welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, July 26, 2011

అంధకార చారిత్రిక

 
"అరిగిన సబ్బు
తరిగిన మబ్బు
పెరిగిన గబ్బు
కావేవీ అవార్డులకు అనర్హం"
అనేవారేమో శ్రీశ్రీ!
"Graveyards are full of indispensable men" said Charles DeGaulle. కాదు, బతికినప్పుడు కుడా అన్నట్లు, ఉన్నప్పుడు చూపని గౌరవమంతా లేనప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం, వారికి ఫలానా అవార్డులివ్వకపోవడం గురించి మాట్లాడుకోవడం తెలుగువారి ప్రత్యేకతగా మారిపోతుందేమో అని చెడ్డ అనుమానం!

ఎవ్వరైనా ఏడిపించొచ్చు. నవ్వించడం, ఎవ్వరినీ నొప్పించకుండా నవ్వించడం, అదీ అక్షరాలతో సాధించడం నవ్వులాట కాదు. చతురోక్తులతో చిత్రోక్తులతో చిరునవ్వును సరసంగా గుబాళింపజేసిన ముళ్ళపూడివారి మాటలకు ఏ అవార్డులొచ్చినా రాకపోయినా నవ్వును మాత్రం రివార్డుగా ఇస్తూనే ఉంటాయి.

కథలో నవ్వించడం ఒక ఎత్తు. జీవితంలో నవ్వును గుర్తించడం ఇంకో ఎత్తు. క్లిష్ట సమయాల్లో సైతం sense of humor వీడకపోవడం చాలా మందికి అందనంత ఎత్తు. అంతటి ఎత్తులను కూడా పరికించి, గుర్తించి జరిగిన ఉదంతాలను మనసులనుండి జరిగిపోకుండా ఉండే రీతిగా వారు వ్రాసిన కొన్నిటిని పంచుకోవడం మాత్రమే.
[Source: ముళ్ళపూడూ గారి "హాస్యజ్యోతి" నుండి]
-------------------------------
* వేదాంతి, రసతపస్వి అయిన ముట్నూరి కృష్ణారావుగారు మరణ శయ్యపై ఉండగా, ఆయన భార్య పక్కనే కూచుని కంట తడి పెట్టింది. ఆ దశలో కూడా ఆయన చిరునవ్వుతో "అప్పుడే రిహార్సల్స్ మొదలు పెట్టావా" అన్నారట ఆమెతో.

* టైముకి రావడం శాస్త్రీయం, టైముకి రాకపోవడం కృష్ణశాస్త్రీయం- శ్రీశ్రీ

* ఒకసారి జ్వరపడి మంచంలోఉన్న దిగ్గిరాలవారిని పరామర్శించడానికి వెళ్ళారు దువ్వూరి సుబ్బమ్మగారు. ఆయనను పలకరించి "జ్వరం ఎక్కువగా ఉందా" అంటూ చెయ్యిపట్టికు చూడసాగింది.
"అసలే నేను జ్వరంతో బాధపడుతుంటే పైగా పాణిగ్రహణం కూడానా" అన్నారట ఆంధ్రరత్న చలోక్తిగా.

* కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రవిశ్వవిద్యాలం ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆంధ్రవిశ్వవిద్యాలయమే తన ప్రేయసీ అని చెప్పుకునేవారు. ఒక సభలో ఆయనను భీషుడు, హనుమంతుడు అంటూ కొందరు వక్తలు ప్రస్తుతించడం ప్రారంభించారు. తర్వాత రెడ్డిగారు అందుకొని "లేనిపోని ఉపమానాలని విశేషాణలను ఎందుకు దురివినియోగం చేస్తారు?" "అవివాహితుడు" అంటే
సరిపోతుంది" అన్నారు.

* శ్రీపాద వారు "స్మశాని వాటికి" రచనను ప్రాణం మీదికి వచ్చిన రోగిన చూడడానికి వెళ్తున్న డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారికి ఇచ్చారట. "శాస్త్రిగారూ మీకి బొత్తిగా లొక్యం లేదండీ" అన్నారటాయన.

* 1949 లో హైదరాబాదు నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వాం "పోలీసు చర్య" అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చూ ఏ పద్దుకింద చేర్చాలో ప్రభుత్వానికి అర్థం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భార్త రక్షణ శాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధంలేదని హోంశాఖ
తరస్కరించింది. పైగా అది క్రమశిఖణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ అందుకు నిరాకరించి "హైదరాబాదుపై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధినిర్మూలన పథకంలో భాగం కనుక ఖర్చు ఆయోగ్య శాఖపరణ్గా వ్రాయించ" మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యాశాఖ భరించింది."
---------
అంధకార చారిత్రిక సంఘటనలో సైతం హాస్యాన్ని వెతికి పట్టుకోవడం ముళ్ళపూడివారికే చెల్లు.
=======================================
విధేయుడు
-శ్రీనివాస్


No comments: