welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, January 25, 2010

e-హదీసులను కూడా వెలువరిస్తారని ఆశిస్తున్నాను

 

 తెలుగుజాతి ఇంగ్లీషు, హిందీ, తదితర జాతులతో సమంగా తలెత్తుకొని తిరిగే వాతావరణం రాష్ట్రంలో కలగాలి. ఎవరి భాషను వారు గౌరవించటం, వారి భాషకు సర్వాధికారాలు కలగాలని కోరుకోవటం తప్పు కాదు కదా? తెలుగుకు రెండవ జాతీయ అధికారభాష హోదా, ప్రాచీన భాష హోదా కల్పించాలని కోరుతుంటే.....గొంతెమ్మ కోర్కెలు మానుకోమనీ, ఉట్టికెక్కలేనమ్మ న్వర్గానికి ఎలా ఎక్కుతుందనీ, ఇంట గెలచి రచ్చ గెలవమనీ,
అత్యాశ పనికి రాదని.....కొందరు తెలుగు పెద్దలే నాకు చెప్పారు. కాని వారికికూడా అంతరంగంలో వారి మాతృభాష ఉట్టికెక్కాలని,ఇంట గెలవాలని,రచ్చలో కూడా గెలవాలనే ఉంది. ఎంతైనా వారూ తెలుగు బిడ్డలే కదా! కాకపోతే ప్రన్తుత పరిస్థితిని చూని ఇవి తీరే కోర్కెలు కావని నిరాశ.ఎప్పటికైనా ఈ కోర్కెలు తీరాలనీ, తెలుగు బ్రతకాలనీ, తెలుగు ఏలాలని, తెలుగుకు సరైన న్యాయం జరగాలనీ నా ఆశ. నేను
ఆశావాదిని.
ప్రజల భాషకు పట్టం కట్టడం ఏనాటికైనా తప్పదు.
''మద్రాను లేని తెలుగు రాష్రం తలలేని మొండెం లాంటిది అని అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతగానో వాపోయారు. తెలుగు విద్వాంనులు నంగీత సాహిత్య రంగాలలోనే గాక ఇతర రంగాలన్నింటిలో ఆనాటికే చెన్నైలో చేసిన అభివృద్ధిని మనం వదులుకున్నాం. బళ్ళారి, బరంపురం లాంటి తెలుగు ప్రాంతాలు కూడా కోల్పోయాం. ఆంధ్ర రాష్రం ఏర్పడిన మరునాడే తెలుగు అనెంబ్లీ తరలి పోవాలని, తెలుగువారి రాజధాని
మద్రాసులో ఉండటానికి ఒక్కరోజు కూడా ఆతిద్యం ఇవ్వటం కుదరదని సి. రాజగోపాలాచారి తెగేసి చెప్పాడట. దాంతో తెలుగు నాయకులు కర్నూలుకు వెళ్ళారు. మళ్ళీ అక్కడ్నుంచి హైదరాబాదుకు వెళ్ళారు. ఇలా నిరంతరం వలసలు వెళ్ళే శరణార్థులకు ఆశ్రయ మిచ్చేవారి భాషే వస్తుంది కాని, వారి సొంత భాష వికసించదు. ఏ భాషవారికైతే అత్యధిక నంఖ్యాకులు వారి భాషనే మాట్లాడే సుస్థిర రాజధాని నగరం ఉంటుందో,
వారి భాష కూడా నులభంగా రాజ్యమేలుతుంది. రెండు మూడు భాషలవారు అధికార యంత్రాంగంలో ఉన్నపుడు ఒకరి భాష ఒకరికి అర్థంగాక, ఎవరి భాష పెత్తనం కోనం వారు పెనుగులాడుతుంటే, ఇద్దరినీ మర్ధించే మూడో భాష పెత్తనం చెలాయిన్తుంది.
''భాషను ఆధునిక శాన్త్ర సాంకేతిక పదాలతో పరిపుష్ఠం చేసినపుడే ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయి అన్నారు రాష్రపతి అబ్దుల్ కలాం. మన భాషా పాటవంతో చదివినవారికి ఉపాధి రంగంలో రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించినా ఎంతోమంది తెలుగు భాషలోనే శాన్త్ర సాంకేతిక విద్యలు చదవటానికి తరలి వస్తారు. కోటి విద్యలు కూటి కొరకే కదా!---(తెలుగు అధికార భాషకావాలంటే) పుస్తకంలో నా ముందుమాట.
ఖురాన్ సహా అనేక ఇతర ఇస్లామిక్ పుస్తకాలను నెట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంచిన TIP పెద్దలకు కృతజ్నతలు.e-హదీసులను కూడా త్వరలో వెలువరిస్తారని ఆశిస్తున్నాను.


TIP వంటి అనేక తెలుగు వెబ్సైట్ల అవసరం ఉన్నది.


www.islamhouse.com  తెలుగు విభాగంలో

కూడా అమూల్యమైన అనేక తెలుగు పుస్తకాలు, వ్యాసాలు, దివ్యగ్రంథాల అనువాదాలు ఉన్నాయి. వీటిని ఉచితంగా చదువుకోవచ్చును, డౌన్ లోడు చేసుకోవచ్చును. మీరు చెప్పినట్లు వేరే నగరాలలో మన రాజధాని ఉండటమనేది తెలుగు భాష ఎదుగుదలకు ఒక అవరోధంగా నిరూపితమైనది. మనకు ఎదురైన ఈ రెండు చేదు అనుభవాల (మద్రాసు, హైదురాబాదు రాజధానుల నుండి ఖాళీ చేయవలసి రావటం) ద్వారానైనా మనం గుణపాఠం నేర్చుకోవలసి ఉన్నది.



రెండో పాప / బాబును దత్తత తీసుకోండి

 

రెండో పాప / బాబును దత్తత తీసుకోండి

చాలా ఏళ్ల కిందట ఒక మిత్రుడు చెప్పాడు ఈ కాన్సెప్ట్ ను. మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, రెండో పాప బాబు కావాలనుకున్నపుడు ఒక అనాధను దత్తత తీసుకోవాలి అని చెప్పాడు. దీనివల్ల ఒకరికి పూర్తి స్థాయి జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు. జనాభా సమస్య అరికట్టడానికి వ్యక్తిగత స్థాయిలో కృషి చేసినట్లు అవుతుంది. ఒక అనాథకు జీవితం ఇవ్వడం అంటే వారు ఒక జీవితానికి సరిపడా సేవ
చేసినట్లే అని నా భావన.

అలాగే పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం ఖర్చు పెట్టుకునే బదులు దత్తత తీసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఈ వైద్యం చేయించుకునే క్రమంలో ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి మరోరకమైన హింస. వర్తమానాన్ని ఆనందించడం మాని చాలామంది భవిష్యత్తు కోసం బాధ పడుతుంటారు. విసిగివేసారిన దంపతులకు ఆ పాప / బాబు రాక అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించాలి.
సమాజం, బంధువులు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ మొదట వదిలేయాలి. మనం జీవిస్తోంది మనకోసం. మనం ఎవ్వరికీ హాని చేయడం లేదు.

ఏమి చేసినా ఎన్ని సాధించినా మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.

పిల్లలు లేని రెండు జంటలకు నేను ఈ విధమైన చైతన్యం కల్పించగలిగాను. రెండో జంటతో ఈ రోజు నేను స్వయంగా అప్లికేషన్ వేయిస్తున్నాను.

వీరికంటే ముందు నేను ఆచరించాను. మా పాప చాలా చాలా యాక్టివ్. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నాం.

మీ పరిధిలో పిల్లలు లేని దంపతులకు ఈ రకమైన చైతన్యం కల్పించండి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే హైదరాబాద్ లోని శిశువిహార్ కార్యాలయంలో ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలు తీసుకోవడానికి మన వంతు రావాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అప్పటికప్పుడు అని కాకుండా ఒక దరఖాస్తు వేసి, ఈ లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు
పరచుకోవచ్చు.

ఏకాభిప్రాయం కుదురుతుందా?

 

సమైక్యాంధ్రుల వాదనలు

* పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా
వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.ఇటు తెలంగాణ, అటు జైఆంధ్ర ఉద్యమం నడుస్తున్న
సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు గట్టిగా కట్టుబడి ఉన్నానని ఇందిరాగాంధీ 21.12.1972న పార్లమెంటులో ప్రకటించారు.చారిత్రకంగా సుదీర్ఘకాలం పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు ఒకే ఛత్రం కింద ఉన్నాయి.తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్దాలు పోరాడారు.భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత
ఉంది.ప్రాంతాల సెంటిమెంట్‌తో కొట్టుకుపోకూడదు.దేశంలో వెనకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేదీ లేదు. తెలంగాణలో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి.ఇలాంటి విభజన కొనసాగిస్తే, విభజన రేఖ ఎక్కడ గీయగలం. ఒక్కో జిల్లా, ఒక్కో రాష్ట్రం కావాలని కోరుకుంటే? మనం పురాతన కాలం నాటి చిన్న చిన్నసంస్థానాధీశులుండే కాలానికి
వెళ్తామా?ప్రత్యేకవాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేకవాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తవచ్చు.తెలంగాణ డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఏకాభిప్రాయం లేదు. తెలంగాణ ప్రాంతం రాజధానికి దూరంగా లేదు. అసలు రాజధానే తెలంగాణ ప్రాంతంలో ఉంది.అసెంబ్లీలో తెలంగాణపై
తీర్మానం ఆమోదం పొందలేదు.సమైక్య ఆంధ్ర ద్వారానే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. తెలంగాణ రాష్ట్రం అయితే మావోయిస్టుల కేంద్రంగా మారుతుంది. చిన్న రాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి. సమైక్యాంధ్ర కొనసాగాలని ఉద్యమించడం ఆంధ్రుల విశాల హృదయాలకు నిదర్శనం.ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అధికశాతం నిధులు కేటాయించింది.కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల వారు తప్ప తెలంగాణలో
మిగతా జిల్లాల వారు సమైక్యాంధ్రగానే ఉండాలని కోరుకుంటున్నారు.రాష్ట్రాన్ని విభజిస్తే సహించేదిలేదు.తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు.కుటుంబాలను విడదీయొద్దు.ఎన్నో ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్ర, సీమ ప్రజలు ఒకరింట్లో ఒకరు వియ్యమొందారు. ఇప్పుడు విభజన చిచ్చుతో ఆ కుటుంబాలను విడదీస్తున్నారు.తెలంగాణ ఉద్యమం నడిపినా ఏ నేతా గెలవలేదు?సీమాంధ్ర
ప్రాంతంలో జరిగిన ఉద్యమం పేదలు, సామాన్యుల నుంచి పుట్టుకొచ్చింది.మేం ఇక్కడ సంపాదించిందంతా తెలంగాణలో పెట్టి అక్కడ ప్రజల అభివృద్ధికి పాటుపడితే ఇప్పుడు సాగర్‌ వద్ద అడ్డుగోడలు కడతారా?అడ్డుగోలుగా మాట్లాడినా, అడ్డుగోడలు కట్టినా అడ్డంగా తిరగబడతాం.యాసకో రాష్ట్రం ఇస్తారా: తెలుగు వారంతా ఒక్కటేనని అంటుంటే మా భాష, యాస వేరంటారేంటి?హైదరాబాద్‌ కోసం చేసిన శ్రమ అంతా
దెబ్బ తింటోంది.హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భూముల విలువలు విపరీతంగా పెరిగి రైతులు లాభపడ్డారు.ఈ కృషి అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది.కొద్దిమంది కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం సరైందని కాదు.విభజన
తప్పనప్పుడు రెండే ఎందుకు, నాలుగు రాష్ట్రాలుగా చేస్తే తప్పేమిటి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించాలి, దానికి పారామీటర్స్‌ ఏమిటి?ప్రజల సెంటిమెంట్‌ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని అంటే బోడోల్యాండ్‌, గూర్ఖాల్యాండ్‌ వంటివి చాలా అంశాలున్నాయి.పోనీ వెనుకబాటుతనం ప్రాతిపదికన అనుకున్నా.. ప్రతిచోటా పేద, ధనిక వర్గం ఉంది. కేవలం అభివృద్ధి, సెంటిమెంట్ల ఆధారంగానే
రాష్ట్ర విభజన జరపాలంటే, దేశాన్ని చాలా ముక్కలు చేయాల్సి ఉంటుంది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి తేడాలతో సంస్కృతి, అలవాట్లు, భాష ఒకే విధంగా ఉన్నాయి.

తెలంగాణా వాదుల వాదనలు

* ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు
ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే.స్థానికేతరులకు భయం వద్దు.తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది.తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు అక్కడ పాగా వేస్తారనీ, సాగునీటి
కోసం ఆంధ్ర ప్రాంతం అల్లాడిపోతుందనీ జరుగుతున్న ప్రచారం వాస్తవరహితం.ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక.ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది. స్వాభిమానానికి సంబంధించినది. ఉనికి, వివక్ష, దోపిడీలతో ముడిపడింది.రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో
తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు. ఇలాంటి విషయాల్లో ఏకాభిప్రాయం ఎన్నడూ కుదరదు.స్వార్థపరశక్తులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెచ్చాయి.వాస్తవంగా ప్రజల్లో ఆందోళన లేదు. ఉన్నా పరిష్కరించుకోవచ్చు. నష్టపోతున్నవారే లేనిపోని ప్రచారం చేస్తున్నారు. దోచుకోవడం కుదరదన్న ఉద్దేశంతోనే భయాందోళనలు కలిగిస్తున్నారు. తెలంగాణాలో స్థిరనివాసం ఉంటున్న వారి
విషయంలో కొన్ని సందేహాలుంటాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.తెలంగాణాలో స్థిరపడిన ప్రజలకు ఎలాంటి హానీ జరగదు. పెట్టుబడిదారుల ఆస్తులే గానీ ప్రజల ఆస్తులు చర్చనీయాంశం కాదు. ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇది రాష్ట్ర విభజన మాత్రమేనని అందరూ గుర్తించాలి. తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని
అనుకోవడం సరికాదు.ఎవరికి ఎన్ని నీళ్లో.. చెప్పేందుకు ట్రైబ్యునళ్లు ఉన్నపుడు భయపడాల్సింది లేదు.రాజకీయ, భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే. అది తెలంగాణా రాజధానిగా ఉండాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోవడం ఉత్తమం. తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్రతో బలవంతంగా కలిపారు.విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై
ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది.ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.బడ్జెట్‌ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం.సహజవనరులు, నీళ్లు లేక తెలంగాణాలో ఆత్మహత్యలు జరిగాయి.చిన్న
రాష్ట్రాలు ఏర్పడ్డాక జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌లలో పరిపాలన యంత్రాంగం బలోపేతమైంది.ఆంధ్ర, తెలంగాణా విడిపోయాక రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి, దానికి తగ్గ వనరులు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నాయి.

ప్రత్యేకాంధ్రుల వాదనలు

* విభజన వలన కాక, కలిసి ఉండటం వల్లనే ఆంధ్ర ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలరు?కోస్తా, సీమ ప్రాంతాల అభివృద్ధి కన్నా, హైదరాబాద్‌లో సొంత ఆస్తుల పరిరక్షణకే 'సమైక్యవాదం' చేపట్టారు.సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌గా ఉండాలి.సీమ, కోస్తాల్లోని వెనకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు.తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగితే
సమైక్య రాష్ట్రాన్ని ఎలా సమర్థిస్తారు?610 జీవో వల్ల ఆంధ్రా ప్రాంతం వారికి జరుగుతున్న నష్టాల గురించి ఏనాడైనా స్పందించారా? సామాన్యుడి అవస్థల కన్నా హైదరాబాద్‌లో మీ ఆస్తులు రక్షణకే సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్నారు. హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధిని గురించి ఎన్నడైనా ఆలోచించారా? సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమనుకుంటే
ఇంతవరకు ఇతర నగరాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? రెండు లేదా మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా? 42 మంది ఎంపీలు ఉన్న మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సాధించింది ఏమిటి ? తక్కువ ఎంపీలున్న చిన్న రాష్ట్రాలు సాధించలేనిది ఏమిటి?హైదరాబాద్‌ చుట్టూ కేంద్రీకృతమైన తమ ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు సమైక్య వాదం
పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారు.విడిపోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుంది.భాగో అనిపించుకునే ఖర్మ మనకెందుకు?ఆత్మాభిమానం నిలుపుకునే విడిపోదాం.హైద్రాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి.1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావ సమైక్యత లేదు. తెలంగాణ ఉద్యమం నిన్నా ఉంది.. నేడూ ఉంది... రేపూ ఉంటుంది. వాళ్లు మమ్మల్ని
వెళ్లిపొమ్మని అంటున్నప్పుడు... ఆత్మాభిమానం ఉన్న మాకు పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేశాం కాబట్టి దీనిని వదిలిపెట్టడం ఎలాగ?ఈ రాజధాని నాది అనుకుని ఆ ప్రాంతాల్లోని ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక్కరైనా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. నగర అభివృద్ధిలో మేమూ భాగస్వాములమే... దీన్ని పెంచాం..
హైదరాబాద్‌ మనది అనుకున్నారు. 1972 నాటికి హైదరాబాద్‌పై ఇంత మమకారం లేదు. ఇవాళ ఎంతో చేశాక... నగరంతో మమేకం అయ్యాక వెళ్లిపోవాలంటే బాధగా ఉంటుంది కదా... ఆ రోజు ముల్కీ నిబంధన కారణంగా వెళ్లిపోతామన్నారు... ఇప్పుడు ఇంతకాలం ఇక్కడే ఉన్నందున కలిసే ఉందామంటున్నారు.విభజన జరిగినంత మాత్రాన ఇక్కడున్న 30 లక్షల మంది వెళ్లిపోవలసిన అవసరం లేదు. ఇక్కడున్న వారంతా తెలంగాణవారే అవుతారు.
వాళ్లు, వీరూ మమేకమై జీవితాలు గడుపుతారు.మనం ఇక్కడి నుంచి ఆత్మాభిమానంతో వెళ్లిపోతే ఏ సమస్యా ఉండదు. తెలంగాణ ప్రజలంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కాదు.. కలిసే ఉందామనడం సమంజసం కాదు.హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, ప్రత్యేకాంధ్రకు తగిన నిధులు తెచ్చుకుని ఆత్మగౌరవం కోసం మనం విడిపోదాం జై ఆంధ్రా.

ఐఏఎస్‌ ఐపిఎస్‌ల భయం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారందరిలో ఎక్కువ శాతం కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్ర రాష్ట్రా సర్వీసుల్లోకి వెళ్ళాలి.ఒక వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లయితే కేంద్ర సర్వీ సులకు చెందిన అధికారులను మూడుగా విభజిస్తారు.హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించినట్లయితే గ్రేటర్‌
హైదరాబాద్‌ పరిధి లోకి వచ్చేందుకు కేంద్ర సర్వీసు అధికారులు విముఖత చూపుతున్నారు. ఎందుకంటే యూనియన్‌ టెరిటరీ కేడర్‌లోకి వచ్చినట్లయితే ఇకపై వారి బదిలీలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమవుతాయి. దీని వల్ల హైదరాబాద్‌ యూనియన్‌ టెరిటరీ(కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి వేరొక చోటకు బదిలీ కావాలంటే మరొక కేంద్ర పాలిత ప్రాంతానికే బదిలీ కావా ల్సి ఉంటుంది.
తెలుగు సినీ పరిశ్రమ భయం

మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలివచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రామకృష్ణ సినీ స్టుడియో, అన్నపూర్ణ సినీ స్టుడియో, రామానాయుడు స్టుడియో, పద్మాలయా స్టుడియో, రామోజీ ఫిలింసిటీ స్టుడియోలు నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. పద్మాలయా స్టుడియో లోని కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించిన వ్యవహారం పై టిఆర్‌ఎస్‌
కోర్టుకెళ్ళింది. తమ ప్రాంతంలో పేదలకు పంపిణీ చేయవలసిన భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన సినీవర్గాలకు ఇచ్చారన్న వివాదం మొదలయింది.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు

 

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad.nic.in/
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur.nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor.nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari.nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur.nic.in/
1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad.nic.in/
1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa.nic.in/
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar.nic.in/
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam.nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna.nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool.nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar.nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak.nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda.nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore.nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad.nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam.nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy.nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam.nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatnam.nic.in/
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram.nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal.nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari.nic.in/
విశేషాలు

* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,

స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

The translation of the word NEW in telugu

 

New :
కొత్తగా. New born కొత్తగా పుట్టిన.
Newfangled :
కొత్తగా కల్పించిన, నూతన సృష్టియైన, లోకములో లేని,విపరీతమైన, వింతైన, చోద్యముగా వుండే, యిది తిరస్కార ద్యోతకమైన శబ్దము. Newfangled expressions యెన్నడు వినని కనని మాటలు. he has built his house in a Newfangled style లోకములో లేని తరహగా యిల్లు కట్టించినాడు.
Newfangleness :
విపరీతము, లోకములో లేని వింత, చోద్యము.
New-gate :
లండన్ పట్టణములో వుండే వొక పేట, ఆ పేటలో వుండే పెద్ద చెరసాలయున్ను, దీని దగ్గెర తూకు వేస్తారు. a New-gate attorney దొంగల గురువు.
Newly :
కొత్తగా, నవీనముగా, అపూర్వముగా.
Newness :
కొత్త రకము, నవీనత, అపూర్వము. from the Newness of the house ఆ యిల్లు కొత్తది గనుక.
News :
సమాచారము, వర్తమానము.
Newsmonger :
పనికి మాలిన సమాచారములు చెప్పుతూ తిరిగేవాడు, విచారించేవాడున్ను
Newt :

జలగోధిక, నీరుడుము.
డిక్షనరీ లో ఉన్న అర్ధాలివి.

కంప్యూటర్లో తెలుగు రాయడం

 

1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __
3.అనూ ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా?

http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe .. ఇక్కడినుండి ''iComplex_2.0.0.exe''' ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి ఫాంటు ఉంటుంది.వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.

Win98 --http://etelugu.org/node/207
Win2000 --http://etelugu.org/node/208
Linux --http://etelugu.org/node/210

కంప్యూటర్లో తెలుగు రాయడం
లేఖిని --http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#
స్వేచ్ఛ – http://swecha.org/input/index.html, http://atcweb.atc.tcs.co.in/opensource-downloads
యంత్రం --http://www.yanthram.com/te/
లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
ఇన్ స్కిప్ట్ -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
బరహా -- http://www.baraha.com/download.htm
అను మాడ్యూలర్ -- http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-other-keyboard-layouts/
అను ఆపిల్ -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
అక్షరమాల -- http://groups.google.com/group/aksharamala
జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input
అక్షర్ ---http://www.kamban.com.au/
TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx

Microsoft -Indian language input tool--ఇటీవలే విడుదల అయ్యింది.నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు.
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
• ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
• పద్మ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
• తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
• ప్రముఖ్ టైప్ --http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx
సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి :http://uni.medhas.org/
ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:

ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html
4. itrans --http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).

http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store

వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:

మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm

లిపులు –లిప్యంతరీకరణ.
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. Akshar Unicode, Code2000 , Gautami, Pothana , RaghuTelugu , Saraswati5, Vemana2000.http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
RTS ,Unicode , ISCII , ITRANS , TSCII , TAB & TAM, ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు, శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు . కానీ ఇప్పుడు యూనీకోడ్ ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల
సామర్థ్యానికి ఎదిగింది. http://padma.mozdev.org/.
ఈమాట - Non-Unicode Font to Unicode Converter --
http://eemaata.com/font2unicode/index.php5
Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana లాంటి కొన్నిఅను ఫాంట్ల సమశ్య సురేష్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఇంకా సాక్షి(SW908.TTF), సూరి, కొత్త అను ఫాంట్లు,యూనికోడ్ లోకి మార్చాలి . ఫాంట్లపై పేటెంట్ రైట్లు గల వ్యాపార సంస్థలవారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే ,యూనికోడ్ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.
అనువాద ఉపకరణం
http://docs.google.com/support/bin/static.py?page=faq.html&hl=te
మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే,దీంతో పని తగ్గుతుంది. పైగా విదేశాల్లో, భాషరాని వారికి ఇది బాగా అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాల లో ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది.ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

ఇవికూడాచూడండిః
• ఈటీవీ2లో 20.5.2007న "తెలుగు-వెలుగు " కార్యక్రమం లో నా ఇంటర్ వ్యూ http://telugu.fliggo.com/video/GcLNlAgS
• తెలుగు భాష - చర్చా వేదిక వ్యాసం "ఇలా చేస్తే బాగుంటుంది "విపుల నవంబర్ 2007 http://eenadu.net/vipnew3/display.asp?url=vip-kathalu13.htm

నూర్ బాషా రహంతుల్లా డిప్యూటీ కలెక్టర్ విజయవాడ .

విజయవాడ వద్ద కృష్ణా నదిపై 5 ప్రతిపాదనలు

 
1.ప్రకాశం బ్యారేజి మూసివేసినందువల్ల ట్రాఫిక్ సమశ్య పెరిగింది.విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణా నదిపై ఉన్న పాత రైలు బ్రిడ్జిని ఊడదీశారు.తాడేపల్లి ఈమధ్య మునిసిపాలిటీ అయ్యింది.ఈ వంతెనను సైకిళ్ళు పాదచారుల కోసం రెండు మునిసిపాలిటీలు వుడా వారు కలిసి పునరుద్ధరిస్తే రెండుజిల్లాల మధ్య ట్రాఫిక్ సమస్య కొంతవరకైనా తగ్గుతుంది.
2.ప్రకాశం బ్యారేజి నుండి లీక్ అయ్యే నీరు వృధాగా పోతోంది.విజయవాడ-తాడేపల్లి మునిసిపాలిటీలు వుడా వారు కలిసి కనకదుర్గ వారధి వద్ద 1గజం ఎత్తున అడ్డుగోడ నిర్మిస్తే నీళ్ళు నిలబడి పర్యాటకులకు అహ్లాదకరంగా ఉంటుంది.భూగర్భజలాలలో ఉప్పు శాతం తగ్గి మంచి నీరు దొరుకుతుంది.నదీ గర్భంలో ఆక్రమణలు తగ్గుతాయి.భక్తుల పుణ్యస్నానాలకు మరింత చోటులభిస్తుంది.
3.ప్రకాశం బ్యారేజిపై నుండి ఆర్టీసీ మినీ బస్సులు నడిపించాలి.
4.కనకదుర్గ వారధి నుండి ప్రకాశం బ్యారేజివరకు కృష్ణానది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.
5.గ్రేటర్ విజయవాడలో కేవలం ౩కి.మీ దూరంలో గుంటూరుజిల్లాలో ఉన్నకృష్ణాకెనాల్ జంక్షన్, తాడేపల్లి మునిసిపాలిటీని కూడా కలిపి జంట నగరాలుగా అభివృద్ధి చెయ్యాలి.

Scriptures always advocate peace and tolerance but devotees always turn violent.

 
Activists belonging to Sankriti Bachao Manch and 'Akhil Bharatiya Vidhyarti Parishad (ABVP) protested the launch ceremony of Rishi Ajaydas's Hindi book titled 'Vivah - Ek Naitik Balatkar' (Marriage, a moral rape) as they found it an attempt to belittle the institution of marriage viewed highly in Indian culture.They claimed the contents of the book is an insult to marriage institution and an attack on Indian ethos.While manhandling the author Ajaydas, some activists tried to blacken his face, but police prevented them.
Speaking to ANI, Sanskriti Bachao Manch convener, Chandrashekhar Tiwari said: 'If someone tries to launch an attack on our culture then we can even take more severe action than this. This was just a trailer and if someone attacks our culture then obviously we will not tolerate it.'

Similar incidents happened with Salman rushdie's satanic verses and Taslima nasreen's Lajja.Authors should be very careful in writing such books.Scriptures always advocate peace and tolerance but devotees always turn violent.