welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, October 13, 2011

The role of muslim in Aazad Hind Fouz



ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో ముస్లిం పోరాట యోధులు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పరాయి పాలకులను మాతృ దేశం నుండి తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్య్రపోరాట చరిత్ర చివరిదశలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లింపోరాట యోధులు చాలా ప్రధాన భాగస్వామ్యం వహించారు.


1941 జనవరిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆంగ్ల ప్రభుత్వ గూఢాచారి వ్యవస్థ కళ్ళుగప్పి మహమ్మద్‌ జియావుద్దీన్‌ అను మారు పేరుతో కలకత్తా నుండి తప్పుకున్న 'గ్రేట్‌ ఎస్కేప్‌' ఏర్పాట్లను మియా అక్బర్‌ షా నిర్వహించగా, ఆ తరువాతి ప్రాణాంతక కాబూల్‌ ప్రయా ణంలో అక్బర్‌షా ఏర్పాటు చేసిన సాయుధ పఠాన్‌ యువ కులు నేతాజీకి అంగరక్షకులుగా నడిచారు. ఆఫ్ఘాన్‌ గుండా పఠాన్‌ వేషంలో నేతాజీ ప్రయాణం సాగించాల్సి వచ్చిన ప్పుడు, ఆంగ్ల గూఢచారులు, వారి తొత్తులు ఏమాత్రం గుర్తు పట్టకుండా ఆబాద్‌ ఖాన్‌ నేతాజీకి ఆఫ్ఘాన్‌ పఠాన్‌ వ్యవహారసరళి,ఆచార సాంప్రదాయాలలో వారం రోజుల పాటు తన ఇంట రహాస్యంగా ప్రత్యేక శిక్షణ గరిపి ముం దుకు పంపారు. 1941 మార్చి 27న నేతాజీ బెర్లిన్‌ చేరేంతవరకు ప్రమాదకర పరిస్థితులలో ఆయనను కళ్ళల్లో పెట్టుకుని కాపాడి గమ్యం చేర్చడంలో ముస్లిం యోధులు తోడ్పడ్డారు.


భారతదేశం వెలుపల నుండి వలసపాలకులను తరిమిగొట్టడానికి పోరుకు సిద్ధపడిన రాస్‌ బిహారి బోస్‌ మార్గదర్శకత్వంలో 1942 మార్చిలో జరిగిన సింగపూర్‌ సమావేేశంలో పాల్గొన్న మేజర్‌ మహమ్మద్‌ జమాన్‌ ఖైనిలాంటి వారు ఆ తరువాత 'భారత జాతీయ సైన్యం' కమాండర్‌ గా నేతాజీ తరువాతి స్థాయి అధికారిగా గణనీయ సేవలు అందించారు. ఆనాడు రాస్‌బిహారి, ప్రీతం సింగ్‌, కెప్టెన్‌ మాన్‌సింగ్‌ లాంటి నేతల నేతృత్వం లోని 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌', 'భారత జాతీయ సైన్యం'లలో కెప్టెన్‌ మహమ్మద్‌ అక్రం, కల్నల్‌ యం.జడ్‌. ఖైని, కల్నల్‌ జి.క్యూ. జిలాని, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ యస్‌.యన్‌.హుస్సేన్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ ఇక్బాల్‌లు బాధ్యతలు నిర్వహించగా, ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన 'సారె జహాసే అచ్ఛా హిందూస్తాన్‌ హమార్‌' గీతాన్ని 'భారత జాతీయ సైన్యం' ప్రతి సందర్భంలో గానం చేస్తూ గౌరవించింది.


1941 మార్చిలో స్వదేశాన్ని వీడి జర్మనీ చేరుకున్న నేతాజీ జర్మనీలో 'స్వేచ్ఛా భారత కేంద్రం' (ఫ్రీ ఇండియా సెంటర్‌) ప్రారంభించారు. ఆ సందర్భంగా నేతాజీకి పరిచయమైన హైదరాబాది అబిద్‌ హసన్‌ సప్రాని, 1941 నవంబర్‌లో నేతాజీ ఏర్పాటు చేసిన 'భారతీయ కమాండో దళం' శిక్షకుడిగా, ఆ తరువాత 'ఆజాద్‌ హింద్‌ రేడియో'లో నేతాజీ ప్రసంగాల సహాయకుడిగా బాధ్యతలను నిర్వహించారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్య చరిత్రలో నినాదంగా నిలచిన 'జైహింద్‌' సుభాష్‌ పేరును కూడా మర్చిపోయేలా చేసిన 'నేతాజీ' నామాన్ని అబిద్‌ రూపొం దించారు. అబిద్‌ హసన్‌ సప్రాని కృషి వలన ఉనికిలోకి వచ్చిన 'జైహింద్‌' ఈనాటికి భారత దేశమంతటా ప్రతిధ్వనించడం అబిద్‌ సృజనాత్మకతకు తార్కాణం.


జపాన్‌ ప్రభుత్వాధినేతల పట్ల భారతీయ విప్ల వోద్యమ నేతల్లో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా తూర్పు అసియా ప్రాంతంలో జనరల్‌ మాన్‌సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన 'భారతీయ జాతీయ సైన్యం', 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌'లు 1942 డిసెంబర్‌ 29న రద్దయినట్టు జనరల్‌ మాన్‌సింగ్‌ ప్రకటించగా, విప్లవోద్యమ నేత రాస్‌ బిహరి బోస్‌ నేతృత్వంలో 1943 ఫిబ్రవరి 15న భారత జాతీయ సైన్యాన్ని పునర్‌వ్యవస్ధీకరించారు. ఆ సమయంలో భారత జాతీయ సైన్యం, దాని అనుబంధ సంస్థలను, కార్యకర్తలను, సైనికులకు మార్గదర్శకత్వం వహించేందుకు సుప్రీం మిలటరీ బ్యూరో సంచాలకులుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ జె.కె.భోన్స్‌లే బాధ్యతలు స్వీకరించగా లెఫ్టినెంట్‌ మీర్జా ఇనాయత్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని, మేజర్‌ మతా-ఉల్‌-ముల్క్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ బుర్హానుద్దీన్‌, మేజర్‌ ఎ.డి జహంగీర్‌, మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, లెఫ్టినెంట్‌ అల్లాయార్‌ ఖాన్‌, మేజర్‌ మహమ్మద్‌ రజాఖాన్‌, కెప్టెన్‌ ముంతాజ్‌ ఖాన్‌, ఎస్‌.ఓ ఇబ్రహీం, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెంట్‌ మీర్‌ రహమాన్‌ ఖాన్‌, మేజర్‌ రషీద్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అర్షద్‌లు ముందుకు వచ్చి ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని జనరల్‌ స్టాఫ్‌ ప్రధానాధికారిగా, సైనికుల శిక్షణాధికారిగా మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, రిఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమాండెం ట్‌గా మేజర్‌ ముతా-ఉల్‌-ముల్క్‌ , చరిత్ర-సంస్కృతి-పౌర సంబంధాల అధికారిగా మేజర్‌ ఏ.జడ్‌ జహంగీర్‌ ప్రధాన భూమికలను చాకచక్యంగా నిర్వర్తించారు.


ఈ పరిణామాల నేపధ్యంలో యూరప్‌ నుండి తూర్పు ఆసియాకు వెళ్ళేందుకు సుభాష్‌ చంద్రబోస్‌ నిర్ణయించు కున్నారు. రావాల్సిందిగా కోరుతున్న విప్ల వోద్యమ నేతల ఒత్తిడి మరింత పెరగడం, అవి ద్వితీయ ప్రపంచ సంగ్రామం జరుగు తున్న రోజులు కనుక జపాన్‌-జర్మనీల సహ కారంతో బ్రిటన్‌ దాని మిత్రపక్షాల సైన్యాలతో పోరా డుతున్న సుభాష్‌ చంద్రబోస్‌ ఆసియాకు వెళ్ళడం ప్రాణాంతకం కావడంతో బ్రిటీష్‌ గూఢచారి వ్యవస్థ డేగకళ్ళ నుండి తప్పించుకుని గమ్యస్థానం చేరడానికి నేతాజి రహస్యంగా జలాంతర్గమి ప్రయాణం తప్పలేదు. మూడు మాసాలపాటు 25,600 కిలోమీటర్లు సాగిన అత్యంత్య భయానక, సాహసోపేత జలాంతర్గమి ప్రయా ణంలో సుభాష్‌్‌కు అబిద్‌ హసన్‌ తోడుగా నిలిచి, భవిష్యత్తు కార్యక్ర మాల రూపకల్పనలో ఆయనకు తోడ్పడి చరిత్ర సృష్టించారు.


1943 మే 16న సుభాష్‌-అబిద్‌లు టోక్యో చేరుకున్నాక 1943 జూలై నాల్గున సింగపూర్‌లో జరిగిన సమావేశంలో తూర్పు ఆసియాలో సాగుతున్న భారత స్వాతంత్య్రోద్యమం నాయకత్వాన్ని సుభాష్‌ చంద్రబోస్‌ చేపట్టి 1943 అక్టోబర్‌ 23న 'ఆజాద్‌ హింద్‌' ప్రభుత్వాన్ని ప్రకటించారు. అ మరుక్షణమే మాతృభూమి విముక్తి కోసం, బ్రిటీష్‌ దాని మిత్రపక్షాల మీద యుద్ధం ప్రకటిస్తూ భారత జాతీయ సైన్యానికి 'చలో ఢిల్లీ' నినాదమిచ్చారు. భారత జాతీయ సైన్యంలో చేరమంటూ భారతీయులను కోరుతూ ఆజాద్‌ హింద్‌ రేడియా కేంద్రం ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమంలో, మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ స్వయంగా రాసిన గీతంలోని 'స్వాతంత్య్ర పోరాటం జరుపు తున్న యోధులలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం లండన్‌ గుండెల్లో భారతీయుల ఖడ్గం దూసుకపోతూనే ఉంటుంది' అను చరణాలతో ఆలాపించడం అనవాయితయ్యింది.


భారత జాతీయ సైన్యం సర్వసైన్యాధ్యక్షులుగా, అజాద్‌ హింద్‌ ప్రభుత్వం అధినేతగా భాధ్యతలు స్వీకరించి సుభాష్‌ చంద్రబోస్‌ పలు ప్రధాన శాఖలకు సైన్యాధికా రులుగా లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియానిలకు బాధ్యతలు అప్పగిస్తూ, బషీర్‌ అహమ్మద్‌ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌ సాయుధ దళాల ప్రతినిధిగా నియక్తుల య్యారు. ఆ తరువాతి క్రమంలో భారత జాతీయ సైన్యానికి సంబంధించిన మూడు డివిజన్లకు గాను రెండిటికి మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ ఖాన్‌, ఎం.జడ్‌ కియానిలు ప్రధానాధి కారులుగా బాధ్యతలు చేపట్టగా, రెజిమెంటల్‌ కమాం డర్లుగా ఐ.జె కియాని, ఎస్‌. ఎం. హుసైన్‌, బుర్హానుద్దీన్‌, షౌకత్‌ అలీ మలిక్‌ తదితరులు నియక్తులయ్యారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్ర బోస్‌ ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన 'ఝాన్సీరాణి రెజిమెంట్‌'లో ఎం.ఫాతిమా బీబి, సయ్యద్‌ ముంతాజ్‌, మెహరాజ్‌ బీబి, బషీరున్‌ బీబీ లాంటి నారీమణులు పలు బాధ్యతలు నిర్వహించారు.


స్వతంత్ర భారత ప్రభుత్వం, సైన్యం ఏర్పడ్డాక సాగుతున్న కార్యక్రమాలకు అన్నిరకాల సహాయసహకా రాలు అందించాల్సిందిగా సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ రంగూన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి హబీబ్‌ సాహెబ్‌ తన రాజప్రసాదం లాంటి భవంతిని, ఆయనకున్న పొలాలు-స్థలాలు, కోటిన్నర రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు ధారాదత్తం చేసి కట్టుబట్టలతో నిల్చోగా ఆయనను 'సేవక్‌-ఏ-హింద్‌' పురస్కారంతో నేతాజీ సత్కరించారు. ఈ క్రమంలో బషీర్‌ సాహెబ్‌, నిజామి సాహెబ్‌ అను మరో ఇరువురు సంపన్నులు విడివిడిగా 50 లక్షల రూపా యలను నేతాజీకి అందించగా, మరో ముస్లిం వ్యాపారి తనకున్న మూడు ప్రింటింగ్‌ ప్రెస్‌లను, యావదాస్తిని 'నేతాజీ నిధి' పరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయ నగరం జిల్లా వేపాడు (ప్రస్తుతం) నివాసి షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ అతి కష్టం మీద కూడపెట్టుకున్న 20వేల రూపా యలను స్వయంగా 'నేతాజీ నిధి'కి అప్పగించి, రైఫిల్‌ మన్‌గా భారత జాతీయ సైన్యంలో చేరి సేవలందచేశారు.


'చలో ఢిల్లీ' పిలుపును సాకారం చేయడానికి అరకాన్‌ యుద్ధరంగంలో తొలిసారిగా కల్నల్‌ ఎస్‌.యం మలిక్‌ నేతృత్వంలోని భారతీయ జాతీయ సైన్యం బ్రిటీష్‌ సైన్యాలను మట్టికరిపించి మాతృభూమి మీద అడుగు పెట్టి మణిపూర్‌లోని మొయిరాంగ్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని వివిధ శాఖలలో అధికారులుగా బాధ్యతలను నిర్వహించిన యోధులలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నక్కి అహ్మద్‌ చౌదరి, అష్రాఫ్‌ మండల్‌, అమీర్‌ హయత్‌, అబ్దుల్‌ రజాఖ్‌, ఆఖ్తర్‌ అలీ, మహమ్మద్‌ అలీషా, అటా మహమ్మద్‌, అహమ్మద్‌ ఖాన్‌, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్‌, యస్‌. అఖ్తర్‌ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్‌ రహమాన్‌ ఖాన్‌ లాంటి వారున్నారు. చరిత్ర సృష్టించిన ఈ పోరాటంలో ఆంధ్ర పదేశ్‌కు చెందిన ముస్లింలూ భారీ సంఖ్య భాగస్వాముల య్యారు. మన రాష్ట్రం నుండి అబిద్‌ హసన్‌ సప్రానితో పాటుగా ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాద్‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా భారత జాతీయ సైన్యంలో పనిచేశారు. హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మా ని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ బాటలో నిర్భయంగా నడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చెందిన షేక్‌ బాదుషా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ,చిత్తూరు జిల్లాకు చెందిన మహ మ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌, పుంగనూరుకు చెందిన పి.పి.మహ మ్మద్‌ ఇబ్రహీం, కడపజిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన షేక్‌ అహమ్మద్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటాలలో భాగస్వాములయ్యారు.


ఇంఫాలా-కోహిమాలను ఆక్రమించి అస్సాం లోకి అడుగుపెట్టాలని ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యానికి ఒకవైపున ప్రకృతి మరోవైపున ఆహారం, ఆయుధాలు, రవాణా తదిరల అవసరాల తీవ్ర కొరత దెబ్బతీసింది. ఈ లోగా భారీ సైనిక బలగాలను సమ కూర్చుకున్న బ్రిటన్‌ దాని మిత్ర పక్షాల సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది.


ఆ తరుణంలో భారత జాతీయ సైన్యానికి అరకొరగా నైనా ఆర్థిక-ఆయుధ మద్దత్తు ఇస్తున్న జపాన్‌ దారుణంగా దెబ్బతిన్నది. మరోవైపున జర్మనీ కుప్ప కూలింది. బ్రిటన్‌-ఆమెరికా పక్షాలు విజయం సాధిం చాయి. ఆ కారణంగా 1945 ఆగస్టు 15న జపాన్‌ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేయగా భారత జాతీయ సైన్యం కూడా యుద్దరంగం నుండి తప్పుకోవాల్సి రావడంతో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యుద్ధరంగం నుండి తప్పుకుని ఆగస్టు 18న కల్నల్‌ హబీబ్‌తో కలసి నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ బాంబర్‌ విమానంలో బయలుదేరారు. ఆకాశంలోకి ఎగిరిన ఆ విమానం ఫోర్‌మొసా ద్వీపంలో కూలిపోవడంతో తీవ్రంగా గాయ పడిన సుభాష్‌ చంద్రబోస్‌ ఆగస్టు 19న కన్నుమూశారు. ఆయనతోపాటు ప్రయాణించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ చికిత్స అనంతరం బతికి బయటపడ్డారు. ఆ దుర్భర క్షణాలలో 'హబీబ్‌, నాకు తుది ఘడియలు సమీపించాయి. జీవితాంతం నేను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాను. నేను నా దేశ స్వాతంత్య్రం కోసం మరణిస్తున్నాను. భారత స్వాతంత్య్ర పోరాటం సాగించమని నా ప్రజలకు తెలియ జెయ్యి. త్వరలోనే భారత దేశం విముక్తి చెందుతుంది' అని సుభాష్‌ చంద్రబోస్‌ కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ ద్వారా భారతీయులకు తన చివరి సందేశం పంపారు

Wednesday, August 17, 2011

[జన్మమెత్తితిరా] మనిషియందె మహాత్ముని కాంచగలవురా


జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగా మారినానురా [జన్మమెత్తితిరా]

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా
సమర భూమి నా హృదయం శాంతి పొందెరా [జన్మమెత్తితిరా]

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసె దివ్య మందిరముగా మారిపోయెరా [జన్మమెత్తితిరా]

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడిగంటలె ప్రతిధ్వనించురా
ఆ దివ్య స్వరం న్యాయ పధం చూపగలుగురా [జన్మమెత్తితిరా]

--అనిశెట్టి
 

Tuesday, August 16, 2011

mirapakaaya bajji మిరపకాయ బజ్జి

మిరపకాయ బజ్జి
===============

చిన్నదే యనుకొని చిన్న చూపులు వద్దు

మరచి మింగిన ఘాటు మాడ కెత్తు

మేనెల్ల తాకంగ మెత్తమెత్తగ దోచు

అంతరంగమునుండు యసలు కిటుకు

పైపైన రుచిచూసి ఫర్లేదు యనవద్దు

కొరుకంగ గట్టిగ గుణము తెలియు

మరువదెపుడు జిహ్వ మరగెనా రుచిదీని

వద్దనక తినగ సిద్ధ పడును

ఆహ!వోహొ! యనుచు ఆరగింతురెపుడు

నీరు మింగి కనుల నీరు నింపి!

కష్టమనక తినుట కిష్ట పడెడు

ఘనత కలదు మిరపకాయ బజ్జి!

============
విధేయుడు
_శ్రీనివాస్

ఈ జీవనవైభవమంతయు తుదకు నశించుటకేనా?

ఇదేనా ఇంతేనా జీవితసారమింతేనా?

అంతులేని ఈ జీవనవైభవమంతయు

తుదకు నశించుటకేనా?




బోసినవ్వులను కువ్వలుపోసే

పసిపాపల బ్రతుకు ఇంతేనా

జీవితసారమిదేనా

ఆటపాటల నలరించుచు

సెలయేటివోలే వెలివారే బ్రతుకూ ఇంతేనా

కిలకిలనవ్వుచు తొలకరివలపుల పొలకవోయు

జవరాలి వయ్యారము ఇదేనా ఇంతేనా




దాచుకున్న వయసంతయు మగనికి

దోచి యిచ్చుఇల్లాలి గతి ఇదేనా ఇంతేనా

పురిటిపాప చిరుపెదవులతావున

మురిసిపోవు బాలింతబ్రతుకు ఇదేనా ఇంతేనా

తనబలగము ధనధాన్యములనుగని

తనిసే ముదుసలి పేరాశ ఫలము ఇదేనా ఇంతేనా

సకల శాస్త్రములు పారసమిడినా

అఖిల దేశముల ఆక్రమించినా

కట్తకడకు ఈ కాయము విడిచీ

మట్టిగలిసి పోవలెనా?

మట్టిగలిసి పోవలెనా?




--యోగి వేమన.చిత్తూరు వి.నాగయ్య,సముద్రాల రాఘవాచార్యులు 1947

Friday, August 05, 2011

ప్రశ్నలా కాదా ?!



   ప్రశ్నలా కాదా ?!
===============

పైసలిస్తే పనిచేస్తారా?
పని చేస్తే పైసలిస్తారా?

పని చేస్తే పైసలిస్తే జీతం
పైసలిస్తే పని చేస్తే లంచం
పైసలిచ్చినా పని చేయకపోతే ఘోరం!

ఆకలి అయితే తింటారా?
తింటే ఆకలి అవుతుందా?

ఆకలి అయితే తింటే భోజనం
తింటే ఆకలి అయితే జీర్ణం
ఆకలి కాకున్నా తింటే రోగం!

ప్రేమిస్తే పెళ్ళవుతుందా?
పెళ్ళైతే ప్రేమిస్తారా?

పెళ్ళై ప్రేమిస్తే సంతోషం
ప్రేమిస్తే పెళ్ళైతే సుఖాంతం
పెళ్ళైనా ప్రేమించకపోతే విషాదం!

వార్తలొస్తాయని టీవీ చూస్తారా ?
టీవీ చూస్తారని వార్తలొస్తాయా ?

వార్తలొస్తాయని టీవీ చూస్తే ఆశ
టీవీ చూస్తారని వార్తలొస్తే దురాశ
టీవీ చూసినా వార్తలు రాకపోతే నిరాశ!

మాట్లాడటానికి ఫోను చేస్తారా?
ఫోను చేస్తే మాట్లాడుతారా?

ఫోను చేస్తే మాట్లాడుతే పరిచయమున్నవారు
మాట్లాడటానికి ఫోను చేస్తే తెలిసిన వారు
తప్పు నంబరైనా మాట్లాడుతుంటే అంతా నావారే అనుకునేవారు!
==========
విధేయుడు
-శ్రీనివాస్

Tuesday, July 26, 2011

అంధకార చారిత్రిక

 
"అరిగిన సబ్బు
తరిగిన మబ్బు
పెరిగిన గబ్బు
కావేవీ అవార్డులకు అనర్హం"
అనేవారేమో శ్రీశ్రీ!
"Graveyards are full of indispensable men" said Charles DeGaulle. కాదు, బతికినప్పుడు కుడా అన్నట్లు, ఉన్నప్పుడు చూపని గౌరవమంతా లేనప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం, వారికి ఫలానా అవార్డులివ్వకపోవడం గురించి మాట్లాడుకోవడం తెలుగువారి ప్రత్యేకతగా మారిపోతుందేమో అని చెడ్డ అనుమానం!

ఎవ్వరైనా ఏడిపించొచ్చు. నవ్వించడం, ఎవ్వరినీ నొప్పించకుండా నవ్వించడం, అదీ అక్షరాలతో సాధించడం నవ్వులాట కాదు. చతురోక్తులతో చిత్రోక్తులతో చిరునవ్వును సరసంగా గుబాళింపజేసిన ముళ్ళపూడివారి మాటలకు ఏ అవార్డులొచ్చినా రాకపోయినా నవ్వును మాత్రం రివార్డుగా ఇస్తూనే ఉంటాయి.

కథలో నవ్వించడం ఒక ఎత్తు. జీవితంలో నవ్వును గుర్తించడం ఇంకో ఎత్తు. క్లిష్ట సమయాల్లో సైతం sense of humor వీడకపోవడం చాలా మందికి అందనంత ఎత్తు. అంతటి ఎత్తులను కూడా పరికించి, గుర్తించి జరిగిన ఉదంతాలను మనసులనుండి జరిగిపోకుండా ఉండే రీతిగా వారు వ్రాసిన కొన్నిటిని పంచుకోవడం మాత్రమే.
[Source: ముళ్ళపూడూ గారి "హాస్యజ్యోతి" నుండి]
-------------------------------
* వేదాంతి, రసతపస్వి అయిన ముట్నూరి కృష్ణారావుగారు మరణ శయ్యపై ఉండగా, ఆయన భార్య పక్కనే కూచుని కంట తడి పెట్టింది. ఆ దశలో కూడా ఆయన చిరునవ్వుతో "అప్పుడే రిహార్సల్స్ మొదలు పెట్టావా" అన్నారట ఆమెతో.

* టైముకి రావడం శాస్త్రీయం, టైముకి రాకపోవడం కృష్ణశాస్త్రీయం- శ్రీశ్రీ

* ఒకసారి జ్వరపడి మంచంలోఉన్న దిగ్గిరాలవారిని పరామర్శించడానికి వెళ్ళారు దువ్వూరి సుబ్బమ్మగారు. ఆయనను పలకరించి "జ్వరం ఎక్కువగా ఉందా" అంటూ చెయ్యిపట్టికు చూడసాగింది.
"అసలే నేను జ్వరంతో బాధపడుతుంటే పైగా పాణిగ్రహణం కూడానా" అన్నారట ఆంధ్రరత్న చలోక్తిగా.

* కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రవిశ్వవిద్యాలం ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆంధ్రవిశ్వవిద్యాలయమే తన ప్రేయసీ అని చెప్పుకునేవారు. ఒక సభలో ఆయనను భీషుడు, హనుమంతుడు అంటూ కొందరు వక్తలు ప్రస్తుతించడం ప్రారంభించారు. తర్వాత రెడ్డిగారు అందుకొని "లేనిపోని ఉపమానాలని విశేషాణలను ఎందుకు దురివినియోగం చేస్తారు?" "అవివాహితుడు" అంటే
సరిపోతుంది" అన్నారు.

* శ్రీపాద వారు "స్మశాని వాటికి" రచనను ప్రాణం మీదికి వచ్చిన రోగిన చూడడానికి వెళ్తున్న డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారికి ఇచ్చారట. "శాస్త్రిగారూ మీకి బొత్తిగా లొక్యం లేదండీ" అన్నారటాయన.

* 1949 లో హైదరాబాదు నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వాం "పోలీసు చర్య" అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చూ ఏ పద్దుకింద చేర్చాలో ప్రభుత్వానికి అర్థం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భార్త రక్షణ శాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధంలేదని హోంశాఖ
తరస్కరించింది. పైగా అది క్రమశిఖణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ అందుకు నిరాకరించి "హైదరాబాదుపై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధినిర్మూలన పథకంలో భాగం కనుక ఖర్చు ఆయోగ్య శాఖపరణ్గా వ్రాయించ" మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యాశాఖ భరించింది."
---------
అంధకార చారిత్రిక సంఘటనలో సైతం హాస్యాన్ని వెతికి పట్టుకోవడం ముళ్ళపూడివారికే చెల్లు.
=======================================
విధేయుడు
-శ్రీనివాస్


అట జని కాంచె భూసురుడు

 
==================================================
ఈ నెల "తెలుగునాడి"లో రెండు మంచి పద్యాలున్నాయి. ఒకటి సుమతి శతకం, ఇంకొకటి మనుచరిత్ర నుండి.
---------------------
"మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!"
నోటి మాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
---------------------
"చీటికి" బదులు "చీకటి" అని ఉంది. టైపో అనుకుంటాను.

పెద్దన విరచిత మనుచరిత్ర లోని పద్యాన్ని శ్రీ పాపినేని శివశంకర్ గారు పరిచయం చేసిన దాని నుంచి కొంత పంచుకోవడం
----------------------------------------------
[Source: TeluguNaaDi - Feb-March 2011 Issue]
"అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
 పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
 స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్
 గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్"
 భూమిసురుడు = బ్రాహ్మణుడైన ప్రవరుడు
 అటన్+చని = అక్కడికి వెళ్ళి
 అంబర చుంబి = ఆకాశాన్ని తాకుతున్న
 శిరస్ = శిఖరాల నుండి
 సరత్ = జారుతున్న
 ఝరీపటల = సెలయేళ్ళ సమూహంలో
 ముహుః + ముహుః = మాటి మాటికి
 లుఠత్ = దొర్లుతున్న
 అభంగ = ఎడతెగని
 తరంగ = అలలు అనే
 మృదంగ = మద్దెలల యొక్క
 నిస్వన = ధ్వనుల చేత
 స్ఫుట = స్పష్టమైన
 నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా
 పరిపుల్ల = మిక్కిలి విప్పారిన
 కలాప = పురులుగల
 కలాపి జాలమున్= ఆడ నెమళ్ళు గల దానిని
 కటక చరత్ = పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే
 కరేణుకర = ఆడ ఏనుగుల తొండాల చేత
 కంపిత = కదిలించబడిన
 సాలమున్ = మద్దిచెట్లు గల దానిని
 శీతశైలమున్ = మంచుకొండను
 కాంచెన్ = చూశాడు

మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే
 అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి.
 ఏనుగుల తొండాలతో అక్కడి మద్దిచెట్లను పెకలిస్తున్నాయి. అటువంటి మంచుకొండను చూశాడు ప్రవరుడు.

ఇంత సరళంగా చెప్పగలిగిన సంగతిని ఎందుకింత ప్రౌఢగంభీరంగా వర్ణించాడు కవి? హిమాలయ పర్వతం
 అసామాన్యమైనది. మహోన్నతమైనది. ఆ మహత్వాన్ని, మహాద్భుత దృశ్యాన్ని స్ఫురింపజేయటానికి అంత
 సంస్కృత పదాటోపం అవసరమైంది. పద్యంలో ముచ్చెం మొదటి మూడూ మాటలు తప్ప (అట, చని, కాంచె)
 తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.

 కేవలం శబ్దం ద్వారానే అర్థస్ఫురణ గావించటం ఈ పద్యంలో విశేషం. "అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల"
 మన్నప్పుడు నింగినంటిన కొండల నుండి జాలువారే సెలయేళ్ళ ధారాప్రవాహం మనో నేత్రం ముందు
 కనబడుతుంది.

 మద్దెల చప్పుళ్ళకి, మేఘధ్వనులకి నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి ఆడతాయని ప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు
 రాళ్ళకు కొట్టుకొని మద్దెలలాగా మోగుతున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మద్దెలల
 మోత వినిపించాడు కవి. "స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యం స్ఫురింపజేస్తున్నాడు. అక్షరాలు
 నర్తిస్తున్నట్టు, ఆయా అర్థాలను స్ఫురింజేస్తున్నట్టు రచించటం వికటత్వం. (వికటత్వ ముదారతా- వామనుడు)
  వికటత్వం గల కూర్పు ఔదార్యం. ఈ పద్యంలో ఔదార్యం అనే గుణం ఉంది. దీనికి తోడు దీర్ఘసమాసాలతో కూడిన
 గాఢబంధం వల్ల ఓజోగుణం కూడా చేకూరింది.

"అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి,
సాలము శీతశైలము" - ఈ చోటుల్లో వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, అంత్యప్రాస, యమకంలాంటి
 శబ్దాలంకారాలున్నాయి. తరంగ ధ్వనుల్ని మృదంగధ్వనులుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం చేత
 భ్రాంతిమదలంకారం అవుతుంది.

 "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే
 బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.
----------------------------------------------
 ఎన్నో విషయాలు ఆసక్తికరంగా అందించిన శివశంకర్ గారికి చాలా కృతజ్ఞతలు.

 చిన్న సందేహం. ప్రతిపదార్థంలో "కలాపి" అంటే ఆడనెమళ్ళు అన్నారు. ద్వా.నా.శాస్త్రిగారి "తెలుగు సాహిత్య
 చరిత్ర"లో మగనెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అని ఉంది. నిఘంటువులో "కలాపి"కి నెమలి అనే ఉంది.
 మామూలుగా మగనెమళ్ళ నాట్యమే ప్రసిద్ధం. తెలిసిన వారు దయచేసి వివరించ మనవి.
=============
 విధేయుడు
 -శ్రీనివాస్

సీత నవ్వు

 
 సీత నవ్వు
 =====
"వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండాంకరే" అన్న శ్లోకం, భద్రాద్రి రామున్ని సీతా సమేతంగా సౌమిత్రి యుక్తంగా కోదండ ధారిగా మనస్సులో నిలుపుతుంది.
అంతే అందంగా, అంతకంటే అదనంగా, ఆంజనేయసహితంగా, తెలుగులో శ్రీనమశ్శివాయగారి వెంకట నరసింహులు గారి ఈ పద్యం ఆకట్టుకుంది.
--------------------------------------------
"తమ్ముడు లక్ష్మణుండు పెదతమ్ముడు యా భరతుండు చేరి వి
  ల్లమ్ములు దాల్చి నిల్వ చరణంబులనంటియు నాంజనేయుడా
 నమ్మిన బంటు కొల్వ విభవమ్మున బంగరు గద్దె మీద సీ
 తమ్మ సమేతుడౌ దశరథాత్మజు శ్రీరఘురాము గొల్చెదన్"
--------------------------------------------
 శ్రీరామనవమి సందర్భంగా వ్రాసిన ఒక పద్యం

సీ.
 నవ్వగాను తరులు పువ్వులై వికసించె
 విరుల నవ్వులుజిమ్మె పరిమళాలు
 గిరులన్ని నవ్వంగ ఝరులు పరుగులెత్తె
 నాట్యమాడె యలలు నదులు నవ్వ
 మంద్రంగ నవ్వుచు మలయమారుతమేగె
 కోకిల నవ్వుచు కూయగాను
 పుడమియే నవ్వంగ పులకించె ప్రకృతి
 నింగి నవ్వినపుడు నీల కాంతి

 ఆ.
 రాము చేత విల్లు రయముగ విరుగంగ
 పుడమి బెదిరి కొంత కడలి తొణక
 చిర్నగవుల తోడ సీతరాముని జేర
 సీత నవ్వుకెల్ల సృష్టి నవ్వె!
 ===========
విధేయుడు
 -శ్రీనివాస్

తెలుగుక!

 
తెలుగుకూ స్పెల్‌ చెకర్‌! 

_ పద విశ్లేషణ ఆధారం _ 6 నెలల్లో రూపకల్పన _ యూనికోడ్‌ ఫాంట్‌ తయారీకి యత్నాలు

ఈనాడు దినపత్రిక _ హైదరాబాద్ _ 18 ఏప్రిలు 2011

పద విశ్లేషణ ఆధారంగా తెలుగు భాషకు పూర్తిస్థాయి స్పెల్‌ చెకర్‌(రాసిన పదంలోని అక్షర క్రమం సరైందో కాదో తెలిపే కంప్యూటర్‌ ప్రోగ్రాం)ను రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అంతర్జాల తెలుగు వేదిక(గిఫ్ట్‌) ఇందుకు సారథ్యం వహించనుంది. హైదరాబాద్‌లో జరిగిన మొదటి అంతర్జాల సదస్సులో ఈ మేరకు తీర్మానించారు. స్పెల్‌చెకర్‌ను ఆరు నెలల్లో రూపొందించాలని

యోచిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే స్పెల్‌చెకర్‌లు ఉన్నప్పటికీ, అవి పూర్తి స్థాయిలో లేవు. భాషలోని పదాల సంక్లిష్టతే ఇందుకు కారణం. ఆంగ్ల భాషలో అయితే ఒక్కో పదం నుంచి ఐదు పదాల వరకు విభిన్న పద ప్రయోగాలు వస్తాయి. వీటికి స్పెల్‌ చెకర్‌ చేయడం తేలిక. అదే దక్షిణాది భాషల్లో ముఖ్యంగా తెలుగులో ఒక్కో పదానికి వేల పద ప్రయోగాలు ఉండవచ్చు. ఇందువల్ల పదం పొడవుగా కూడా మారుతుంది.

అందువల్లే సంక్లిష్ట పద విశ్లేషణ ఆధారంగా తెలుగు పదాలకు స్పెల్‌చెకర్‌ రూపొందించాల్సి వస్తోంది.


ప్రస్తుతం తెలుగులో రచనలను వాణిజ్య పంథాలో ముద్రించే ప్రచురణకర్తలు వందకు పైగా ఉన్నారు. వీరిలో అత్యధికులు వినియోగించే ఫాంట్‌ గ్లిఫ్‌ ఎన్‌కోడింగ్‌ పద్ధతిలో ఉంటుంది. అంటే ఒక అక్షరం కంటికి కనపడే సంకేతాల రూపంలో ఉంటుంది. ఒక అక్షరం రూపకల్పనకు కీబోర్డ్‌పై వేర్వేరు బటన్‌లు టైప్‌ చేయాల్సి వస్తోంది. అదే యూనికోడ్‌(యూనివర్సల్‌ క్యారక్టర్‌ ఎన్‌కోడింగ్‌) పద్ధతిలో

అక్షరాల కూర్పు ఉంటుంది. అనువాద ప్రక్రియకు ఇది అనుకూలంగా ఉంటుంది. దేశంలో మిగిలిన రాష్ట్రాల ప్రచురణకర్తలు యూనికోడ్‌ను పాటిస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నంగా ఉంది. ఈ పరిస్థితి మార్చేందుకు మూడు నెలల్లో ఒక ఫాంట్‌ను రూపొందించి, అందరూ ఉచితంగా వినియోగించేందుకు అనువుగా అంతర్జాలంలో ఉంచాలని 'గిఫ్ట్‌' నిర్ణయించింది. యూనికోడ్‌ సమకూరితే, ఇతర భాషల నుంచి

అనువాదం తేలిక అవుతుంది. సెప్టెంబర్‌లో జరిగే విశ్వ అంతర్జాల తెలుగు సమ్మేళనం లోపే తెలుగు భాషకు యూనికోడ్‌ ఫాంట్‌, పూర్తిస్థాయి స్పెల్‌ చెకర్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ గారపాటి ఉమామహేశ్వరరావు 'న్యూస్‌టుడే'తో చెప్పారు. సిలికానాంధ్ర ఇందుకు సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

మనీషి

 
 మనీషి
======
విశాల జగతిలో
విషాద మణగునా ?
అశాంతి తొలగునా ?
ప్రశాంతి నిలుచునా ?

అనూహ్య ప్రగతిలో
వినూత్న జగతిలో
రుణాల బరువులా ?
రణాల ధ్వనులెలా ?

అశక్తి ముసిరెనా
అశేష తిమిరమే
స్వశక్తి మెరిసెనా
ఉషోద సమయమే!

సునిశ్చియముగనే
మనంబు తలచెనా
జనాలు నిలిచెనా
మనీషి గెలువడా!
=======
విధేయుడు
-శ్రీనివాస్

Monday, July 18, 2011

స్నేహబంధము ఎంత మధురము

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు వాడిపోదు కష్టసుఖాల్లో [స్నేహబంధము]

మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయువచ్చును
పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
చెక్కుచెదరంది స్నేహమని నమ్మవచ్చును [స్నేహబంధము]

--ఆత్రేయ

సాగలేక ఆగితే దారి తరుగునా? Ever green Song in Telugu

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది..[ఎవరో ఒకరు]

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకొని కొడి కూత నిదరపొదుగా..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే..
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే..
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి.. [ఎవరో ఒకరు]

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..
దానికి లెక్క లేదు కాలరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కంటి నీతిని
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలి చూపి తీరమే దరికి చేరునా..? [ఎవరో ఒకరు]

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒల్లు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా [ఎవరో ఒకరు]

--అంకురం,చిత్ర,బాలు,హంసలేఖ

దేవుడి పేరిట మూఢుడైతే వాడే దానవుడు

దేవుడు ఉన్నాడో లేడో మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని తికమకపడుతున్నాడురా
మానవుడున్నంతవరకు దేవుడు ఉంటాడురా
వాడినితలచేందుకు మానవుడుండాలిరా [దేవుడు ]

తనలో మంచిని పెంచుకునేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొకరూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలుమతాలుగా మారాయిరా [దేవుడు ]

భయంనుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే
ముక్తి అంటారురా [దేవుడు ]

మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడి కోసం మనిషిని మరిచే వాడే మూఢుడు
ప్రేమ త్యాగం తెలిసిన వాడే మానవుడూ
దేవుడి పేరిట మూఢుడైతే వాడే దానవుడు [దేవుడు ]

గాయకుడు-జేసుదాసు

Sunday, February 06, 2011

మంచిమనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకూ?

 
చదువురానివాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు?
మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకూ [[చదువు]]

ఏమిచదివి పక్షులు పైగెగురగలిగెను?
ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను?
అడవిలోని నెమలికెవడు ఆటనేర్పెను?
కొమ్మపైనికోకిలమ్మకెవడు పాటనేర్పెను? [[చదువు]]

తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని
ఏమెరుగని చంటిపాపఏడ్చును అమ్మా అని
చదువులతో పనియేమి హృదయమున్నచాలు
కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు [[చదువు]]

సి.నారాయణరెడ్డి ఆత్మబంధువు కె.వి.మహదేవన్ 1962

ఎందుకు వల చేవో ఎందుకు వగచేవో

 
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో [[మౌనమే]]

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు [[మౌనమే]]

చిత్రం : గుప్పెడు మనసు
గానం :బాలమురళి కృష్ణ
రచన : ఆత్రేయ
సంగీతం :ఎం.ఎస్.విశ్వనాథన్

నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందింతురే

 
కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే

గుణమింత లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరిజూచుకుని నన్ను మరిచేవయా
మంచిగుడి చూచుకొని నీవు మురిసేవయా
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణమునే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు

చిత్రం : నాదీ ఆడజన్మే
గానం : పి.సుశీల
రచన : శ్రీశ్రీ
సంగీతం: ఘంటసాల




సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా

 
సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా,
హం బుల్ బులే హై ఇస్‌కీ
యే గుల్ సితా హమారా,హమారా.

పర్ బత్ వో సబ్‌సే ఊంచా
హంసాయ ఆస్‌మాకా
వోసంతరీ హమారా - వో పాస్ వా
హమారా,హమారా.

గోదీమె ఖేల్ తీ హై
ఇస్‌కీ హజారో నదియా
గుల్షన్ హై జిన్ కీ దమ్ సే
రష్‌కే జనా హమారా, హమారా.

ఆయె అబ్ రౌద్ గంగా ఓ దిన్ హె యాద్ తుజ్ కో
ఉతారా తేరె కినారే జబ్ కారవా హమారా
మజ్ హబ్ నహీ సిఖాతా
ఆపస్‌మే బైర్ రఖనా
హింధీ హై హం(3) వతన్ హై
హిందూ సితా హమారా,హమారా.

యూనాన్ ఓ మిస్ర్ ఓ రోమా సబ్ మిత్ గయే జహా సే
అబ్ తక్ మగర్ హై బాకీ నామ్ ఓ నిషాన్ హమారా

కుచ్ బాత్ హై కె హస్తి మిఠాతీ నహీ హమారా
సదియో రహా హై దుష్మన్ దౌర్ ఏ జమాన్ హమారా

ఇక్బాల్ కో ఐ మెహ్రామ్ అప్నా నహీ జహా మే
మాలూమ్ క్యా కిసీ కో దర్ద్ ఏ నిహా హమారా

సారే జహాసె అచ్చా...