welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, December 23, 2010

సంస్కారమను జందెమును దాల్చు మనుజులెల్లరు విప్రులీ మహిని నిజము

 



భక్తిభావమ్ము పెంపారు బహుళగతులా

ఆత్మచింతన అద్దానికానవాలు

నీచమైనట్టి వృత్తిని పూనికూడా

నమ్మికొలిచిన ఇత్తును మోక్షమ్ము నిజము




శాస్త్రమ్ములెల్లను చదివిన లెస్సయా

మనసువెన్నెలగాగ మసలవలయు

నుదుట విబూదినలదిన పసందౌనా

మదిలోన దయనెంతొ దలచవలయు

తావలమ్ములచేత తడవిన పనియౌనా

చేజాచి దానమ్ము చేయవలయు

సత్యమును గొలిచి ధర్మమ్ము సంతరించి

స్వార్ధమునుచంపి త్యాగభావమ్ము పెంచి

ఈ విధి సంస్కారమను జందెమును దాల్చు


మనుజులెల్లరు విప్రులీ మహిని నిజము

---రఘురామయ్య పద్యాలు,చింతామణి.

తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం

 


తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం


కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి :

*తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి. *మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి.దీనిపై ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి 2006లోనే లేఖ రాశారు.

*తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రం లో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి. *తమిళంలో చదువుకున్న అభ్యర్ధులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.

*పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.

*తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.

*తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.

మన రాష్ట్రం కూడా తెలుగు భాష గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను.


అనితర సాధ్యమైన అక్షరశిల్పులు -మంచి పుస్తకం

 



అనితర సాధ్యమైన అక్షరశిల్పులు

మంచి పుస్తకం

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మంచి రచయితగా, పరిణతి చెందిన పాత్రికేయునిగా చిరపరిచితులు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిములు నిర్వహించిన పాత్రను వివరిస్తూ ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలు పుస్తకాలుగా వెలువడి పాఠకాదరణ పొందాయి. ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల గురించిన సమాచారం సేకరించడానికి ఎంతో కష్టపడిన నశీర్‌ అహమ్మద్‌ ఇప్పుడు మరింత క(ఇ)ష్టపడి 'అక్షరశిల్పులు' అనే గ్రంథాన్ని అందించారు.




ఇందులో రాష్ట్రం నలుమూలలా ఉన్న 333 మంది ముస్లిం కవులు, రచయితలు, అనువాదకులను పరిచయం చేస్తూ, వారు చేసిన, చేస్తున్న సాహితీ సేవను పాఠకుల ముందుంచారు. ఆయా కవులు, రచయితలు, అనువాదకుల పరిచయాలు, వారు చెక్కిన సాహితీ శిల్పాల గురించి క్లుప్తంగానే చెప్పినప్పటికీ, తనకు అంది (తెలిసి)నంత వరకూ వారి చిరునామాలు, టెలిఫోన్‌ నంబర్లను సేకరించడానికి చేసిన కృషి, వారి గురించి రాసిన ప్రతి అక్షరంలోనూ సాటి ముస్లింల పట్ల గల ప్రేమాభిమానాలు, వారిని పదిమందికీ పరిచయం చేయడానికి పడ్డ తపన సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.




పాత్రికేయ ప్రముఖులు పొత్తూరి వెంకటేశ్వరరావుగారన్నట్లు ఈ పుస్తకం తెలుగు సాహిత్య పరిశోధకులకు, రచయితలకు మార్గదర్శివంటిదని చెప్పవచ్చు. అయితే ఇంకా ఇందులో సంకలన కర్త దృష్టిలోకి రాని ముస్లిం పాత్రికేయులు, రచయితలు మరెందరో ఉండి ఉండవచ్చు. తమ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని వారు కూడా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ ఇటువంటి పుస్తకం ఒకదానిని తీసుకు రావాలన్న నశీర్‌ అహమ్మద్‌ ఆలోచన ను మెచ్చుకోక తప్పదు.




అక్షరశిల్పులు (ముస్లిం కవులు- రచయితల

సంక్షిప్త పరిచయం)

కూర్పు: సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పుటలు: 180, వెల రూ. 150

ప్రతులకు: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ- 522 647, గుంటూరు జిల్లా మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

సోల్‌ డిస్ట్రిబ్యూషన్‌: తెలుగు బుక్‌హౌస్‌, 3-3-862,

కాచిగూడా ఎక్స్‌రోడ్స్‌, హైదరాబాద్‌- 500 027.




- డి.వి.ఆర్‌. భాస్కర్‌ (సాక్షి 10.7.2010)

మత సామరస్యం

 


మత సామరస్యం

మనమంతా మనుషులం.మానవత్వమే మన మతం.ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి.అలాగే కొన్ని నచ్చని అంశాలూ ఉంటాయి.మంచితనం,మానవత్వం అనే సద్గుణాలు లేని మతం యేదైనా సంస్కరించబడాల్సిందే."మంచి చెడ్డలు రెండె మతములు" అనే సూక్తికి తిరుగు లేదు.మంచి యే మతంలో వున్నాస్వీకరించుదాం.చెడు యే మతంలో వున్నా తిరస్కరించుదాం.మతాన్ని మారణకాండకు సాధనంగా మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు
నరకానికేపొతారు.మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మనలో వుంటే మత కలహాలు జరగవు.స్వర్గం ఇక్కడే వుంటుంది.పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం.హిందూ ముస్లిం భాయీ భాయీ.సహించడమే గొప్ప స్వర్గ ద్వారం. ఎదుటి వారిని నొప్పించేది నిజం అయినా అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది.అప్పుడెప్పుడో ముందు తరాలు వాళ్ళు చేసిందానికి ఇప్పటి వాళ్ళను బాధ్యుల్ని
చేయద్దు.పూర్వం ఎవరో చేసిన పాడుపనులు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలలోనూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారున్నారు.ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని
కోరుకుని పుట్టరు.ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే.శాంతియుత జీవనం గడిపే నేటి ప్రజలకు వారి పూర్వీకుల అకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే.శాంతియుత జీవనం గడుపుతున్న భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది
ఉన్నారు.అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానించే వారికి మోక్షం సిద్ధించదు.హింసకు జవాబు హింస కాదు.ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా ఎన్నోజన్మల పుణ్యఫలం.జీనా యహా,
మర్నా యహా, ఇస్కేసివా జానా కహా' అంటూ అజాతశత్రువుల్లా బ్రతకాలి. మన మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించాలి.వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు.

ఆదర్శనీయులు

* షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ ,నేపధ్య గాయకుడు మొహమ్మద్ రఫీ ,సంగీత దర్శకుడు నౌషాద్ ఎన్నో హిందూ భక్తి గీతాలతో దేశప్రజలను అలరించారు.

* మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్ని మతాల వారి ఆదరణను పొందారు.
* తమిళ నాడులోని శ్రీరంగం దేవాలయం, భద్రాచలం రాముల వారి దేవాలయంలో సన్నాయి వాయించేది తెలుగు ముస్లింలే.షేక్ చినమౌలానా సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు.శ్రీరంగం దేవస్థానంలో స్వర్గీయ షేక్ చినమౌలానా నాదస్వర సేవ చేశాడు.ఆయన మనమడు నేటికీ సేవిస్తున్నాడు.
* పలుదేవాలయాల్లో పూలదండలు సరఫరా చేసేది, మంచి గంధం సప్లై చేసేది ముస్లిములే.
* కేరళలోని మాతా అమృతానందమాయి దేశంలో పలుచోట్ల నిర్మించిన ఆలయాల వాస్తుశిల్పి ముస్లిం.
* భద్రాచలంలోని రాములవారి కల్యాణానికి ఆదినుండి ముత్యాలు నిజాం వంశీయుల నుండి వస్తాయి.
* బీబీ నాంచారమ్మ (వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.తిరుమలలో ఆమె దేవాలయం ఉంది.
* షిర్డీ శాయిబాబా ముస్లిం.అతని మసీదు పేరు ద్వారకామాయి శ్రీరామనవమి పండుగ జరిపేవాడు.
* అక్బర్ చక్రవర్తి మీరా బాయి భజనలు వినడానికి వెళ్ళేవాడు.
* శబరిమలై అయ్యప్పస్వామి భక్తులు దానికి దగ్గరలోని దర్గాకు కూడా వెళతారు.
* నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌లో అయ్యప్ప, షిరిడీ సాయి ఆలయాలకు స్థానిక ముస్లింలు తరలివస్తారు.భజనలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.
* జోధా అక్బర్‌ ,మణిరత్నం "బొంబాయి", కృష్ణవంశీ 'ఖడ్గం' చిత్రాలు కూడా హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండాలని చాటిచెప్పేవే.
* చార్మినార్‌ లోని దర్గా శుభ్రతలో చేయూత నిస్తుంది హిందువు. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల హిందువులు తమలపాకులు, పువ్వులు, అరటిపళ్లు ముస్లింల నుండే కొనుగోలు చేస్తారు.చార్మినార్‌ ప్రక్కనే ఆలయం వుంటుంది.
* పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ లో మీరాసాహెబ్ దుర్గా మాతకు గుడి కట్టి నిష్టతో పూజారిగా ఇప్పటికీ పనిచేస్తున్నాడు.
* నిజామాబాద్‌ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చింది. *సికింద్రాబాద్‌ లోని టకార్‌ బస్తీవాసి షేక్‌ ఇమ్రానుద్దీన్‌,హనుమాన్‌ జయంతిని ఎంతో భక్తితో జరుపు కుంటాడు.
* హైదరాబాద్‌లో బాలాజీ దేవాలయం సమీపంలోనే హనుమంతుని ఆలయం.స్థానికంగా ఓ ముస్లిం మరణిస్తే, గౌరవ సూచకంగా హనుమజ్జయంతిరోజున హనుమంతుని ఆలయాన్ని మూసివేశారు.
* పాతబస్తీలోని గొల్లా ఖిడ్కీ కాలనిలో ఇతేషామ్‌ ఆలీఖాన్‌ స్థానిక ముస్లింలతో, హిందువులపై దాడిని వారించారు. సుబోధ్‌ కుమార్‌, తనహిందూ మిత్రులతో కలిసి హిందూ ఆందోళన కారులనుండి ముస్లిం సోదరులను కాపాడాడు.
‍*గత 25 సంవత్సరాలుగా బేగం బజారులోని మొహ్మద్‌ ఇస్మాయిల్‌ తనదుకాణం 'హషామ్‌ అండ్‌ సన్స్‌' తలుపులపై హిందువుల దేవతాచిత్రాల బొమ్మలకు అగరుబత్తీలు వెలిగిస్తున్నాడు.
* ఒక ముస్లిమ్ మహిళ పెళ్ళి కోసం భాగ్‌పత్ జిల్లాలోని సున్హెరా గ్రామంలోని హిందువులంతా కలిసి చందాలు వసూలు చేశారు.

కావరియా

*" హిందూ, ముస్లింల సోదరభావానికి, ఐకమత్యానికి ఈ యాత్ర ప్రతీక.ఇటువంటి సద్భావన శిబిరాల వల్ల సామాజిక సామరస్యం మరింత పెరుగుతుంది.కావరియాలు తీసుకొని హరిద్వార్‌కు యాత్ర నిర్వహించే భక్తులకు ముస్లిం వర్గాలు స్వాగతం పలికి సత్కరించడం అనేది దేశ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం" .--ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌

చట్టాల తర్జుమా

 


ఈ 17 చట్టాలను తెలుగు లోకి తర్జుమా చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.G.O.Ms.No Law (D) Department103/28-07-2010
1. The Andhra Pradesh Assigned Lands (Prohibition of Transfers) (Amendment)
Act, 2008 (Act No.21 of 2008)
2. The Industrial Disputes (Andhra Pradesh Amendment) Act, 2008 (Act No.22 of
2008)
3. The Andhra Pradesh Land Acquisition (Andhra Pradesh Amendment) Act, 2008
(Act No.23 of 2008)
4. The Andhra Pradesh Advocates 'Clerks' Welfare Fund (Amendment) Act, 2008
(Act No.24 of 2008)
5. The Andhra Pradesh Land Reforms (Ceiling on Agricultural Holdings) (Second
Amendment) Act, 2008 (Act No.25 of 2008)
6. The Andhra Pradesh Tax on Entry of Motor Vehicles into Local Areas
(Amendment) Act, 2008 (Act No.26 of 2008)
7. The Andhra Pradesh Entertainments Tax (Amendment) Act, 2008 (Act No.27 of
2008)
8. The Andhra Pradesh Universities (Amendment) Act, 2008 (Act No.29 of 2008)
9. The Andhra Pradesh Excise (Amendment) Act, 2008 (Act No.33 of 2008)
10. The Andhra Pradesh Rural Electric Co-operative Societies (Temporary Provisions)
(Amendment) Act, 2008 (Act No.34 of 2008)
11. The Hyderabad Metropolitan Development Authority (Amendment) Act, 2008
(Act No.35 of 2008)
12. The Andhra Pradesh Vaidya Vidhana Parishad (Amendment) Act, 2008 (Act
No.36 of 2008)
13. The Andhra Pradesh Municipalities (Amendment) Act, 2008 (Act No.37 of 2008)
14. The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management (Amendment)
Act, 2008 (Act No.39 of 2008)
15. The Andhra Pradesh Education (Amendment) Act, 2008 (Act No.40 of 2008)
16. The Andhra Pradesh Farmer's Management of Irrigation Systems (Amendment)
Act, 2008 (Act No.41 of 2008)
17. The Andhra Pradesh Municipal Laws (Fourth Amendment) Act, 2008 (Act No.42
of 2008)

About BCT and Dr.Parameshwar Rao

 


Newton supposedly said:"If I have seen further, it is only by standing on the shoulders of giants." May be it can be paraphrased to say: if we have walked further, it is only by continuing on the paths
laid out by giants. 

During inception and after of AID(Association for India Development), recall the pointers, guidance and inspiration from BCT (Bhagavatula Charity Trust) together with works and words of Dr.Parameshwar Rao. Gratefully and joyfully remember and cherish it along with others like ILP (India Literacy Project), ASHA etc.,

More can be read at: http://www.eenadu.net/htm/weekpanel1.asp

Akasvani - Audios

 

Friends

It's been a long tiime. Just wanted to let you know, in case any one is interested to listen. I have seen very old telugu dramas, audio recordings from All India Radio here.

Link - http://www.maganti.org/newgen/index1.html

Click on Akasavani section on the left

Best
Murthy

__._,_.___
Recent Activity:
.

__,_._,___

సయ్యద్ మీర్జా

 
ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.

Monday, August 09, 2010

అందరికీ ఒక్కడే దేవుడు

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే [[అందరికీ]]
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవ సేవ
బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్తఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
--- ఒకటే కుటుంబం

Tuesday, August 03, 2010

విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం

శిరా రావు గారికి ధన్యవాదాలతో.ఇక్బాల్ గారి "సారే జహాసే అచ్చా" కి తెలుగు అనువాదగీతం.

విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం
సుస్వరాలమూ మేమూ మధుర వీణ నాదేశం దేశం [[విశాల]]

ధృఢమైన పర్వతములతో ఆకాశాన్నందే నగం
ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే [[విశాల]]

ఈదేశ మాత ఒడిలో పారులేవేళ నదులూ
ఈ సుందరనందన వనమే
స్వర్గానికన్న మిన్న మిన్నా [[విశాల]]

ఏమతమైనా కానీ కలహించడమూ నేర్పదూ
భారతీయులం మనమూ భారతదేశం మనదీ అనాదీ[[విశాల]]

Friday, July 16, 2010

English is our 2nd language why ?

 

More Indians speak English than any other language, with the sole exception of Hindi. What's more, English speakers in India outnumber those in all of western Europe, not counting the United Kingdom. And Indian English-speakers are more than twice the UK's population.

These facts emerge from recently released census 2001 data on bilingualism and trilingualism in India. Indians' linguistic prowess stood revealed with as many as 255 million speaking at least two languages and 87.5 million speaking three or more. In other words, about a quarter of the population speaks more than one language.

English was the primary language for barely 2.3 lakh Indians at the time of the census, more than 86 million listed it as their second language and another 39 million as their third language. This puts the number of English speakers in India at the time to more than 125 million.

The only language that had more speakers was Hindi with 551.4 million. This includes 422 million, who list it as the primary language, 98.2 million for whom it was a second language and 31.2 million who listed it as their third.

The rise of English puts Bengali, once India's second largest language in terms of primary speakers, in distant third place. Those who spoke Bengali as their first, second or third language add up to 91.1 million, far behind English.

Telugu with 85 million speakers in all and Marathi with 84.2 million retain their position behind Bengali as does Tamil with 66.7 million and Urdu with 59 million.

Gujarati now falls behind Kannada though it has a sizeable number of primary speakers — 6.1 million — compared to Kannada's 37.9 million.

Karnataka's linguistic diversity means that many list other languages as their first and Kannada as a second language. This adds 11.5 million to the ranks of Kannada speakers and another 1.4 million use it as a third language. In total, Kannada had 50.8 million speakers in 2001 compared to Gujarati's 50.3 million.

Oriya overtakes Malayalam thanks to the 3.3 million people who listed it as their second language and 3.2 lakh who said it was their third language.

The total number of Oriya speakers was 36.6 million against 33.8 million who spoke Malayalam. Punjabi, with 31.4 million speakers, and Assamese with 18.9 million are among India's most spoken languages.

Unfortunately, the census asked people to list a maximum of three languages, so it is not known how many speak more languages.

The data covers only those over five because the census assumed that younger children would only know their mother tongue.

As expected, urban Indians are more likely to be multi-lingual but as many as 136.7 million rural Indians speak at least two languages. 
http://timesofindia.indiatimes.com/india/Indiaspeak-English-is-our-2nd-language/articleshow/5680962.cms

ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ

 


ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ
ఎల్లమతముల సారమొకటే
తోటకెల్ల వసంతుడొకడే
.......గుడి గంట ఒకటే

ఈ పాట బహుశా సినారె గారు రాశారనుకుంటా.మొత్తం పాట తెలిసినవారు బ్లాగులో పెట్టండి.

Monday, June 14, 2010

కళ్ళు తెరువరా నరుడా


కళ్ళు తెరువరా నరుడా

నీ ఖర్మ తెలియరా [[కళ్ళు]]

కలిమిలేములకు కష్టసుఖాలకు

కారణమొకటేరా నీ ఖర్మే మూలమురా[[కళ్ళు]]

వేపనువిత్తి ద్రాక్షకోసమై

వేడుక పడుట వెర్రికదా

కాలికి రాయి తగులుటకన్న

రాయికి కాలే తగులునురా [[కళ్ళు]]

కమలనాభుని పదకమలములే

కలుష జలధికీ సేతువురా

కలిమాయలలో కలతజెందినా

ధరణికి అదియే తారకమగురా [[కళ్ళు]]

---పి.సూరిబాబు,వెంకటేశ్వరమహత్యం 1960,పెండ్యాల

Saturday, May 29, 2010

తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం


తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది

తుస్సుమనుట ఖాయం

ఓ జీవా తెలుసుకో అపాయం

ఉబ్బుతబ్బులై ఉరుకులు తీయకు

గబ్బుమేను జీవా అవును గబ్బిలాయి జీవా

ఎంతచెప్పినా ఏమిచెప్పినా

కట్టెలపాలౌ పాడు కట్టెరా [[తోలుతిత్తి]]

మూడురోజులా ముచ్చటరా ఈ చింతకట్టె దేహం

కాయం బుగులిపోవు ఖాయం

నువు కట్టుకుపోయేదొట్టిదిరా

ఈ మట్టినిపుట్టి మట్టిన కలిసే [[తోలుతిత్తి]]

వెలుతురుండగా తెరువు చూసుకో

తలచి రామనామం

జీవా చేరు రంగధామం పట్టుబట్టి

ఈ లోకపు గుట్టూ రట్టు చేసే

ఈ రంగదాసుడూ [[తోలుతిత్తి]]

--పాండురంగమహత్యం 1957

తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు


తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్వాక, ప్రబోధాత్మక శతక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;

*ముహమ్మద్‌ హుస్సేన్‌

భక్త కల్పద్రుమ శతకం(1949)

మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ''సుమాంజలి''.

హరిహరనాథ శతకము

అనుగుబాల నీతి శతకము

తెనుగుబాల శతకము

*షేక్‌ దావూద్‌

1963లో రసూల్‌ ప్రభు శతకము

అల్లా మాలిక్‌ శతకము

*సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌

సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము

*ముహమ్మద్‌ యార్‌

సోదర సూక్తులు

*గంగన్నవల్లి హుస్సేన్‌దాసు

హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య

*హాజీ‌ ముహమ్మద్‌ జైనుల్ అబెదీన్‌

ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము

*తక్కల్లపల్లి పాపాసాహెబ్‌

వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ

బెండ్లియాడి మతమభేదమనియె

హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?

పాపసాబు మాట పైడిమూట

*షేక్‌ ఖాసిం

సాధుశీల శతకము

కులము మతముగాదు గుణము ప్రధానంబు

దైవచింత లేమి తపముగాదు,

బాలయోగి కులము పంచమ కులమయా,

సాధులోకపాల సత్యశీల

*షేక్‌ అలీ

గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం

మానస ప్రబోధము శతకం

*షేక్‌ రసూల్‌

మిత్రబోధామృతము అనే శతకం

*ఉమర్‌ ఆలీషా

బ్రహ్మ విద్యా విలాసము.

"తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో పి.హెచ్.డి వచ్చింది.ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు.సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది ప్రస్తుత తెలుగు ముస్లిం కవులు రచయితల వివరాలతో పుస్తకం ప్రచురించారు.

Wednesday, March 31, 2010

నారాయణ నారాయణ అల్లా అల్లా

 
నారాయణ నారాయణ

నారాయణ నారాయణ అల్లా అల్లా

మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా || నారాయణ ||

మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే

మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ ||

ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే

కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే

మతం వద్దు గతం వద్దు

మారణ హొమం వద్దు || నారాయణ||

మతమన్నది గాంధీజీ హితమైతే

మతమన్నది లోకానికి హితమైతే

హిందువులం ముస్లిములం

అందరము మానవులం,

అందరమూ సోదరులం || నారాయణ ||

---దేవులపల్లి కృష్ణశాస్త్రి

కులం కులం అని కుఛ్ఛితాలు పెంచుకోకు

 


కులం కులం అని కుఛ్ఛితాలు పెంచుకోకు

ఓ కూటికి లేనివాడా మనదంతా ఒకే కులం అదే అదే మనిషి కులం [కులం]

మతం మతం అని మాత్సర్యం పెంచుకోకు

ఓ సమతా మానవుడా మనదంతా ఒకే మతం అదే అదే మనిషి అభిమతం [కులం]

నాదినాది అని వాదులాట పెంచుకోకు

ఓ డొక్కలైన నిండనోడా మనదంతా ఒకే శక్తి అదే అదే మనిషి శ్రమశక్తి [కులం]

సి విజయలక్ష్మి (విప్లవ శంఖం)

స్వాములూ మనుషులే

 
స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

Taslima denies writing article, says its attempt to malign her

 
New Delhi: Exiled Bangladeshi writer Taslima Nasreen on Tuesday said the appearance of an article in a Karnataka newspaper purportedly written by her, which triggered violent protests in Shimoga and Hassan towns, is a "deliberate attempt to malign" her and "misuse" her writings to create disturbance in the society.

Nasreen said in a statement made available to PTI that she never penned any article for a newspaper in Karnataka.

"The incident that occurred in Karnataka on Monday shocked me. I learned that it was provoked by an article written by me that appeared in a Karnataka newspaper. But I have never written any article for any Karnataka newspaper in my life," she said.

Nasreen said, "The appearance of the article is atrocious. In any of my writings I have never mentioned that Prophet Muhammad was against burkha. Therefore, this is a distorted story."

The author said, "I suspect that it is a deliberate attempt to malign me and to misuse my writings to create disturbance in the society.I wish peace will prevail."

The violence in Shimoga, the home town of Karnataka Chief Minister B S Yeddyurappa, left two people dead, one of them in police firing on Sunday.

Nasreen, staying in an undisclosed destination due to security reasons since her return to India last month, had her visa extended recently by six months till August this year.

Replying to a question, she said she would not like to say anything other than the statement issued by her.

http://in.news.yahoo.com/20/20100302/1416/tnl-taslima-denies-writing-article-says.html

ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే ఆత్మబంధువు

 


మారదు మారదు మనుషులతత్వం మారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు భ్రమపడకూడదు [[మారదు]]

సూర్య చంద్రులూ మారలేదులే చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం మారటమంటే సుళువుకాదులే [[మారదు]]

పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు చెవులకు చేటలు కడతారు [[మారదు]]

కాసుపడనిదే తాళి కట్టరు పెళ్ళిపీటపై వారు కాలు పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ చదువుకున్నవారే కలలుకందురూ [[మారదు]]

ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ ఆత్మబంధువూ

అనాథలకు 'అమ్మా నాన్న'

 
అనాథలకు 'అమ్మా నాన్న'..!


చౌటుప్పల్‌, న్యూస్‌లైన్‌: మాసిపోయిన బట్టలతో, పెరిగిపోయిన జుట్టుతో, దుర్వాసన వెదజల్లుతూ, ఒంటిపై బట్టలు లేకుండా, ఆకలి ఆకలి అంటూ పెంటకుప్పలపై పారేసిన విస్తర్లలో దొరికినది తింటూ మతిస్థిమితం లేని వాళ్లు చౌటుప్పల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ కనిపించే వారు. అయితే 25 రోజులుగా వారు కని పించడం లేదు. వారంతా ఏమై పోయారో, ఎక్కడికి వెళ్లారో
తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథ చదవండి...

ఆ యువకుని వయస్సు అప్పుడు ఆరేళ్ల్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి చదువుతున్న అతని అన్న మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతుండేవాడు. రోడ్లపైనే తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ దొరికింది తినే వాడు. చివరకు రామోజీ ఫిలింసిటీ దగ్గర ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కాలు విరిగింది. ఇంటికి తీసుకువచ్చారు. ఏడాది పాటు గాయంతో కుంగి, కృశించి మృత్యువు పాలయ్యాడు. తన
అన్న ఏడేళ్లు అనుభవించిన నరకాన్ని కళ్లారా చూశాడు. అప్పటి నుంచి ఆ యువకుని మనస్సులో రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వాళ్లను చేరదీయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. వెంటనే వారిని ఆదుకునేందుకు నడుం కట్టాడు. అతడే సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన గట్టు శంకర్‌.

అతని వయస్సు ప్రస్తుతం 30 ఏళ్లు. గ్రామంలో ఆరో తరగతి వరకు చదివి, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో తన తండ్రి వెంట 1993లో ముంబైకి వెళ్లాడు. జిల్లా నుంచి ముంబైకి వెళ్లే బస్సులను శుభ్రం చేసే పనికి కుదిరాడు. అనంతరం టికెట్ల బుకింగ్‌ కోసం ట్రావెల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. 2007లో తిరిగి వచ్చి చౌటుప్పల్‌లో శంకర్‌ ఏజెన్సీ పేర టీవీ షోరూం ఏర్పాటు చేశాడు. దానిద్వారా వచ్చిన
ఆదాయంలో 75శాతం అనాధల సేవకు వెచ్చిస్తున్నాడు.

చిన్ననాటి ఆశయ సాధనకు..
రోడ్లపై తిరిగే మతిభ్రమించిన వారిని చూడగానే అతని మనస్సు చలించిపోయేది. వారి కోసం ఏదో చేయాలనే చిన్ననాటి ఆశయం అతని మదిలో మెదలాడుతూనే ఉంది. చేతిలో కొద్దిపాటి డబ్బు ఉంది కదా అని చిన్న ఆలోచన చేశాడు. వలిగొండ రోడ్డులో బాలాజీ దేవాలయం పక్కన ఎందుకూ వాడని షెడ్డు ఉంది.

దానిలో ఐదారు గదులున్నాయి. వెంటనే ఆ షెడ్డు యజమాని చంద్రశేఖర్‌ను కలిసి, తన ఆశయాన్ని, ఆలోచనను వివరించాడు. దీంతో షెడ్డు యజమాని దానిని ఏడాది పాటు ఉచితంగా ఉపయోగించుకునేందుకు హామీ ఇచ్చాడు. దీంతో 2010 ఫిబ్రవరి ఒకటిన ఆ షెడ్డులో అమ్మా..నాన్న అనాధ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆశ్రమ నిర్వహణకు 10 మందిని నియమించాడు.

రోడ్లపై తిరిగే వాళ్లను తీసుకొచ్చి..
రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వాళ్లను చేరదీస్తూ, ఆశ్రమం వద్దకు తీసుకెళ్తున్నారు. మాసిన బట్టలు, పెరిగిన క్షవరాలు, దుర్వాసన వెదజల్లుతున్నా తడుముకోకుండా వారికి సపర్యలు చేస్తున్నారు సంస్థ నిర్వాహకులు.

వారికి క్షవరాలు చేయించి, ప్రతి రోజూ ఉతికిన బట్టలు వేస్తున్నారు. ప్రతిరోజు స్నానం, మూడు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. గడిచిన 20 రోజుల కాలంలో ఈ మతిస్థిమితం లేని వారి జీవితాల్లో మార్పు కన్పిస్తుందంటే అతిశయోక్తి లేదు. పిల్లలున్నా చూడని తల్లిదండ్రులు, ఏ దిక్కూ లేని వృద్ధులు అందరూ కలిసి దాదాపు 20 మంది ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఉన్నారు.సాక్షి 26.2.2010

Sunday, February 21, 2010

విచ్చల విడిగా ఖర్చు చేయడమేనా జీవిత పరమార్థం?

ఆస్ట్రియాలో అభినవ బుద్ధుడు
కోరికలు దుఃఖానికి హే తువని గౌతమ బుద్ధుడు ప్రవచిస్తే, సంపదలే విషాదానికి కారణమని ఎలుగెత్తి చాటుతున్నాడు అభినవ బుద్ధుడు!
ఆస్తిపాస్తులన్నీ పేదల ఉద్ధరణకే అర్పించి సామాన్యునిలా జీవిస్తున్న కుబేరుడు
గాంధీజీ 'ధర్మకర్తృత్వ' సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన ఏకైక వ్యక్తి

లండన్‌: కోరికలు దుఃఖానికి హే తువని గౌతమ బుద్ధుడు ప్రవచిస్తే, సంపదలే విషాదానికి కారణమని ఎలుగెత్తి చాటుతున్నాడు అభినవ బుద్ధుడు! నాటి గౌతముడు రాజభోగాలను త్యజించినట్టే, నేటి కార్ల్‌ రాబేదర్‌ సంపదలన్నీ పేదలకే అర్పించి, కుటీరంలో తలదాచుకుంటున్నాడు. 'డబ్బు ఆనందానికి అడ్డంకి. అన్నీ పోవాల్సిందే....అన్నీ....అన్నీ' అంటూ, సర్వం పేదలకు అర్పించేసాడు, ఆస్ట్రియా సంపన్నుడు
రాబేదర్‌. ఆల్ప్స్‌ పర్వతాల్లోని అత్యంత విలాసవంతమైన అద్భుత హర్మ్యాన్ని, సువిశాలమైన సుందరమైన ఫార్మ్‌ హౌస్‌ని, అధునాతన మైన ఆడి ఏ-8 కారును అమ్మకానికి పెట్టేసాడు. ఇంటీరియర్‌ డెకరేషన్లు, ఫర్నిచర్‌, ఫ్లవర్‌వాజ్‌లు, వాటిలోని కృత్రిమ పుష్పాలను సైతం అమ్మేశాడు. గ్లైడింగ్‌ అంటే మహా ఇష్టమైనా, గ్లైడర్‌లను కూడా ఉంచుకోలేదు. అన్నీ వదిలాక, 'అమ్మయ్య ఇప్పటికి నా గుండె
బరువు తీరింది' అని సంతృప్తి వ్యక్తం చేశాడు!

ఫైవ్‌స్టార్‌ హోటల్లో జ్ఞానోదయం
ఇన్స్‌బ్రక్‌ కొండలలో అడవుల మధ్యన ఓ చిన్న కుటీరంలోనో, లేక ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ గదిలోనో శేష జీవితాన్ని గడిపేయాలని కోరుకుంటున్న రాబేదర్‌, జీవితమంటే విరక్తి కలిగిన వృద్ధుడూ కాడు, ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలనీ కోరుకోవడమూ లేదు. అర్థవంతమైన, నిజమైన జీవితం కోసం తపిస్తున్నాడు. సంపాదనకోసం పరుగులు తీస్తూ, విచ్చలవిడి గా ఖర్చుచేస్తూ నలభై ఏడేళ్లకే విసిగి
వేసారి పోయాడు. అలా అని రాబేదర్‌, బుద్ధునిలా ఆగర్భ శ్రీమంతుడు కాడు. పేదరికంలో పుట్టి, శ్రమించి పైకొచ్చిన వాడు. వస్తు వినియోగ వ్యసనానికి బానిసగామారి, విచ్చల విడిగా ఖర్చు చేయడమేనా జీవిత పరమార్థం? అనే ప్రశ్న నీడై వెన్నాడగా 'సిద్ధార్థుడ'య్యాడు. అది కూడా... విందు విలాసాల్లో మునిగి తేలుతుండగా!

కులాసాగా గడపడంకోసం హవాయి దీవులకు వెళ్లిన రాబేదర్‌, మూడు వారాల్లో ఎంత డబ్బు తగలేయడానికి వీలవుతుందో అంతా తగలేశాడు. అంతలోనే.... తన చుట్టూ ఉన్న అతి«థులు, నౌకర్లూ చాకర్లూ, అందరూ... తాను కూడా, అంతా నటులమేనని, నిజం మనుషులం కామని తోచింది. నటనతో నిండిన ఆ జీవితానికి అర్థమే లేదని అనిపించింది. రాబేదర్‌, అంతకు ముందు దక్షిణ, మధ్య అమెరికా దేశాలలోని పేదరికాన్ని, దైన్యాన్ని చూసి
కలత చెందాడు. అదంతా ఇప్పుడు, ఆ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తిరిగి కళ్ల ముందు మెదలాడింది. ఇబ్బందిగా ఫీలై.. ఫీలై...చివరికి విషాదమూర్తి అయ్యాడు. రాబేదర్‌, కార్ల్‌ మార్క్స్‌ను చదువుకున్నాడో లేదో తెలీదు. తన సంపదలకు, అక్కడి పేదరికానికి ఏదో సంబంధం ఉందని అనిపించసాగింది. అంతే, సర్వ సంపదల పరిత్యాగానికి సిద్ధమయ్యాడు.

నిజమైన గాంధేయవాది
ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేశాడు. తన సర్వస్వాన్ని, (23 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను) ఆ సంస్థ పరం చేశాడు. అది, లాభాపేక్షలేని ఒక మైక్రోఫైనాన్స్‌ సంస్థను నడుపుతోంది. ఎల్‌సాల్వడార్‌, హాండ్యురాస్‌, బొలీవియా, పెరు, అర్జెంటినా, చిలీ దేశాలలో పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి కృషి చేస్తుంది. స్వయం ఉపాధి పథకాలను చేపడుతుంది. రాబేదర్‌, ఆ సంస్థలో జీతం భత్యంలేని
ఉద్యోగి! 'సంపన్నులు, ప్రజల ఆస్తులకు ధర్మకర్తలు మాత్ర మే' అన్న గాంధీజీ సూక్తిని ఆచరించిన వారు బహుశా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.....ఒక్క రాబేదర్‌ తప్ప. 'ది డైలీ టెలిగ్రాఫ్‌'తో మాట్లాడుతూ రాబేదర్‌ అన్న మాటలు, ఈ అభినవ బుద్ధుని వ్యక్తిత్వానికి అద్దం పడతాయి....'ఎవరికైనాగాని సందేశాన్ని ఇచ్చే హక్కు నాకు లేదు. ఏదో నా అంతరాత్మ ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను
అంతే!

ఈదేశానికి పట్టిన చీడ కులం

అగ్ర కుల ముస్లింల రిజర్వేషన్లని వ్యతిరేకించండి
అగ్ర కుల ముస్లింలు కూడా దళితులనీ, బి.సి.లనీ చిన్న చూపు చూస్తున్నారు కదా. మరి అగ్ర కుల ముస్లింలకి కూడా రిజర్వేషన్లు ఇస్తామంటుంటే మీ దూదేకులవాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? ముస్లింలలో కూడా కులతత్వం ఉందన్న నిజాన్ని ప్రభుత్వం, ఎం.ఐ.ఎం. కావాలని మరచిపోతున్నాయి.


ఈదేశానికి పట్టిన చీడ కులం.మీ దూదేకులవాళ్ళు అనకు.వచ్చేజన్మలో నేను మీకులంలో పుట్టొచ్చు.దౌర్భాగ్యం ఏంటంటే భారతీయుడు ఏ మతంలోకి వెళ్ళినా కులం ఉంటున్నది.భారతీయ క్రైస్తవుల్లో,ముస్లిముల్లో కూడా కులాలున్నాయి.అగ్ర కుల ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వలేదు.షేక్ ల రూపంలో దొంగదారిన రిజర్వేషన్ పొందుతున్నారు.పేదరికమే ఈ కక్కుర్తికి కారణం.రిజర్వేషన్ ఇచ్చిన 14 కులాలూ
నికృష్టంగానే ఉన్నాయి.

అసలు దూదేకుల వాళ్ళ మాట ఎక్కడ చెలామణి అవుతుంది?ఈరాష్ట్రంలో దూదేకుల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.బి.సి.ఇ గ్రూపులో దూదేకుల కులస్తులను కలపలేదు.వాళ్ళు బి గ్రూపులో ఉన్నారుగా అని వదిలేశారు.అధికారులు కూడా కొన్నిప్రాంతా ల్లో మతం హిందూ అనీ, కులం దూదేకుల అని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇస్లాం-దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. మసీదుకు వెళ్ళము అని అఫిడవిట్ దాఖలు
చెయ్యాలని ఆంక్షలు పెడుతున్నారు. తల్లిదండ్రులు దూదేకుల వృత్తి చేస్తుంటేనే బీసీ సర్టిఫికెట్‌ ఇస్తామని చెబుతున్నారు.రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ విన్నివించింది .అంటే దూదేకుల వారిని ముస్లిములు దళితులుగా భావిస్తున్నట్లేగా?

ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.ముషేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు.వీళ్ళే అగ్ర కుల ముస్లింలు.రోళ్లకు కక్కు కొట్టేవారు,పకీరుసాయిబులు,గారడీ సాయిబులు , పాముల వాళ్లు,అచ్చుకట్లవాండ్లు,అత్తరు సాయిబులు లాంటి వాళ్ళకుకూడా రిజర్వేషన్లు ఇవ్వరా?మతమో మశానమో దళితులకంటే హీనంగా ఉన్న ఈ
మన భారతీయ సోదరులకు మానవహక్కులు అందేదెలా?

Monday, January 25, 2010

e-హదీసులను కూడా వెలువరిస్తారని ఆశిస్తున్నాను

 

 తెలుగుజాతి ఇంగ్లీషు, హిందీ, తదితర జాతులతో సమంగా తలెత్తుకొని తిరిగే వాతావరణం రాష్ట్రంలో కలగాలి. ఎవరి భాషను వారు గౌరవించటం, వారి భాషకు సర్వాధికారాలు కలగాలని కోరుకోవటం తప్పు కాదు కదా? తెలుగుకు రెండవ జాతీయ అధికారభాష హోదా, ప్రాచీన భాష హోదా కల్పించాలని కోరుతుంటే.....గొంతెమ్మ కోర్కెలు మానుకోమనీ, ఉట్టికెక్కలేనమ్మ న్వర్గానికి ఎలా ఎక్కుతుందనీ, ఇంట గెలచి రచ్చ గెలవమనీ,
అత్యాశ పనికి రాదని.....కొందరు తెలుగు పెద్దలే నాకు చెప్పారు. కాని వారికికూడా అంతరంగంలో వారి మాతృభాష ఉట్టికెక్కాలని,ఇంట గెలవాలని,రచ్చలో కూడా గెలవాలనే ఉంది. ఎంతైనా వారూ తెలుగు బిడ్డలే కదా! కాకపోతే ప్రన్తుత పరిస్థితిని చూని ఇవి తీరే కోర్కెలు కావని నిరాశ.ఎప్పటికైనా ఈ కోర్కెలు తీరాలనీ, తెలుగు బ్రతకాలనీ, తెలుగు ఏలాలని, తెలుగుకు సరైన న్యాయం జరగాలనీ నా ఆశ. నేను
ఆశావాదిని.
ప్రజల భాషకు పట్టం కట్టడం ఏనాటికైనా తప్పదు.
''మద్రాను లేని తెలుగు రాష్రం తలలేని మొండెం లాంటిది అని అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతగానో వాపోయారు. తెలుగు విద్వాంనులు నంగీత సాహిత్య రంగాలలోనే గాక ఇతర రంగాలన్నింటిలో ఆనాటికే చెన్నైలో చేసిన అభివృద్ధిని మనం వదులుకున్నాం. బళ్ళారి, బరంపురం లాంటి తెలుగు ప్రాంతాలు కూడా కోల్పోయాం. ఆంధ్ర రాష్రం ఏర్పడిన మరునాడే తెలుగు అనెంబ్లీ తరలి పోవాలని, తెలుగువారి రాజధాని
మద్రాసులో ఉండటానికి ఒక్కరోజు కూడా ఆతిద్యం ఇవ్వటం కుదరదని సి. రాజగోపాలాచారి తెగేసి చెప్పాడట. దాంతో తెలుగు నాయకులు కర్నూలుకు వెళ్ళారు. మళ్ళీ అక్కడ్నుంచి హైదరాబాదుకు వెళ్ళారు. ఇలా నిరంతరం వలసలు వెళ్ళే శరణార్థులకు ఆశ్రయ మిచ్చేవారి భాషే వస్తుంది కాని, వారి సొంత భాష వికసించదు. ఏ భాషవారికైతే అత్యధిక నంఖ్యాకులు వారి భాషనే మాట్లాడే సుస్థిర రాజధాని నగరం ఉంటుందో,
వారి భాష కూడా నులభంగా రాజ్యమేలుతుంది. రెండు మూడు భాషలవారు అధికార యంత్రాంగంలో ఉన్నపుడు ఒకరి భాష ఒకరికి అర్థంగాక, ఎవరి భాష పెత్తనం కోనం వారు పెనుగులాడుతుంటే, ఇద్దరినీ మర్ధించే మూడో భాష పెత్తనం చెలాయిన్తుంది.
''భాషను ఆధునిక శాన్త్ర సాంకేతిక పదాలతో పరిపుష్ఠం చేసినపుడే ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయి అన్నారు రాష్రపతి అబ్దుల్ కలాం. మన భాషా పాటవంతో చదివినవారికి ఉపాధి రంగంలో రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించినా ఎంతోమంది తెలుగు భాషలోనే శాన్త్ర సాంకేతిక విద్యలు చదవటానికి తరలి వస్తారు. కోటి విద్యలు కూటి కొరకే కదా!---(తెలుగు అధికార భాషకావాలంటే) పుస్తకంలో నా ముందుమాట.
ఖురాన్ సహా అనేక ఇతర ఇస్లామిక్ పుస్తకాలను నెట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంచిన TIP పెద్దలకు కృతజ్నతలు.e-హదీసులను కూడా త్వరలో వెలువరిస్తారని ఆశిస్తున్నాను.


TIP వంటి అనేక తెలుగు వెబ్సైట్ల అవసరం ఉన్నది.


www.islamhouse.com  తెలుగు విభాగంలో

కూడా అమూల్యమైన అనేక తెలుగు పుస్తకాలు, వ్యాసాలు, దివ్యగ్రంథాల అనువాదాలు ఉన్నాయి. వీటిని ఉచితంగా చదువుకోవచ్చును, డౌన్ లోడు చేసుకోవచ్చును. మీరు చెప్పినట్లు వేరే నగరాలలో మన రాజధాని ఉండటమనేది తెలుగు భాష ఎదుగుదలకు ఒక అవరోధంగా నిరూపితమైనది. మనకు ఎదురైన ఈ రెండు చేదు అనుభవాల (మద్రాసు, హైదురాబాదు రాజధానుల నుండి ఖాళీ చేయవలసి రావటం) ద్వారానైనా మనం గుణపాఠం నేర్చుకోవలసి ఉన్నది.



రెండో పాప / బాబును దత్తత తీసుకోండి

 

రెండో పాప / బాబును దత్తత తీసుకోండి

చాలా ఏళ్ల కిందట ఒక మిత్రుడు చెప్పాడు ఈ కాన్సెప్ట్ ను. మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, రెండో పాప బాబు కావాలనుకున్నపుడు ఒక అనాధను దత్తత తీసుకోవాలి అని చెప్పాడు. దీనివల్ల ఒకరికి పూర్తి స్థాయి జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు. జనాభా సమస్య అరికట్టడానికి వ్యక్తిగత స్థాయిలో కృషి చేసినట్లు అవుతుంది. ఒక అనాథకు జీవితం ఇవ్వడం అంటే వారు ఒక జీవితానికి సరిపడా సేవ
చేసినట్లే అని నా భావన.

అలాగే పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం ఖర్చు పెట్టుకునే బదులు దత్తత తీసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఈ వైద్యం చేయించుకునే క్రమంలో ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి మరోరకమైన హింస. వర్తమానాన్ని ఆనందించడం మాని చాలామంది భవిష్యత్తు కోసం బాధ పడుతుంటారు. విసిగివేసారిన దంపతులకు ఆ పాప / బాబు రాక అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించాలి.
సమాజం, బంధువులు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ మొదట వదిలేయాలి. మనం జీవిస్తోంది మనకోసం. మనం ఎవ్వరికీ హాని చేయడం లేదు.

ఏమి చేసినా ఎన్ని సాధించినా మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.

పిల్లలు లేని రెండు జంటలకు నేను ఈ విధమైన చైతన్యం కల్పించగలిగాను. రెండో జంటతో ఈ రోజు నేను స్వయంగా అప్లికేషన్ వేయిస్తున్నాను.

వీరికంటే ముందు నేను ఆచరించాను. మా పాప చాలా చాలా యాక్టివ్. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నాం.

మీ పరిధిలో పిల్లలు లేని దంపతులకు ఈ రకమైన చైతన్యం కల్పించండి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే హైదరాబాద్ లోని శిశువిహార్ కార్యాలయంలో ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలు తీసుకోవడానికి మన వంతు రావాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అప్పటికప్పుడు అని కాకుండా ఒక దరఖాస్తు వేసి, ఈ లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు
పరచుకోవచ్చు.

ఏకాభిప్రాయం కుదురుతుందా?

 

సమైక్యాంధ్రుల వాదనలు

* పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా
వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.ఇటు తెలంగాణ, అటు జైఆంధ్ర ఉద్యమం నడుస్తున్న
సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు గట్టిగా కట్టుబడి ఉన్నానని ఇందిరాగాంధీ 21.12.1972న పార్లమెంటులో ప్రకటించారు.చారిత్రకంగా సుదీర్ఘకాలం పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు ఒకే ఛత్రం కింద ఉన్నాయి.తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్దాలు పోరాడారు.భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత
ఉంది.ప్రాంతాల సెంటిమెంట్‌తో కొట్టుకుపోకూడదు.దేశంలో వెనకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేదీ లేదు. తెలంగాణలో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి.ఇలాంటి విభజన కొనసాగిస్తే, విభజన రేఖ ఎక్కడ గీయగలం. ఒక్కో జిల్లా, ఒక్కో రాష్ట్రం కావాలని కోరుకుంటే? మనం పురాతన కాలం నాటి చిన్న చిన్నసంస్థానాధీశులుండే కాలానికి
వెళ్తామా?ప్రత్యేకవాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేకవాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తవచ్చు.తెలంగాణ డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఏకాభిప్రాయం లేదు. తెలంగాణ ప్రాంతం రాజధానికి దూరంగా లేదు. అసలు రాజధానే తెలంగాణ ప్రాంతంలో ఉంది.అసెంబ్లీలో తెలంగాణపై
తీర్మానం ఆమోదం పొందలేదు.సమైక్య ఆంధ్ర ద్వారానే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. తెలంగాణ రాష్ట్రం అయితే మావోయిస్టుల కేంద్రంగా మారుతుంది. చిన్న రాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి. సమైక్యాంధ్ర కొనసాగాలని ఉద్యమించడం ఆంధ్రుల విశాల హృదయాలకు నిదర్శనం.ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అధికశాతం నిధులు కేటాయించింది.కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల వారు తప్ప తెలంగాణలో
మిగతా జిల్లాల వారు సమైక్యాంధ్రగానే ఉండాలని కోరుకుంటున్నారు.రాష్ట్రాన్ని విభజిస్తే సహించేదిలేదు.తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు.కుటుంబాలను విడదీయొద్దు.ఎన్నో ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్ర, సీమ ప్రజలు ఒకరింట్లో ఒకరు వియ్యమొందారు. ఇప్పుడు విభజన చిచ్చుతో ఆ కుటుంబాలను విడదీస్తున్నారు.తెలంగాణ ఉద్యమం నడిపినా ఏ నేతా గెలవలేదు?సీమాంధ్ర
ప్రాంతంలో జరిగిన ఉద్యమం పేదలు, సామాన్యుల నుంచి పుట్టుకొచ్చింది.మేం ఇక్కడ సంపాదించిందంతా తెలంగాణలో పెట్టి అక్కడ ప్రజల అభివృద్ధికి పాటుపడితే ఇప్పుడు సాగర్‌ వద్ద అడ్డుగోడలు కడతారా?అడ్డుగోలుగా మాట్లాడినా, అడ్డుగోడలు కట్టినా అడ్డంగా తిరగబడతాం.యాసకో రాష్ట్రం ఇస్తారా: తెలుగు వారంతా ఒక్కటేనని అంటుంటే మా భాష, యాస వేరంటారేంటి?హైదరాబాద్‌ కోసం చేసిన శ్రమ అంతా
దెబ్బ తింటోంది.హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భూముల విలువలు విపరీతంగా పెరిగి రైతులు లాభపడ్డారు.ఈ కృషి అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది.కొద్దిమంది కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం సరైందని కాదు.విభజన
తప్పనప్పుడు రెండే ఎందుకు, నాలుగు రాష్ట్రాలుగా చేస్తే తప్పేమిటి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించాలి, దానికి పారామీటర్స్‌ ఏమిటి?ప్రజల సెంటిమెంట్‌ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని అంటే బోడోల్యాండ్‌, గూర్ఖాల్యాండ్‌ వంటివి చాలా అంశాలున్నాయి.పోనీ వెనుకబాటుతనం ప్రాతిపదికన అనుకున్నా.. ప్రతిచోటా పేద, ధనిక వర్గం ఉంది. కేవలం అభివృద్ధి, సెంటిమెంట్ల ఆధారంగానే
రాష్ట్ర విభజన జరపాలంటే, దేశాన్ని చాలా ముక్కలు చేయాల్సి ఉంటుంది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి తేడాలతో సంస్కృతి, అలవాట్లు, భాష ఒకే విధంగా ఉన్నాయి.

తెలంగాణా వాదుల వాదనలు

* ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు
ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే.స్థానికేతరులకు భయం వద్దు.తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది.తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు అక్కడ పాగా వేస్తారనీ, సాగునీటి
కోసం ఆంధ్ర ప్రాంతం అల్లాడిపోతుందనీ జరుగుతున్న ప్రచారం వాస్తవరహితం.ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక.ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది. స్వాభిమానానికి సంబంధించినది. ఉనికి, వివక్ష, దోపిడీలతో ముడిపడింది.రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో
తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు. ఇలాంటి విషయాల్లో ఏకాభిప్రాయం ఎన్నడూ కుదరదు.స్వార్థపరశక్తులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెచ్చాయి.వాస్తవంగా ప్రజల్లో ఆందోళన లేదు. ఉన్నా పరిష్కరించుకోవచ్చు. నష్టపోతున్నవారే లేనిపోని ప్రచారం చేస్తున్నారు. దోచుకోవడం కుదరదన్న ఉద్దేశంతోనే భయాందోళనలు కలిగిస్తున్నారు. తెలంగాణాలో స్థిరనివాసం ఉంటున్న వారి
విషయంలో కొన్ని సందేహాలుంటాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.తెలంగాణాలో స్థిరపడిన ప్రజలకు ఎలాంటి హానీ జరగదు. పెట్టుబడిదారుల ఆస్తులే గానీ ప్రజల ఆస్తులు చర్చనీయాంశం కాదు. ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇది రాష్ట్ర విభజన మాత్రమేనని అందరూ గుర్తించాలి. తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని
అనుకోవడం సరికాదు.ఎవరికి ఎన్ని నీళ్లో.. చెప్పేందుకు ట్రైబ్యునళ్లు ఉన్నపుడు భయపడాల్సింది లేదు.రాజకీయ, భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే. అది తెలంగాణా రాజధానిగా ఉండాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోవడం ఉత్తమం. తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్రతో బలవంతంగా కలిపారు.విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై
ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది.ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.బడ్జెట్‌ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం.సహజవనరులు, నీళ్లు లేక తెలంగాణాలో ఆత్మహత్యలు జరిగాయి.చిన్న
రాష్ట్రాలు ఏర్పడ్డాక జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌లలో పరిపాలన యంత్రాంగం బలోపేతమైంది.ఆంధ్ర, తెలంగాణా విడిపోయాక రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి, దానికి తగ్గ వనరులు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నాయి.

ప్రత్యేకాంధ్రుల వాదనలు

* విభజన వలన కాక, కలిసి ఉండటం వల్లనే ఆంధ్ర ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలరు?కోస్తా, సీమ ప్రాంతాల అభివృద్ధి కన్నా, హైదరాబాద్‌లో సొంత ఆస్తుల పరిరక్షణకే 'సమైక్యవాదం' చేపట్టారు.సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌గా ఉండాలి.సీమ, కోస్తాల్లోని వెనకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు.తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగితే
సమైక్య రాష్ట్రాన్ని ఎలా సమర్థిస్తారు?610 జీవో వల్ల ఆంధ్రా ప్రాంతం వారికి జరుగుతున్న నష్టాల గురించి ఏనాడైనా స్పందించారా? సామాన్యుడి అవస్థల కన్నా హైదరాబాద్‌లో మీ ఆస్తులు రక్షణకే సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్నారు. హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధిని గురించి ఎన్నడైనా ఆలోచించారా? సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమనుకుంటే
ఇంతవరకు ఇతర నగరాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? రెండు లేదా మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా? 42 మంది ఎంపీలు ఉన్న మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సాధించింది ఏమిటి ? తక్కువ ఎంపీలున్న చిన్న రాష్ట్రాలు సాధించలేనిది ఏమిటి?హైదరాబాద్‌ చుట్టూ కేంద్రీకృతమైన తమ ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు సమైక్య వాదం
పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారు.విడిపోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుంది.భాగో అనిపించుకునే ఖర్మ మనకెందుకు?ఆత్మాభిమానం నిలుపుకునే విడిపోదాం.హైద్రాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి.1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావ సమైక్యత లేదు. తెలంగాణ ఉద్యమం నిన్నా ఉంది.. నేడూ ఉంది... రేపూ ఉంటుంది. వాళ్లు మమ్మల్ని
వెళ్లిపొమ్మని అంటున్నప్పుడు... ఆత్మాభిమానం ఉన్న మాకు పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ నగరాన్ని అందరం కలిసి అభివృద్ధి చేశాం కాబట్టి దీనిని వదిలిపెట్టడం ఎలాగ?ఈ రాజధాని నాది అనుకుని ఆ ప్రాంతాల్లోని ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక్కరైనా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. నగర అభివృద్ధిలో మేమూ భాగస్వాములమే... దీన్ని పెంచాం..
హైదరాబాద్‌ మనది అనుకున్నారు. 1972 నాటికి హైదరాబాద్‌పై ఇంత మమకారం లేదు. ఇవాళ ఎంతో చేశాక... నగరంతో మమేకం అయ్యాక వెళ్లిపోవాలంటే బాధగా ఉంటుంది కదా... ఆ రోజు ముల్కీ నిబంధన కారణంగా వెళ్లిపోతామన్నారు... ఇప్పుడు ఇంతకాలం ఇక్కడే ఉన్నందున కలిసే ఉందామంటున్నారు.విభజన జరిగినంత మాత్రాన ఇక్కడున్న 30 లక్షల మంది వెళ్లిపోవలసిన అవసరం లేదు. ఇక్కడున్న వారంతా తెలంగాణవారే అవుతారు.
వాళ్లు, వీరూ మమేకమై జీవితాలు గడుపుతారు.మనం ఇక్కడి నుంచి ఆత్మాభిమానంతో వెళ్లిపోతే ఏ సమస్యా ఉండదు. తెలంగాణ ప్రజలంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కాదు.. కలిసే ఉందామనడం సమంజసం కాదు.హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, ప్రత్యేకాంధ్రకు తగిన నిధులు తెచ్చుకుని ఆత్మగౌరవం కోసం మనం విడిపోదాం జై ఆంధ్రా.

ఐఏఎస్‌ ఐపిఎస్‌ల భయం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారందరిలో ఎక్కువ శాతం కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్ర రాష్ట్రా సర్వీసుల్లోకి వెళ్ళాలి.ఒక వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లయితే కేంద్ర సర్వీ సులకు చెందిన అధికారులను మూడుగా విభజిస్తారు.హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించినట్లయితే గ్రేటర్‌
హైదరాబాద్‌ పరిధి లోకి వచ్చేందుకు కేంద్ర సర్వీసు అధికారులు విముఖత చూపుతున్నారు. ఎందుకంటే యూనియన్‌ టెరిటరీ కేడర్‌లోకి వచ్చినట్లయితే ఇకపై వారి బదిలీలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమవుతాయి. దీని వల్ల హైదరాబాద్‌ యూనియన్‌ టెరిటరీ(కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి వేరొక చోటకు బదిలీ కావాలంటే మరొక కేంద్ర పాలిత ప్రాంతానికే బదిలీ కావా ల్సి ఉంటుంది.
తెలుగు సినీ పరిశ్రమ భయం

మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలివచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రామకృష్ణ సినీ స్టుడియో, అన్నపూర్ణ సినీ స్టుడియో, రామానాయుడు స్టుడియో, పద్మాలయా స్టుడియో, రామోజీ ఫిలింసిటీ స్టుడియోలు నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. పద్మాలయా స్టుడియో లోని కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించిన వ్యవహారం పై టిఆర్‌ఎస్‌
కోర్టుకెళ్ళింది. తమ ప్రాంతంలో పేదలకు పంపిణీ చేయవలసిన భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన సినీవర్గాలకు ఇచ్చారన్న వివాదం మొదలయింది.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు

 

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad.nic.in/
1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur.nic.in/
1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor.nic.in/
1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari.nic.in/
1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur.nic.in/
1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad.nic.in/
1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa.nic.in/
1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar.nic.in/
1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam.nic.in/
1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna.nic.in/
1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool.nic.in/
1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar.nic.in/
1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak.nic.in/
1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda.nic.in/
1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore.nic.in/
1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad.nic.in/
1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam.nic.in/
1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy.nic.in/
1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam.nic.in/
1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatnam.nic.in/
1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram.nic.in/
1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal.nic.in/
1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari.nic.in/
విశేషాలు

* అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,

స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

The translation of the word NEW in telugu

 

New :
కొత్తగా. New born కొత్తగా పుట్టిన.
Newfangled :
కొత్తగా కల్పించిన, నూతన సృష్టియైన, లోకములో లేని,విపరీతమైన, వింతైన, చోద్యముగా వుండే, యిది తిరస్కార ద్యోతకమైన శబ్దము. Newfangled expressions యెన్నడు వినని కనని మాటలు. he has built his house in a Newfangled style లోకములో లేని తరహగా యిల్లు కట్టించినాడు.
Newfangleness :
విపరీతము, లోకములో లేని వింత, చోద్యము.
New-gate :
లండన్ పట్టణములో వుండే వొక పేట, ఆ పేటలో వుండే పెద్ద చెరసాలయున్ను, దీని దగ్గెర తూకు వేస్తారు. a New-gate attorney దొంగల గురువు.
Newly :
కొత్తగా, నవీనముగా, అపూర్వముగా.
Newness :
కొత్త రకము, నవీనత, అపూర్వము. from the Newness of the house ఆ యిల్లు కొత్తది గనుక.
News :
సమాచారము, వర్తమానము.
Newsmonger :
పనికి మాలిన సమాచారములు చెప్పుతూ తిరిగేవాడు, విచారించేవాడున్ను
Newt :

జలగోధిక, నీరుడుము.
డిక్షనరీ లో ఉన్న అర్ధాలివి.

కంప్యూటర్లో తెలుగు రాయడం

 

1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __
3.అనూ ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా?

http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe .. ఇక్కడినుండి ''iComplex_2.0.0.exe''' ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి ఫాంటు ఉంటుంది.వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.

Win98 --http://etelugu.org/node/207
Win2000 --http://etelugu.org/node/208
Linux --http://etelugu.org/node/210

కంప్యూటర్లో తెలుగు రాయడం
లేఖిని --http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#
స్వేచ్ఛ – http://swecha.org/input/index.html, http://atcweb.atc.tcs.co.in/opensource-downloads
యంత్రం --http://www.yanthram.com/te/
లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
ఇన్ స్కిప్ట్ -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
బరహా -- http://www.baraha.com/download.htm
అను మాడ్యూలర్ -- http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-other-keyboard-layouts/
అను ఆపిల్ -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
అక్షరమాల -- http://groups.google.com/group/aksharamala
జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input
అక్షర్ ---http://www.kamban.com.au/
TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx

Microsoft -Indian language input tool--ఇటీవలే విడుదల అయ్యింది.నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు.
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
• ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
• పద్మ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
• తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
• ప్రముఖ్ టైప్ --http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx
సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి :http://uni.medhas.org/
ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:

ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html
4. itrans --http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).

http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store

వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:

మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm

లిపులు –లిప్యంతరీకరణ.
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. Akshar Unicode, Code2000 , Gautami, Pothana , RaghuTelugu , Saraswati5, Vemana2000.http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
RTS ,Unicode , ISCII , ITRANS , TSCII , TAB & TAM, ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు, శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు . కానీ ఇప్పుడు యూనీకోడ్ ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల
సామర్థ్యానికి ఎదిగింది. http://padma.mozdev.org/.
ఈమాట - Non-Unicode Font to Unicode Converter --
http://eemaata.com/font2unicode/index.php5
Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana లాంటి కొన్నిఅను ఫాంట్ల సమశ్య సురేష్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఇంకా సాక్షి(SW908.TTF), సూరి, కొత్త అను ఫాంట్లు,యూనికోడ్ లోకి మార్చాలి . ఫాంట్లపై పేటెంట్ రైట్లు గల వ్యాపార సంస్థలవారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే ,యూనికోడ్ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.
అనువాద ఉపకరణం
http://docs.google.com/support/bin/static.py?page=faq.html&hl=te
మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే,దీంతో పని తగ్గుతుంది. పైగా విదేశాల్లో, భాషరాని వారికి ఇది బాగా అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాల లో ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది.ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

ఇవికూడాచూడండిః
• ఈటీవీ2లో 20.5.2007న "తెలుగు-వెలుగు " కార్యక్రమం లో నా ఇంటర్ వ్యూ http://telugu.fliggo.com/video/GcLNlAgS
• తెలుగు భాష - చర్చా వేదిక వ్యాసం "ఇలా చేస్తే బాగుంటుంది "విపుల నవంబర్ 2007 http://eenadu.net/vipnew3/display.asp?url=vip-kathalu13.htm

నూర్ బాషా రహంతుల్లా డిప్యూటీ కలెక్టర్ విజయవాడ .

విజయవాడ వద్ద కృష్ణా నదిపై 5 ప్రతిపాదనలు

 
1.ప్రకాశం బ్యారేజి మూసివేసినందువల్ల ట్రాఫిక్ సమశ్య పెరిగింది.విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణా నదిపై ఉన్న పాత రైలు బ్రిడ్జిని ఊడదీశారు.తాడేపల్లి ఈమధ్య మునిసిపాలిటీ అయ్యింది.ఈ వంతెనను సైకిళ్ళు పాదచారుల కోసం రెండు మునిసిపాలిటీలు వుడా వారు కలిసి పునరుద్ధరిస్తే రెండుజిల్లాల మధ్య ట్రాఫిక్ సమస్య కొంతవరకైనా తగ్గుతుంది.
2.ప్రకాశం బ్యారేజి నుండి లీక్ అయ్యే నీరు వృధాగా పోతోంది.విజయవాడ-తాడేపల్లి మునిసిపాలిటీలు వుడా వారు కలిసి కనకదుర్గ వారధి వద్ద 1గజం ఎత్తున అడ్డుగోడ నిర్మిస్తే నీళ్ళు నిలబడి పర్యాటకులకు అహ్లాదకరంగా ఉంటుంది.భూగర్భజలాలలో ఉప్పు శాతం తగ్గి మంచి నీరు దొరుకుతుంది.నదీ గర్భంలో ఆక్రమణలు తగ్గుతాయి.భక్తుల పుణ్యస్నానాలకు మరింత చోటులభిస్తుంది.
3.ప్రకాశం బ్యారేజిపై నుండి ఆర్టీసీ మినీ బస్సులు నడిపించాలి.
4.కనకదుర్గ వారధి నుండి ప్రకాశం బ్యారేజివరకు కృష్ణానది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.
5.గ్రేటర్ విజయవాడలో కేవలం ౩కి.మీ దూరంలో గుంటూరుజిల్లాలో ఉన్నకృష్ణాకెనాల్ జంక్షన్, తాడేపల్లి మునిసిపాలిటీని కూడా కలిపి జంట నగరాలుగా అభివృద్ధి చెయ్యాలి.

Scriptures always advocate peace and tolerance but devotees always turn violent.

 
Activists belonging to Sankriti Bachao Manch and 'Akhil Bharatiya Vidhyarti Parishad (ABVP) protested the launch ceremony of Rishi Ajaydas's Hindi book titled 'Vivah - Ek Naitik Balatkar' (Marriage, a moral rape) as they found it an attempt to belittle the institution of marriage viewed highly in Indian culture.They claimed the contents of the book is an insult to marriage institution and an attack on Indian ethos.While manhandling the author Ajaydas, some activists tried to blacken his face, but police prevented them.
Speaking to ANI, Sanskriti Bachao Manch convener, Chandrashekhar Tiwari said: 'If someone tries to launch an attack on our culture then we can even take more severe action than this. This was just a trailer and if someone attacks our culture then obviously we will not tolerate it.'

Similar incidents happened with Salman rushdie's satanic verses and Taslima nasreen's Lajja.Authors should be very careful in writing such books.Scriptures always advocate peace and tolerance but devotees always turn violent.