and they also were an active part of the national movement. Dr Vijayam, the executive director of the Centre, says, "Saraswathi Gora was initially a believer. Once when there was an eclipse, she saw only Hindus hide while Christians and Muslims were moving about freely. She then started questioning old beliefs and that subsequently led to the founding of the Atheist Centre."

According to Dr Vijayam, religion is only equated with houses of worship. He says, "Only three times in life does religion really holds any importance: Birth, marriage and death. The biggest problems are religious groups and politicians. Everyone became a part of the freedom movement, irrespective of caste or religion. Now we are divided on religious lines and that is the reason for the communal tension." He also strongly advocates that State should be separated from religion.


This is a view shared by many, including social acitivist, Teesta Setalvad. "There should be a common gender code that takes the best practices from all religions, and politicians should be completely barred from using religion as a means to gather votes." She adds that the spiritual aspect of religion is completely forgotten, with emphasis being laid only on ritual aspects. Most atheists, however, agree that an increasing number of youth are moving away from religion. Talking of the destruction that religion can cause, Megh Raj Mitter, founder of Tarksheel Sanstha, in Punjab, says, "I have talked to people of all religions, and they agree that humanity is the most important thing. But they still go around killing people. Countlesss people have been killed in the name of religion in India." A non-religious State, according to atheists, is the best solution. "Religion should be banned. It becomes uncontrollable. Religion has nothing to do with morality or moral values. If it did, then in a country like India where religion is so important would have no corruption or crime," says Mitter.

Monday, October 06, 2008

నాన్నకు వద్దా సెలవు? 'సంరక్షణ' ఎవరిది?

నాన్నకు వద్దా సెలవు? 'సంరక్షణ' ఎవరిది?

నాన్నకు వద్దా సెలవు?
'సంరక్షణ' ఎవరిది?
కొత్త సెలవులపై రేగుతున్న చర్చ
పిల్లల పెంపకం ఎవరి బాధ్యత? దీనిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు సంవత్సరాల శిశు సంరక్షణ సెలవు(చైల్డ్ కేర్ లీవ్) ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటమే ఈ తాజా చర్చకు మూలం. దీనివల్ల తల్లులకు పిల్లల్ని దగ్గరుండి చూసుకునే వెసులుబాటు లభిస్తుందని ఓవైపు సంతోషం వ్యక్తమవుతుండగా.. మరోవైపు పిల్లల సంరక్షణ, పెంపకం పూర్తిగా ఆడవారి బాధ్యతేనా? మగవారికి ఇందులో ఏ పాత్రా లేదా? ఈ సెలవులతో పిల్లల పెంపకమన్నది కేవలం స్త్రీల బాధ్యతేనని అధికారికంగా కూడా గుర్తించినట్టు కాదా?.. ఇలాంటి చిక్కుప్రశ్నలెన్నో రేగుతున్నాయి.

రోజంతా రకరకాల పనులతో అలసిపోయి ఇంటికొచ్చే ఉద్యోగినుల కోసం.. ఇంటి దగ్గరా గంపెడు చాకిరీ ఎదురుచూస్తుంటుంది. పిల్లల హోంవర్కులూ, చదువుల 'బాధ్యత'లూ వీటికి అదనం. ఇటీవల 'అసోచామ్' నిర్వహించిన సర్వేలో కూడా పిల్లలతో గడపడం, దగ్గరుండి వారిని చదివించటం వంటి బాధ్యతలన్నీ స్త్రీలవేనని ఎంతోమంది పురుషులు అభిప్రాయపడుతున్నట్టు వెల్లడైంది. 4% మంది తండ్రులే వాటిలో తమకూ బాధ్యత ఉందని అంగీకరిస్తున్నారు. మిగిలిన వారిలో 7% మంది ఎప్పుడన్నా ఓసారి హోంవర్క్‌లో సాయం చేస్తుంటే.. 24% మంది తండ్రులు 'పిల్లలు మమ్మల్ని అడిగినప్పుడు చూస్తాం' అనీ.. గరిష్ఠంగా 65% మంది 'అసలు పట్టించుకోం' అని చెప్పడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్త్రీలకే పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చెయ్యటం.. ఈ అస్తవ్యస్త సామాజిక విధానాన్ని సమర్థించినట్టు కాదా? అంటున్నారు కొందరు.

నిజానికి పిల్లల పెంపకంలో మన దగ్గర మొదట్నించీ పురుషుల పాత్ర నామమాత్రమే. డబ్బు సంపాదించడంతోనే తన పని అయిపోయిందనుకునే 'మగమహారాజు'లే ఎక్కువ. ''మావారు పిల్లాడికి బట్టలూ, బొమ్మలూ బాగానే కొనిస్తారు. వాడి స్కూలు వ్యవహారాలు చూడమంటే మాత్రం విసుక్కుంటారు. జబ్బు చేస్తే ఆసుపత్రికి కూడా నన్నే తీసుకెళ్లమంటారు'' అంటారు ఓ బ్యాంకు ఉద్యోగిని వసంత. అయితే, ఇప్పుడీ పరిస్థితిలో కొద్దిగానైనా మార్పువస్తోంది. ఇంటి పనుల్లో తామూ ఓ చేయి వేయాలని, వంటలోనూ సాయం చేయాలనుకునే పురుషుల సంఖ్య పెరుగుతోంది. ''పిల్లలను చదివించడం, పరీక్షలకు సిద్ధం చేయడం, జబ్బు చేసినపుడు సేవలు చేయడం వంటివి కేవలం ఆడవారి మీదే వేయటమెందుకు? అంతకన్నా ఆ బాధ్యతలను సమానంగా మోసేలా చేయడం మేలు కదా'' అంటారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కృష్ణమూర్తి. అయితే... ''పిల్లల సంరక్షణ సెలవు వల్ల తల్లులకు ఆ మేరకు ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహమేం లేదు. దీంతో ఉద్యోగభారం తగ్గి పూర్తిగా పిల్లల మీదే దృష్టి కేంద్రీకరించే అవకాశం కలుగుతుంది'' అని చెబుతున్నారు న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్. ఇది చట్టపరంగా ఆడవారికి లభిస్తున్న ఓ బాసటే తప్ప.. పిల్లల సంరక్షణలో మగవారి పాత్రను చర్చించడానికి దీన్ని వేదికగా చేయరాదంటారాయన.

నాన్నల తోడూ కావాలి: శిశువులకు మొదటి ఆర్నెల్లూ కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ప్రభుత్వం నాలుగున్నర నెలల మాతృత్వ సెలవులను ఆర్నెల్ల వరకూ పొడిగించింది. ఇప్పుడు ప్రకటించిన పిల్లల సంరక్షణ సెలవులు వీటికి అదనం. ''దీనివల్ల తల్లులకు ఎంత ఊరట లభిస్తుందో మాటల్లో చెప్పలేను. కానీ, ప్రసవానంతరం బయటి పనులు చూసుకునేందుకు భర్తలు తోడుంటే ఇంకా బాగుంటుంది'' అన్నది ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి అనుభవం. నిజానికి పిల్లల సంరక్షణలో తండ్రులూ పాలు పంచుకుంటే ఎంతోమేలు జరుగుతుందని, అలా పెరిగే పిల్లలు చదువుల్లోనూ బాగా రాణిస్తారని బెంజమిన్ స్పాక్స్ వంటి విఖ్యాత శిశు మనస్తత్వవేత్తలు మూడు దశాబ్దాల క్రితమే గుర్తించారు. దీనివల్ల కేవలం పిల్లల భవిష్యత్తు మెరుగుపడటమే కాదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతా పెరుగుతుంది. ''మా వారు ఆఫీసు నుంచి రాగానే పాపను ఆడిస్తారు, దగ్గరుండి చదివిస్తారు. సెలవురోజుల్లో పార్కులు, మ్యూజియానికి తీసుకెళ్తారు. పరీక్షల సమయంలో పాపతో మరికాస్త సమయం గడిపే వీలుంటే బాగుండని ఎన్నోసార్లు అంటుంటారు. అందుకే పురుషులకూ సెలవులిస్తే మంచిది'' అంటారు హైదరాబాద్‌లోని ఓ గృహిణి భవాని. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవుల సదుపాయం ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ సెలవులు ఇస్తున్నాయి. ఇవేకాకుండా, పురుషులకూ 'పిల్లల సెలవులు' ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. కాలంతో పాటే ప్రజల అభిప్రాయాలూ మారుతున్నాయి. వాటిని సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహించేలా విధానాలు రూపొందాలి.. అప్పుడే మరింత పురోగతి దిశగా అడుగులు పడతాయి. కాదంటారా?

దైవభక్తులు ఉత్తములు! నిజాయతీ, ఔదార్యం కలిగి ఉంటారు

దైవభక్తులు ఉత్తములు! నిజాయతీ, ఔదార్యం కలిగి ఉంటారు

దైవభక్తులు ఉత్తములు!
నిజాయతీ, ఔదార్యం కలిగి ఉంటారు
లండన్: దైవభక్తి ఉన్న ప్రజలు ఉత్తములని పరిశోధకులు చెబుతున్నారు. నాస్తికులకు కోపం తెప్పించినా ఇది నిజమేనని వారు పేర్కొంటున్నారు. బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేశారు. దేవుడిపై నమ్మకం ఉండి, తరచూ దైవ సంబంధమైన కార్యకలాపాల్లో పాల్గొనేవారు నిజాయతీ, ఔదార్యం, అవతలివారికి సాయపడేతత్వాన్ని కలిగి ఉంటారని వారు వివరించారు.. ఇందులో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. వీరి మంచితనానికి కారణం స్నేహితుల్లో పేరు ప్రతిష్ఠలు పెంచుకోవడమేట.

ఈ పరిశోధనకు ఆరా నోరెంజయాన్ నేతృత్వం వహించారు. మతం.. ఒక వ్యక్తి వ్యవహారశైలిపై ప్రభావం చూపుతుందా? అన్నది శాస్త్రీయంగా తేల్చేందుకు ఈ పరిశోధన నిర్వహించినట్లు చెప్పారు. మతపరమైన, ఆధ్యాత్మికమైన ఆలోచనలు.. క్రీడల్లో మోసాన్ని తగ్గించడంతోపాటు అపరిచితుల మధ్య నమ్మకాన్ని కూడాపెంచుతోందని తెలిపారు. అధ్యయనంలో భాగంగా నోరెంజయాన్ బృందంకొంతమంది ఔత్సాహికులను ఎంపిక చేసుకొని, వారికి అనేక పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని ధ్రువపరచింది.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మద్యం నిషిద్ధం అంతా అక్షరాస్యులే రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు ఇదీ గంగదేవిపల్లి ఘనత

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మద్యం నిషిద్ధం అంతా అక్షరాస్యులే రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు ఇదీ గంగదేవిపల్లి ఘనత

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం
మద్యం నిషిద్ధం
అంతా అక్షరాస్యులే
రూపాయికే ఫ్లోరైడ్ రహిత నీరు
ఇదీ గంగదేవిపల్లి ఘనత
వరంగల్ - న్యూస్‌టుడే
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించిన వరంగల్ జిల్లా గంగదేవిపల్లి అభివృద్ధి వెనుక 14ఏళ్ల కృషి, 13 అభివృద్ధి కమిటీల శ్రమ ఉంది. ప్రతీ విషయంలో పారదర్శకత, పాలనలో ప్రతీ ఒక్కరికీ బాధ్యత... ఇదే గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలిపింది. గంగదేవిపల్లి మొదట్లో మచ్చాపురం పంచాయతీ శివారు గ్రామంగా ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా గుర్తించారు. అప్పటికి ఊళ్లో నాటుసారా ఏరులై పారుతోంది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. గ్రామస్థుల్లో ఆలోచన మొదలైంది. నాటుసారా విక్రయాలు నిషేధించారు. ఆరంభంలో ఒడిదుడుకులను అధిగమించారు. ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి గంగదేవిపల్లిని మినహాయించింది.

ప్రభుత్వం దగ్గర పైసా తీసుకోకుండా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేశారు. 1996 నుంచి డీ-ఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరాటంకంగా పనిచేస్తోంది. ఇంటింటికీ 20లీటర్ల మంచినీరు రూపాయికే ఇస్తున్నారు.

1994కు ముందు గ్రామంలో పాఠశాల లేదు. అక్షరాస్యత అంతంత మాత్రమే. అందరికీ విద్య లక్ష్యంతో కమిటీ వేశారు. ప్రతీ 10 మంది నిరక్షస్యురాలకు ఒక వాలంటీర్ నియమించారు. ఎనిమిదేళ్ల కృషి ఫలించింది. 2002 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించింది. బాల కార్మిక వ్యవస్థ లేదు. బడి ఈడు పిల్లలంతా చదువుకోవాల్సిందే.

గంగదేవిపల్లిలో కేబుల్ ప్రసారాలు ఉచితం. ఒక్కసారి రూ.2,200 చెల్లిస్తే చాలు. వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వడ్డీతో గంగా డిష్ కమిటీ పర్యవేక్షిస్తుంది.

ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రుణాల రికవరీ కమిటీ, 'గ్రామాభివృద్ధి కమిటీ'... ఇలా 13 కమిటీలున్నాయి. ప్రతీ ఇంటి నుంచి ఒకరికి ఏదో ఒక కమిటీలో బాధ్యతలుంటాయి. రాజకీయ పార్టీలున్నా అభివృద్ధి నిర్ణయాల్లో అందరిదీ ఒకటే మాట.

గంగదేవిపల్లిలో కుటుంబ సమస్య ఉన్నా పంచాయతీ కార్యాలయం దాటి వెళ్లదు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా పోలీసు రాలేదు. కొట్లాట కేసు కూడా నమోదు కాలేదు.

గంగదేవిపల్లి 2007లో దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం ఈ ఎంపిక చేసింది. గ్రామీణ భారత అధ్యయనం, పరిశోధనా అకాడమీ ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ ముఖ్య సలహాదారు.

గంగదేవిపల్లి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ్ పురస్కార్ అందుకుంది.

వరంగల్ జిల్లాలో నాలుగుసార్లు ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. గ్రామంలోని కుటుంబాలన్నీ చిన్న మొత్తాల పొదుపులో చేరినందుకు 1999లో కలెక్టర్ ప్రత్యేక అవార్డు అందించారు.

కెనడా, బంగ్లాదేశ్‌ల నుంచి స్వచ్ఛంద సంస్థలు వచ్చి గంగదేవిపల్లి గ్రామస్వరాజ్యాన్ని అధ్యయనం చేశాయి. తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్థాన్ బృందాలూ వచ్చాయి. ఇతర జిల్లాల బృందాలకు లెక్కేలేదు. జిల్లాకు వచ్చే ఐఏఎస్ శిక్షణార్థులంతా ఈ గ్రామం గురించి చదవాల్సిందే.

Friday, September 12, 2008

తెలు'గోడు' పట్టేదెవరికి?

వచ్చేశాయ్.. వారోత్సవాలు
* నేటి నుంచి వివిధ కార్యక్రమాలు
* మహానగరి మనోగతం విందామా!
చెన్నై, న్యూస్‌టుడే:
నమస్తే!
వణక్కం!!
హలో..
... ఏమిటి ఇన్ని భాషల్లో చెబుతున్నానని అనుకుంటున్నారా? విశ్వనగరాన్ని కదా మరి! మ్.. మళ్లీ వారోత్సవాలు వచ్చేశాయి నాకు. పిల్లలు తనకు చేస్తున్న ఉత్సవాలు చూసి మురిసిపోని తల్లులు ఉంటారా? 369వ వడిలో పడిన నాకూ అది ఆనందమే మరి. ఆ ఉత్సవాల విశేషాలే నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ముందుగా నా గురించి మీతో కొంత పంచుకోవాలని అనుకుంటున్నా. ఫ్రాన్సిస్ డే, ఆండ్రూ కోగన్.. ఈ
ఇద్దరితోనే నేను ఆవిర్భవించాను. అంతవరకు చిన్న జాలరి గ్రామాల మధ్య నిర్మానుష్యంగా ఉన్న ఓ నేలగా ఉన్నానంతే. వాళ్లిద్దరే స్థానిక నాయకుడు దామర్ల వెంకటప్ప నాయకుడి అధీనం నుంచి నన్ను సొంతం చేసుకున్నారు. అందుకోసం ఓ ఒప్పందం(తెలుగులోనే లెండి) రాసుకున్నారు. ఆ ఒప్పంద పత్రంపై ఉన్న తేదీ 1639 ఆగస్టు 22. ఇదిగో ఆ తేదినే నా జన్మదినంగా అందరూ భావిస్తున్నారు. ఆనాటి ఆ బిందువునే.. నేడు
సింధువయ్యాను.

అధైర్యమొద్దు.. ఆదుకుంటాం
* మంత్రి దామోదర రాజనరసింహ హామీ
చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులో నివసిస్తున్న తెలుగు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వారిని అన్నివిధాల ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. అస్కాలో అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి తెలుగు ప్రజల సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించకపోయిన మాట వాస్తవేమనన్నారు. అయితే ఇకపై అలాంటిది జరుగకుండా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చిస్తామని, పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తోందని, ఇక్కడ ప్రతిభ కనబరచిన తెలుగు విద్యార్థులకు కూడా ప్రతిభా అవార్డులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐటీఎఫ్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి మాట్లాడుతూతమిళనాడు, చెన్నైలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎంవీ నారాయణ గుప్త, కోశాధికారి నందగోపాల్, అస్కా కోశాధికారి జేకేరెడ్డి, ప్రపంచ తెలుగు సమాఖ్య నుంచి జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తెలు'గోడు' పట్టేదెవరికి?
* అందుకే ఇలా తయారయ్యాం
* మలేషియా కాదు.. చెన్నైలో వారిని చూడండి
* ఆంధ్ర మంత్రి ముందు చెన్నై తెలుగువారి ఆవేదన
చెన్నై, న్యూస్‌టుడే
మద్రాసు.. ఇప్పటి చెన్నై.. ఒకప్పటి తెలుగు ప్రజల సాహిత్య కాణాచి. తెలుగు సాహితీ వనంలో గుబాళించిన కుసుమాలెన్నో ఇక్కడ వికసించినవే. చెన్నపట్టణపు వినువీధుల్లో విలసిల్లిన తెలుగు వైభవం అనంతరం తగ్గిపోయింది. తెలుగు ప్రజల రాశి పెరిగినా, భాష వాసి తగ్గుతోంది. ఇందుకు ఎన్నో కారణాలు. ప్రభుత్వం ఆంక్షలు.. నిబంధనలు.. చెన్నైలో తెలుగు నేర్చుకుంటే ఉద్యోగం రాదనే కారణం.. ఏదిఏమైనా తమిళనాట తెలుగు వారు నోరు తెరవలేకున్నారు. కన్నతల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ స్పందించడం లేదు. శుక్రవారం అఖిల భారత తెలుగు సమాఖ్య ఆస్కాలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముందు చెన్నై తెలుగు ప్రజల్లో పెల్లుబుకిన ఆవేదనకు అక్షర రూపమిది...

అడిగే నాథుడేడీ
తమిళనాట తెలుగు వారికి ఇంత దుస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం మా గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేనాథుడు లేక పోవడమే. తెలుగు సాంస్కృతిక వైభవానికి చెన్నై వేదిక. ఒకప్పుడు వాగ్గేయకారులు కూడా ఉన్నారు. అప్పుడు మనకు ఏది జరిగినా అడిగే వారొకరుండేవారు. ఇప్పుడు అది లేదు. ఇక్కడ తెలుగు వాళ్లు నోళ్లు తెరిచినా స్పందన రాదు. ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోనంత వరకు ఇదే గతి.
- గొల్లపూడి మారుతీరావు, సినీ నటులు, రచయిత


ఎంతమంది సీఎంలొచ్చినా ఇంతేనా
ఇక్కడి తెలుగు వారి సమస్యల గురించి మేం విజ్ఞప్తి చేయని ముఖ్యమంత్రి అంటూ లేరు. ఒకసారి చంద్రబాబునాయుడికి వినతి పత్రం ఇస్తూ ఇలా విజ్ఞాపనా పత్రం తీసుకున్న ముఖ్యమంత్రుల్లో మీరు ఏడో వారు సర్ అన్నాను. మా సమస్యలపై ఆంధ్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
- డాక్టర్ సీఎంకే రెడ్డి, అధ్యక్షులు, అఖిల భారత తెలుగు సమాఖ్య

తెలుగు అకాడమీ ఎందుకు ఏర్పాటు చేయరు
రాష్ట్రంలో 42 శాతం తెలుగు వారున్నారు. ఎక్కడో మలేషియాలో ఉన్న తెలుగు వారికోసం ఏదో చేస్తామంటున్నారు. ఇంతమంది తెలుగు జనాభా ఉన్న తెలుగు వారికోసం ఇక్కడ తెలుగు అకాడమీ ఎందుకు ఏర్పాటు చేయరు. తమిళం, తెలుగు రెండూ సోదర భాషలు. మన భాషకు ప్రాచీన హోదా కల్పించడానికి కావాల్సిన అన్ని ఆధారాలూ ఉన్నాయి.
- జీబీఎస్ఆర్ కృష్ణమూర్తి, ప్రపంచ తెలుగు సమాఖ్య

విద్యార్థులు తగ్గిపోతున్నారు
ప్రస్తుతం చెన్నైలోని తెలుగు పాఠశాలల్లో తెలుగు చదివే వారి సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం ఉపాధ్యాడు, విద్యార్థుల నిష్పత్తిని 1:15 నుంచి 1:40కి మార్చేసింది. తెలుగు మూడో భాష అయిపోయింది. తమిళనాడులో తెలుగు చదివితే ఏం చేయాలి అనే భయం ఇప్పుడు విద్యార్థుల్లో నెలకొంది. తెలుగు చదివితే ఉద్యోగాలు రావు అనే భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.
- చెంగయ్య, ప్రధానోపాధ్యాయులు, ఎస్‌కేపీడీ పాఠశాల

వరాల జల్లు ఇక్కడా కురిపించండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ వరాల జల్లు కురిపిస్తున్నారు. మాపైనా ఆ జల్లు కాస్త కురిపించాలి. మా కష్టాలు తొలగించాలి.
- జేకే రెడ్డి, కోశాధికారి, అస్కా

సహకారమివ్వండి.. సాధించి తీరుతాం
తమిళనాడులో తెలుగువారికేం తక్కువ కాదు. మాకు కావాల్సిందల్లా ఆంధ్ర ప్రభుత్వం నుంచి సహకారం, స్పందన. అది ఇచ్చి చూడండి.. మా సమస్యలు ఇట్టే సాధించుకుని తీరుతాం.
- వంకాలయ సత్యనారాయణమూర్తి, సినీ నటులు

మమ్మల్నీ పట్టించుకోండి
ఒకప్పుడు తెలుగు వైభవాన్ని ఇక్కడ కళ్లారా చూసిన వాడ్ని. ఇప్పుడు సహకారం లేకనే ఈ పరిస్థితి. ఇక్కడి వారినీ ప్రభుత్వం పట్టించుకోవాలి. పొట్టి శ్రీరాములు స్మారక మందిరం నిర్వహణ కూడా ఆంధ్ర ప్రభుత్వం చేపట్టాలి.
- గోటేటి శ్రీరామారావు, సంపాదకులు, ప్రముఖాంధ్ర

సంతృప్తి మంత్రం ఇదిగో!

సం....తృప్తే మం త్రం! రోడ్డుపక్కన పూరిగుడిసె నుంచి చక్కటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఓ క్షణం నిలబడి చూస్తే.. కాలిమీద కాలేసుకొని... సంగీత మాధుర్యంలో తేలియాడుతున్న ఆ వ్యక్తి ఏ పూటకు అ పూట తిండి వెతుక్కొనే నిరుపేద. మరో వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. కానీ అతనికి అనునిత్యం.. ప్రతిక్షణం అసంతృప్తే. ఏమిటీ విచిత్రం... ఏదీ సంతృప్తి మంత్రం? ఆధునికకాలంలో అసంతృప్తి సర్వాంతర్యామి. చాక్‌లెట్‌ కొనివ్వలేదని పిల్లలకు అసంతృప్తి. ఇలియానాలా నాజూగ్గా లేనని యువతికి అసంతృప్తి. లక్ష రూపాయల బైక్‌ లేదని యువకుడికి ... కోరిన చీర కొనివ్వలేదని మగువకు... కొడుకులు సరిగా చూసుకోవడం లేదని తల్లిదండ్రులకు... భర్త మంచివాడు కాదని భార్యకు, భార్యకు అణకువ తెలియదని భర్తకు అసంతృప్తి.

పిల్లలకు మంచి మార్కులు రాలేదని, వ్యాపారం సరిగా జరగడం లేదని.. మంచి ఉద్యోగం రాలేదని, వస్తే జీతం తక్కువని అందరిలోనూ... అంతటా అసంతృప్తే!! ఇంతింతై.. వటుడింతై చందంగా పెరిగిపోయి జీవితంలో ఆనందాన్ని హరించివేస్తున్న ఈ అసంతృప్తిని జయించడమెలా? తెలియని వెతుకులాట
ఏది ఇష్టమో.. ఏది అయిష్టమో తెలియని జీవనశైలి. నిలకడ లేని నిర్ణయాలు. సొంత అభిప్రాయాలు లేకపోవడం. ప్రపంచం ఎటుపోతే అటు కొట్టుకుపోవడం, ఊపిరి సలపనివ్వని వస్తు ప్రపంచం. అనేకానేక ప్రత్యామ్నాయాలు మనిషి జీవితంలో సంతృప్తిని మాయం చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. చుట్టూ మనుషులున్నా, కోట్ల రూపాయల డబ్బులున్నా ఏదో తెలియని అసంతృప్తి. పక్కవాడితో పోల్చుకోవడం, పోటీ ప్రపంచంతో పరుగులెత్తడం, అపరిమితమైన కోర్కెలు, ఆకాశానికి నిచ్చెన వేయడం జీవితాన్ని అసంతృప్తితో నింపేస్తున్నాయి. ఒకటి రెండు తరాల కిందటి వరకు జీవితాల్లో ఉన్న సంతృప్తి ఇప్పుడు ఉండడం లేదు. అప్పుడు ఉన్నదాంట్లో తృప్తిపడేవారు. చిన్ని చిన్ని ఆనందాల్లో స్వర్గాన్ని చూడగలిగేవారు. ఇప్పుడు అలా కాదు. కావాల్సినంత డబ్బుంది. కోరుకున్న వస్తువు కళ్లముందు వాలిపోతుంది. అయినా తెలియని వెతుకులాట. అదే ఆధునిక విషాదం. మూలం ఎక్కడ ?


ఎలా జీవించాలనే విషయమై నిర్దిష్ట అభిప్రాయం, అవగాహన లేకపోవడమే అసంతృప్తికి మూలమనేది నిపుణుల వాదన. మనకు ఏది సంతృప్తిని ఇస్తుందో ఏది అసంతృప్తి కలిగిస్తుందో తెలియకుండానే బరువు, బాధ్యతల్లోకి వచ్చిపడిపోతున్నాం. ఫలితంగా ఎన్ని ఉన్నా జీవితం ప్రారంభం నుంచే అసంతృప్తి మొదలవుతుంది. ప్రధానంగా జీవితానికి సంబంధించిన ఒక అభిప్రాయం వేళ్లూనుకునే బాల్యం నుంచే అసంతృప్తి మొదలవుతోంది. ఏం చదవాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో అన్నీ తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ఫలితం... పిల్లలకు తమకంటూ వ్యక్తిత్వం అనేది లేకుండాపోతోంది. ఏ కోర్సు చదివితే ఎంత జీతం వస్తుందో చెబుతారు కానీ హాయిగా, తృప్తిగా ఎలా జీవించాలో చెప్పేవారు కరువవుతున్నారు. తనకు తాను నిర్ణయించుకొనే శక్తిలేక, చెప్పేవారు లేక యువత జీవితం అసంతృప్తిమయమవుతోంది. ఆధునిక పోకడలతో సంస్కృతి పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పుడున్న చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు, బంధువులు, బాధ్యతలు... ఏవీ జీవితానికి స్థిరమైన అభిప్రాయాన్ని, నమ్మకాన్ని అందించలేకపోతున్నాయి. సంబంధాలు మృగ్యం
మానవ సంబంధాలతోసహా అన్నింటిలోనూ ఆర్థిక కోణమే ప్రధానమైపోయింది. ఇది సమస్త వస్తు ప్రపంచాన్ని చేజిక్కించుకోవడం వైపు దారితీస్తోంది. దీంతో సహజమైన మానవ సంబంధాలు దూరమయ్యాయి. వస్తు ప్రపంచమాయలో సంతృప్తిలేదని తెలిసేసరికి జీవితం గడిచిపోతోంది. ప్రతి విషయంలోనూ పోటీతత్వం, ఇతరులతో పోల్చుకోవడం, అనుకరించడం పెరిగిపోయాయి. ఇష్టమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని, స్నేహాన్ని, ఉద్యోగాన్ని, డబ్బును, వృత్తిని, వస్తువును, వినోదాన్ని దేన్నీ ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎంత సంపాదించినా.. ఏ పని చేసినా.. ఏం సాధించినా... ఎంత దూరం ప్రయాణం చేసినా వెలితి వేలెత్తి చూపిస్తోంది. అంతం కాదిది ఆరంభం అన్నట్లు ఈ రకమైన పోటీతత్వంలో గెలుపు ఓటములు, పరిమితి లేకపోవడం జీవితంలో సంతృప్తి ఎండమావి అయింది. సంతృప్తి మంత్రం ఇదిగో!

ఇతరులతో పోల్చుకోవడం, మితిమీరిన పోటీతత్వం నుంచి బయటపడాలి. కోరుకున్నవి.. అనుకున్నవి.. అడిగినవి దక్కలేనపుడు వాటికి సంబంధించిన వనరులు, శక్తిసామర్థ్యాలు మనకు ఉన్నాయో? లేవో సమీక్షించుకోవాలి. పని ఒక్కటే జీవితం కాదు. కోరుకున్నది దక్కనపుడు మరొకటి. అదికాకపోతే మరొకటి. అంతేకానీ ఏ ఒక్కటో జీవితం అనుకుని, అది దక్కలేదని భావించడమే అసంతృప్తికి మూలం. సంతృప్తి అనేది పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు, పదవులు, డబ్బులు, వస్తువుల వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే అవే జీవితం కాదు. అవి జీవితంలో ఒక భాగం మాత్రమే. అప్పుడే జీవితంలో ప్రతి క్షణాన్ని సంతృప్తిగా ఆస్వాదించగలం. - ఆంధ్రజ్యోతి క్రియేటివ్‌ సెల్‌ సంతృప్తి ఓ జీవన విధానం
జీవితంలో అణువణువునా సంతృప్తి దాగి ఉంటుంది. దాన్ని ఆస్వాదించే గుణమే మనలో ఉండాలి. ఏదైనా పనిచేయడం వల్లనో, దేన్నయినా సాధించడం వల్లనో జీవితానికి సంతృప్తి దక్కుతుందని అనుకున్నప్పుడు దానికీ ఓ పరిమితి ఉండాలి. లక్ష రూపాయలు సంపాదించాక కోటి... ఆ తరువాత వంద కోట్లు ఇలా అపరిమితమైనపుడు సంతృప్తి దక్కదు. ఏ పనైనా చేయాలనుకుని దాన్ని మొదలుపెట్టి, ముగించేవరకు ప్రతి క్షణంలోనూ సంతృప్తి పొందగలగాలి. అలాకాకుండా చివరిలో సంతృప్తి దక్కుతుందని విలువైన క్షణాలను విస్మరిస్తే అసంతృప్తే మిగులుతుంది. త్వరగా సంతృప్తి చెందకపోవడం మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎంతకీ సంతృప్తి చెందకపోవడం జీవితాన్ని నిష్ఫలం చేస్తుంది. - డాక్టర్‌ ఎం.ఎస్‌.రెడ్డి

పెళ్లికి ముందే పెటాకులు

పెళ్లికి ముందే పెటాకులు
ఒకప్పుడు నిశ్చితార్థమైతే దాదాపు మూడు ముళ్లు పడిపోయినట్టే. ఆ తర్వాత పెళ్లి అనేది కేవలం ఓ వేడుక! ఇప్పుడు కాలం మారిపోయింది. నేటి కంప్యూటర్‌ యుగంలో నిశ్చితార్థానికి మునుపటి ప్రాధాన్యం ఉండటం లేదు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత కూడా 'రాంరాం' చెప్పుకుంటున్న జంటల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. అభిప్రాయభేదాలొచ్చి వధూవరులు వద్దనుకుంటే.. 'నిశ్చితార్థం' వాళ్లనేం ఆపలేకపోతుండటం తాజా విశేషం!

శరత్‌, స్వాతి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. ఓ మ్యారేజ్‌బ్యూరో ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. పెద్దలు మాట్లాడుకొని నిశ్చితార్థం జరిపించేశారు. రెండు నెలల్లో పెళ్లి. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఉరుములేని పిడుగులా ఓ రోజు ఉన్నట్టుండి.. ''ఈ పెళ్లి నాకిష్టం లేదు'' అని స్వాతి ప్రకటించింది. నిశ్చితార్థం కూడా అయిపోయిన తర్వాత ఇదేం మాటని పెద్దలు నెత్తీనోరూ బాదుకున్నారు. అయితే ఏంటన్నది ఆమె వాదన. 'పెళ్త్లెన తర్వాత విడిపోయే కంటే ఇప్పుడే చెప్పా, సంతోషించాల్సిన విషయం' అనే సరికి అంతా కంగుతిన్నారు. అసలేం జరిగిందని అడిగితే.. తనను ఓ ఆర్నెల్ల పాటు సెలవు పెట్టమని శరత్‌ వేధిస్తున్నట్టు చెప్పిందామె. ''ఆ పని చేస్తే నా ఉద్యోగం ఊడుతుంది. ఈ మాత్రం అర్థం చేసుకోలేని వ్యక్తితో కలిసుండేదెలా? నా జీవితం, ఉద్యోగం నాకు ముఖ్యం. అందుకే అసలీ సంబంధమే వద్దు'' అంటుందామె. పెద్దవాళ్లు కూడా ఇద్దరినీ ఒప్పించలేక చేతులెత్తేశారు. ఇప్పుడు శరత్‌, స్వాతి మళ్లీ కొత్త సంబంధాల వేటలో ఉన్నారు.

మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది హైదరాబాద్‌లోజరిగిన ఈ ఘటన. ఇప్పుడు నిశ్చితార్థమైనంత మాత్రాన కచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుందన్న భరోసా లేదు. అభిప్రాయ బేధాలుంటే పెళ్త్లెన తర్వాత కంటే పెళ్లికి ముందు విడిపోవటమే మంచిదని భావిస్తోంది నేటి యువత. ఒకప్పుడు పెళ్లికి ముందు మాట్లాడుకోవటానికి అమ్మాయికీ, అబ్బాయికీ అవకాశమే ఉండేది కాదు. మాటామంతీ పెళ్త్లెన తర్వాతే. అప్పుడిక ఎలా ఉన్నా సర్దుకుపోక తప్పేది కాదు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్లు, ఈమెయిళ్లు ఎంత దూరంలో ఉన్నవారైనా మాట్లాడుకునే అవకాశాన్నిచ్చాయి. పైగా, నిశ్చితార్థం తర్వాత అబ్బాయిఅమ్మాయి మాట్లాడుకోవటానికి, సరదాగా ఏ సినిమాలకో, షాపింగ్‌లకో వెళ్లటానికి కుటుంబపరంగా, సామాజికంగా అంగీకారం కూడా లభిస్తోంది. దీంతో పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయీ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునేందుకు అవకాశం చిక్కుతోంది. భేదాభిప్రాయాలూ బయటపడుతున్నాయి. అలాగే స్త్రీలు కూడా తమ భవిష్యత్తును తానే నిర్ణయించుకునే సాధికారత సాధిస్తుండటంతో.. ఇష్టం లేకపోయినా తలవంచుకొని తాళి కట్టించుకునే పరిస్థితి లేదిప్పుడు. ఓ కార్పొరేట్‌ బ్యాంకులో పని చేసే దీపకు ఆ మధ్య మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఇంజినీర్‌. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, వరుని తరఫు వాళ్లు ప్రతిదానికీ బెట్టుగా ఉంటూ.. దీప తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తుండటాన్ని ఆమె జీర్ణించు కోలేకపోయింది. ఓపిక నశించి ఈ పెళ్లి వద్దని స్వయంగా నిర్ణయించుకుంది.

ఇంకా పాత పద్ధతులే
పెళ్లి విషయంలో మన సమాజం ఇప్పుడిప్పుడే పాత పద్ధతులను వదిలించుకుంటున్నా.. వధూవరుల అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు, లక్ష్యాలు, ఆదర్శాల వంటివి కలుస్తాయా? లేదా? అన్నది చూడటంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంటోంది. ఫలితంగా పెళ్లికి ముందే కొన్ని జంటలు విడిపోతున్నాయి. ఇది పైకి ప్రతికూల అంశంగా కనిపించినా మంచి పరిణామమే అంటున్నారు నిపుణులు. పెళ్లయిన తర్వాత అగచాట్లు పడేకంటే ముందే ఒక నిర్ణయానికి రావటం మంచిదేగానీ.. అసలు నిశ్చితార్థం వరకు కూడా వెళ్లక ముందే ఇద్దరూ అన్ని విషయాల్లోనూ ఓ స్పష్టతకొచ్చి నిర్ణయం తీసుకోవటం అత్యుత్తమం. ''అనూరాధ మంచి వ్యక్తే. కాకపోతే ఒకట్రెండుసార్లు మాట్లాడినప్పుడు డబ్బుకు, ఆడంబరాలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యం చూశాక తనకు నేను తగిన వ్యక్తిని కాదనిపించింది. అందువల్లే నిశ్చితార్థం లాంటివేమీ జరగక ముందే గుడ్‌బై చెప్పుకున్నాం'' అంటాడు భాస్కర్‌. ఈ యువ లెక్చరర్‌లాగా కాస్తంత పరిణతి, ముందుచూపు ప్రదర్శించటం మంచిది. ఏమైనా ఇప్పుడిక 'తాంబూలాలిచ్చేశాం.. ఇక తన్నుకు చావండి' అనటానికి లేదు మరి!

Wednesday, September 10, 2008

అతడు.. ఆమె.. డబ్బు! పెరుగుతున్న కలహాలు

అతడు.. ఆమె.. డబ్బు! పెరుగుతున్న కలహాలు

అతడు.. ఆమె.. డబ్బు!
పెరుగుతున్న కలహాలు
ఆర్థిక పరిణతి ముఖ్యం
ఒకప్పుడు స్త్రీ ఉద్యోగం చేయడమంటే 'ఏదో వేణ్నీళ్లకు చన్నీళ్లు' అన్నట్టుండేది. కానీ ఇటీవలికాలంలో పరిస్థితి వేగంగా మారిపోతోంది.. నేడు మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు, సరిసమానంగా సంపాదిస్తున్నారు. భర్తకంటే అధికంగా ఆర్జిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యత్యాసాలు.. ఇప్పుడు చాలా కుటుంబాల్లో కలహాలకు కారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో విడాకుల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరగటం వెనక ఈ ఆర్థిక అంశాలూ కారణంగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టుల్లో మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు విడాకుల కోసం దాదాపు రెట్టింపు కేసులు దాఖలవుతున్నాయి. వీరు పైకి ఏయే కారణాలు చెబుతున్నా విభేదాల వెనక ఆర్థిక అహంభావాలే మూలంగా నిలుస్తున్నాయని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. భార్యాభర్తలు ఆర్థిక వ్యవహారాల్లో పరిణతితో వ్యవహరించటం, పురుషులు తమ పాతకాలపు ఆలోచనలను మార్చుకోవటం అవసరమని వివరిస్తున్నారు.

ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేయడాన్ని నిరసించిన పురుషులే ఇటీవలి కాలంలో ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా వారిని బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే నెలతిరిగే సరికి భార్య తెచ్చే జీతం మీద ఉన్న ఆసక్తి.. వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని గౌరవించటం మీద ఉండటం లేదనీ, ఫలితంగానే సమస్యలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నేడు ఉద్యోగాల్లో స్త్రీలు వేగంగా పైకెదుగుతున్నారు. ఉదాహరణకు కిందిస్థాయి ఐటీ ఉద్యోగాల్లో చేరిన స్త్రీలు తోటి పురుషులకంటే ముందుగానే టీమ్ లీడర్లుగా ఎదుగుతున్నారని, జీతాల విషయంలోనూ ముందే ఉంటున్నారని కొద్దికాలం క్రితం 'డేటాక్వెస్ట్-జాబ్స్‌హెడ్' నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

నిజానికి భార్యాభర్తలిరువురూ ఇలా ఉద్యోగాలు చేస్తూ 'నాలుగు చేతులా' ఆర్జిస్తుంటే సంసారం మరింత సుఖమయం కావాలి. కానీ ఆర్థిక అవగాహన కొరవడి 'నీ డబ్బు, నా డబ్బు' అన్న ధోరణి పెరగటం వల్లసర్దుబాటు సమస్యలతో తమ వద్దకు వచ్చే కేసులు ఎక్కువగానే ఉంటున్నాయని ఫ్యామిలీ కౌన్సెలర్ వసుప్రదా కార్తీక్ చెబుతున్నారు. ముఖ్యంగా యువ దంపతుల్లో ఈ ఆర్థిక పరమైన అవగాహనలేమి స్పష్టంగా కనిపిస్తోందని ఆమె వివరిస్తున్నారు. ఉద్యోగం చేసే భార్యలు సహజంగానే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవటానికి, అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చటానికి ప్రయత్నిస్తుంటారు. దీన్ని చాలా కుటుంబాల్లో భర్తలు అర్థం చేసుకోలేకపోతుండటంతో అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. ''అన్ని ఖర్చులూ తనతో చెప్పాలని పట్టుబడతారు. చివరికి ఫ్రెండు ఇంట్లో ఫంక్షన్‌కి బహుమతి తీసుకెళ్లాలన్నా సరే చెప్పి తీరాల్సిందే. ఆయన మాత్రం ఏదీ చెప్పరు. ఏం.. నేనే ఎందుకు సర్దుకుపోవాలి?'' అంటున్నారు ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని రాగిణి.

ఇద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాల్లో అభిప్రాయభేదాలు ముదిరి పాకానబడితే తీవ్రస్థాయి అనర్థాలు తప్పవు. అంతర్జాతీయ పరిశోధన సంస్థ సైనోవేట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో మూడింట ఒకవంతు ఉద్యోగులు 'ఆర్థిక పరమైన విభేదాలు విడాకులకు దారితీసే అవకాశముంద'ని స్పష్టంగా పేర్కొన్నారు. ''మేమిద్దరం విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లం. నా జీతం డబ్బులను ఆయన తన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చుపెడుతుంటే వద్దని చెప్పా. పొరపొచ్చాలు మొదలయ్యాయి. చివరికవే విడాకులకు దారి తీశాయి. ఇప్పుడు మాబాబుతో కలిసి ఇక్కడే ఒంటరిగా ఉంటున్నా'' అంటున్నారు హైద్రాబాద్‌లోని ఓ ఐటీ ఉద్యోగిని శశికళ.

మానసికంగా భరోసా ఉంటుందన్న కారణంతో స్థిరాస్తులు తమ పేరున ఉండాలని కోరుకుంటున్న మహిళలూ లేకపోలేదు. ఇలాంటి వారిని కొందరు పురుషులు ప్రోత్సహిస్తున్నా చాలామంది హర్షించటం లేదు. ఏ విషయమైనా పంతాలకు పోకుండా కలిసి మాట్లాడుకొని ఇంటి బడ్జెట్ వేసుకోవడం, ఎవరు ఖర్చుపెడుతున్నా రెండోవారికి చెప్పటం, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం అలవరచుకుంటే ఆర్థిక సమన్వయం అసాధ్యమేం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ''డబ్బు చాలా సున్నిత అంశమైనందున.. ఖర్చు, పొదుపులపై భార్యాభర్తలు ముందే మాట్లాడుకొని, పరస్పర గౌరవంతో వ్యవహరిస్తుంటే విభేదాలే తలెత్తవు. ఇక్కడ ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనుకోవడానికి వీల్లేదు'' అంటారు ఆర్గనైజేషనల్ సైకాలజిస్టు కవితా గూడపాటి. వృత్తి విజయాల హడావిడిలో పడిపోయి ప్రేమ, అన్యోన్యతలను మరిచిపోవద్దనీ.. అవి దండిగా ఉన్నచోట డబ్బు పొరపొచ్చాలు తేలికగా సర్దుకుంటాయని సూచిస్తున్నారామె!

Wednesday, July 23, 2008

praveen has invited you to join Picsquare

Picsquare

Hey,

I have been using Picsquare and its amazing.

You should check out Picsquare too - for photo storage, sharing and printing photos and photo gifts.

You would get your first 10 prints FREE. And I would get 10 FREE prints too for referring you!
  • 10 trial prints are FREE
  • Prints at Just Rs. 2.99
  • Free Album for 30+ prints
  • Create Amazing Photo Gifts
  • Enjoy Unlimited Storage

Click here to start

In case you face problems viewing the above message - please copy and paste the link below into your browser:
http://www.picsquare.com/refer.do?operation=referral&user=false&reid=9dqg3COlAHTz2doDMaBoEe7FagEIiAIgWTrqz3kVoI0yDoflxVrPvA%3D%3D&seid=nk5ujxbzEemUgiJ5DlUaML1wag2DZPXU


Sincerely,
Picsquare Team
www.picsquare.com

Thursday, July 03, 2008

Growing Child, Growing problems but a Great Adult

A child was born three months after the death of his father. Born prematurely, he was a small child; his mother said that he could easily fit inside a quart mug. When He was three, his mother remarried and went to live with her new husband, leaving her son in the care of his maternal grandmother,

Began his schooling in the village schools. When he was 15 yrs, his step father died and his mother came back only to remove him from school and attempted to make a farmer of him. He was thoroughly unhappy with the farm work. One of his high school teacher helped him back to school to complete his education.

At the age of 19 he fell in love, romanced for a year and got engaged to his beloved. But he became engrossed in his studies and let the romance cool itself & she left him & married someone else. He never married. He faced challenges everywhere!

He was born unlucky with much hardship for very survival & struggle for education.
What can you expect that child to do & achieve in life? Think!
..
..Think again!
..
..
..
..
>Think Some more
>
>
>
>
>Yes, He learnt to think!
>
>>>>
..
..
..
He described universal gravitation (Gravity) and the three laws of motion. He invented the reflecting telescope and made many contributions to mathematics.

Yes we are talking of Sir Isaac Newton

Am I a Hindu??


Dear all - interesting reading - a bit long (it is not my story)

Four years ago, I was flying from JFK NY Airport to SFO to attend a meeting at Monterey, CA.
An American girl was sitting on the right side, near window seat.

It indeed was a long journey - it would take nearly seven hours!
*I was surprised to see the young girl reading a Bible - unusual of young
Americans! (Later I came to know that September 11 has changed mind-set of
lot of US citizens. They suddenly turned religious, it seemed.)
After some time she smiled and we had few acquaintances talk. I told her
that I am from India.
*
*Then suddenly the girl asked: 'What's your faith?'
'What?' I didn't understand the question.
'I mean, what's your religion? Are you a Christian? Or a Muslim?'
'No!' I replied, 'I am neither Christian nor Muslim'..
Apparently she appeared shocked to listen to that.
'Then who are you…?'
'I am a Hindu', I said.
She looked at me as if she is seeing a caged animal.
She could not understand what I was talking about.
*
*A common man in Europe or US know about Christianity and Islam, as they are
the leading religions of the world today.
*
*But a Hindu, what?
I explained to her - I am born to a Hindu father and Hindu mother.
Therefore, I am a Hindu by birth.*

*'Who is your prophet?' she asked.
'We don't have a prophet,' I replied.
'What's your Holy Book?'
'We don't have a single Holy Book, but we have hundreds and thousands of
philosophical and sacred scriptures,' I replied.
'Oh, come on…at least tell me who is your God?'
'What do you mean by that?'*


*'Like we have Yahweh and Muslims have Allah - don't you have a God?'*

*I thought for a moment. Muslims and Christians believe one God (Male God)
who created the world and takes an interest in the humans who inhabit it.
Her mind is conditioned with that kind of belief.
*

* **According to her (or anybody who doesn't know about Hinduism), a
religion need to have one Prophet, one Holy book and one God. The mind is so
conditioned and rigidly narrowed down to such a notion that anything else is
not acceptable. I understood her perception and concept about faith. You
can't compare Hinduism with any of the present leading religions where you
have to believe in one concept of god.
*

* **I tried to explain to her: 'You can believe in one god and he can be a
Hindu. You may believe in multiple deities and still you can be a Hindu.
What's more - you may not believe in god at all, still you can be a Hindu.
An atheist can also be a Hindu.'
This sounded very crazy to her.
*

*She couldn't imagine a religion so unorganized, still surviving for
thousands of years, even after onslaught from foreign forces.*


* **'I don't understand…but it seems very interesting. Are you religious?'
What can I tell to this American girl?
*

*I said: 'I do not go to temple regularly. I do not make any regular
rituals. I have learned some of the rituals in my younger days. I still
enjoy doing it sometimes.'
'Enjoy? Are you not afraid of God?'*


*'God is a friend. No- I am not afraid of God. Nobody has made any
compulsions on me to perform these rituals regularly.'*


* **She thought for a while and then asked: 'Have you ever thought of
converting to any other religion?'
*

*'Why should I? Even if I challenge some of the rituals and faith in
Hinduism, nobody can convert me from Hinduism. Because, being a Hindu allows
me to think independently and objectively, without conditioning… I remain as
a Hindu never by force, but choice.' I told her that Hinduism is not a
religion, but a set of beliefs and practices. It is not a religion like
Christianity or Islam because it is not founded by any one person or does
not have an organized controlling body like the Church or the Order, I
added. There is no institution or authority. *

*'So, you don't believe in God?' she wanted everything in black and white.
*

*'I didn't say that. I do not discard the divine reality. Our scripture, or
Sruthis or Smrithis - Vedas and Upanishads or the Gita - say God might be
there or he might not be there. But we pray to that supreme abstract
authority (Para Brahma) that is the creator of this universe.'*


* **'Why can't you believe in one personal God?'
*

* **'We have a concept - abstract - not a personal god. The concept or
notion of a personal God, hiding behind the clouds of secrecy, telling us
irrational stories through few men whom he sends as messengers, demanding us
to worship him or punish us, does not make sense. I don't think that God is
as silly as an autocratic emperor who wants others to respect him or fear
him.' I told her that such notions are just fancies of less educated human
imagination and fallacies, adding that generally ethnic religious
practitioners in Hinduism believe in personal gods. The entry level Hinduism
has over-whelming superstitions too. The philosophical side of Hinduism
negates all superstitions.
*

* **'Good that you agree God might exist. You told that you pray. What is
your prayer then?'
'Loka Samastha Sukino Bhavantu. Om Shanti, Shanti, Shanti,'
'Funny,' she laughed, 'What does it mean?'
*

*'May all the beings in all the worlds be happy. Om Peace, Peace, Peace.'*

*'Hmm…very interesting. I want to learn more about this religion. It is so
democratic, broad-minded and free…' she exclaimed.
*

*'The fact is Hinduism is a religion of the individual, for the individual
and by the individual with its roots in the Vedas and the Bhagavad-Gita. It
is all about an individual approaching a personal God in an individual way
according to his temperament and inner evolution - it is as simple as that.'
*


* **'How does anybody convert to Hinduism?'
*

*'Nobody can convert you to Hinduism, because it is not a religion, but a
set of beliefs and practices.. Everything is acceptable in Hinduism because
there is no single authority or organization either to accept it or to
reject it or to oppose it on behalf of Hinduism.'*

*I told her - if you look for meaning in life, don't look for it in
religions; don't go from one cult to another or from one guru to the next.
*

* **For a real seeker, I told her, Bible itself gives guidelines when it
says 'Kingdom of God is within you.' I reminded her of Christ's teaching
about the love that we have for each other. That is where you can find the
meaning of life.
*

* **Loving each and every creation of the God is absolute and real.
'Isavasyam idam sarvam' Isam (the God) is present (inhabits) here everywhere
- nothing exists separate from the God, because God is present everywhere.
Respect every living being and non-living things as God. That's what
Hinduism teaches you.
*

* **Hinduism is referred to as Sanathana Dharma, the eternal faith. It is
based on the practice of Dharma, the code of life. The most important aspect
of Hinduism is being truthful to oneself. Hinduism has no monopoly on ideas.
It is open to all. Hindus believe in one God (not a personal one) expressed
in different forms. For them, God is timeless and formless entity.
*
*Ancestors of today's Hindus believe in eternal truths and cosmic laws and
these truths are opened to anyone who seeks them. But there is a section of
Hindus who are either superstitious or turned fanatic to make this an
organized religion like others. The British coin the word 'Hindu' and
considered it as a religion.
*

* **I said: 'Religions have become an MLM (multi-level-marketing) industry
that has been trying to expand the market share by conversion. The biggest
business in today's world is Spirituality. Hinduism is no exception…'
*

* **I am a Hindu because it doesn't condition my mind with any faith
system.............
*



--
Make a list of important things to do today. At the top, put 'eat
chocolate'. Now, you'll get at least one thing done today.

Wisdom is having a lot to say and not always saying it. Think before you
act; think twice before you speak.

An eye for an eye leaves the whole world blind

Winners make things happen, losers let things happen.

I am too blessed to be stressed and too annointed to be disappointed.

Knowledge is information. Wisdom is knowing what to do with the information
you have.