welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, March 31, 2010

నారాయణ నారాయణ అల్లా అల్లా

 
నారాయణ నారాయణ

నారాయణ నారాయణ అల్లా అల్లా

మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా || నారాయణ ||

మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే

మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ ||

ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే

కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే

మతం వద్దు గతం వద్దు

మారణ హొమం వద్దు || నారాయణ||

మతమన్నది గాంధీజీ హితమైతే

మతమన్నది లోకానికి హితమైతే

హిందువులం ముస్లిములం

అందరము మానవులం,

అందరమూ సోదరులం || నారాయణ ||

---దేవులపల్లి కృష్ణశాస్త్రి

కులం కులం అని కుఛ్ఛితాలు పెంచుకోకు

 


కులం కులం అని కుఛ్ఛితాలు పెంచుకోకు

ఓ కూటికి లేనివాడా మనదంతా ఒకే కులం అదే అదే మనిషి కులం [కులం]

మతం మతం అని మాత్సర్యం పెంచుకోకు

ఓ సమతా మానవుడా మనదంతా ఒకే మతం అదే అదే మనిషి అభిమతం [కులం]

నాదినాది అని వాదులాట పెంచుకోకు

ఓ డొక్కలైన నిండనోడా మనదంతా ఒకే శక్తి అదే అదే మనిషి శ్రమశక్తి [కులం]

సి విజయలక్ష్మి (విప్లవ శంఖం)

స్వాములూ మనుషులే

 
స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

Taslima denies writing article, says its attempt to malign her

 
New Delhi: Exiled Bangladeshi writer Taslima Nasreen on Tuesday said the appearance of an article in a Karnataka newspaper purportedly written by her, which triggered violent protests in Shimoga and Hassan towns, is a "deliberate attempt to malign" her and "misuse" her writings to create disturbance in the society.

Nasreen said in a statement made available to PTI that she never penned any article for a newspaper in Karnataka.

"The incident that occurred in Karnataka on Monday shocked me. I learned that it was provoked by an article written by me that appeared in a Karnataka newspaper. But I have never written any article for any Karnataka newspaper in my life," she said.

Nasreen said, "The appearance of the article is atrocious. In any of my writings I have never mentioned that Prophet Muhammad was against burkha. Therefore, this is a distorted story."

The author said, "I suspect that it is a deliberate attempt to malign me and to misuse my writings to create disturbance in the society.I wish peace will prevail."

The violence in Shimoga, the home town of Karnataka Chief Minister B S Yeddyurappa, left two people dead, one of them in police firing on Sunday.

Nasreen, staying in an undisclosed destination due to security reasons since her return to India last month, had her visa extended recently by six months till August this year.

Replying to a question, she said she would not like to say anything other than the statement issued by her.

http://in.news.yahoo.com/20/20100302/1416/tnl-taslima-denies-writing-article-says.html

ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే ఆత్మబంధువు

 


మారదు మారదు మనుషులతత్వం మారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు భ్రమపడకూడదు [[మారదు]]

సూర్య చంద్రులూ మారలేదులే చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం మారటమంటే సుళువుకాదులే [[మారదు]]

పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు చెవులకు చేటలు కడతారు [[మారదు]]

కాసుపడనిదే తాళి కట్టరు పెళ్ళిపీటపై వారు కాలు పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ చదువుకున్నవారే కలలుకందురూ [[మారదు]]

ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ ఆత్మబంధువూ

అనాథలకు 'అమ్మా నాన్న'

 
అనాథలకు 'అమ్మా నాన్న'..!


చౌటుప్పల్‌, న్యూస్‌లైన్‌: మాసిపోయిన బట్టలతో, పెరిగిపోయిన జుట్టుతో, దుర్వాసన వెదజల్లుతూ, ఒంటిపై బట్టలు లేకుండా, ఆకలి ఆకలి అంటూ పెంటకుప్పలపై పారేసిన విస్తర్లలో దొరికినది తింటూ మతిస్థిమితం లేని వాళ్లు చౌటుప్పల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ కనిపించే వారు. అయితే 25 రోజులుగా వారు కని పించడం లేదు. వారంతా ఏమై పోయారో, ఎక్కడికి వెళ్లారో
తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథ చదవండి...

ఆ యువకుని వయస్సు అప్పుడు ఆరేళ్ల్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి చదువుతున్న అతని అన్న మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతుండేవాడు. రోడ్లపైనే తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ దొరికింది తినే వాడు. చివరకు రామోజీ ఫిలింసిటీ దగ్గర ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కాలు విరిగింది. ఇంటికి తీసుకువచ్చారు. ఏడాది పాటు గాయంతో కుంగి, కృశించి మృత్యువు పాలయ్యాడు. తన
అన్న ఏడేళ్లు అనుభవించిన నరకాన్ని కళ్లారా చూశాడు. అప్పటి నుంచి ఆ యువకుని మనస్సులో రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వాళ్లను చేరదీయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. వెంటనే వారిని ఆదుకునేందుకు నడుం కట్టాడు. అతడే సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన గట్టు శంకర్‌.

అతని వయస్సు ప్రస్తుతం 30 ఏళ్లు. గ్రామంలో ఆరో తరగతి వరకు చదివి, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో తన తండ్రి వెంట 1993లో ముంబైకి వెళ్లాడు. జిల్లా నుంచి ముంబైకి వెళ్లే బస్సులను శుభ్రం చేసే పనికి కుదిరాడు. అనంతరం టికెట్ల బుకింగ్‌ కోసం ట్రావెల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. 2007లో తిరిగి వచ్చి చౌటుప్పల్‌లో శంకర్‌ ఏజెన్సీ పేర టీవీ షోరూం ఏర్పాటు చేశాడు. దానిద్వారా వచ్చిన
ఆదాయంలో 75శాతం అనాధల సేవకు వెచ్చిస్తున్నాడు.

చిన్ననాటి ఆశయ సాధనకు..
రోడ్లపై తిరిగే మతిభ్రమించిన వారిని చూడగానే అతని మనస్సు చలించిపోయేది. వారి కోసం ఏదో చేయాలనే చిన్ననాటి ఆశయం అతని మదిలో మెదలాడుతూనే ఉంది. చేతిలో కొద్దిపాటి డబ్బు ఉంది కదా అని చిన్న ఆలోచన చేశాడు. వలిగొండ రోడ్డులో బాలాజీ దేవాలయం పక్కన ఎందుకూ వాడని షెడ్డు ఉంది.

దానిలో ఐదారు గదులున్నాయి. వెంటనే ఆ షెడ్డు యజమాని చంద్రశేఖర్‌ను కలిసి, తన ఆశయాన్ని, ఆలోచనను వివరించాడు. దీంతో షెడ్డు యజమాని దానిని ఏడాది పాటు ఉచితంగా ఉపయోగించుకునేందుకు హామీ ఇచ్చాడు. దీంతో 2010 ఫిబ్రవరి ఒకటిన ఆ షెడ్డులో అమ్మా..నాన్న అనాధ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆశ్రమ నిర్వహణకు 10 మందిని నియమించాడు.

రోడ్లపై తిరిగే వాళ్లను తీసుకొచ్చి..
రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వాళ్లను చేరదీస్తూ, ఆశ్రమం వద్దకు తీసుకెళ్తున్నారు. మాసిన బట్టలు, పెరిగిన క్షవరాలు, దుర్వాసన వెదజల్లుతున్నా తడుముకోకుండా వారికి సపర్యలు చేస్తున్నారు సంస్థ నిర్వాహకులు.

వారికి క్షవరాలు చేయించి, ప్రతి రోజూ ఉతికిన బట్టలు వేస్తున్నారు. ప్రతిరోజు స్నానం, మూడు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. గడిచిన 20 రోజుల కాలంలో ఈ మతిస్థిమితం లేని వారి జీవితాల్లో మార్పు కన్పిస్తుందంటే అతిశయోక్తి లేదు. పిల్లలున్నా చూడని తల్లిదండ్రులు, ఏ దిక్కూ లేని వృద్ధులు అందరూ కలిసి దాదాపు 20 మంది ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఉన్నారు.సాక్షి 26.2.2010