welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Sunday, August 16, 2009

దయచేసి తినండి...పారేయకండి

దయచేసి తినండి...పారేయకండిఏటా రూ.58 వేల కోట్ల విలువైన ఆహారం వృథా.మన దేశంలో ముప్పై కోట్ల మందికి ఒకే ఒక కోరిక ఉంటుంది. రోజూ కడుపు నిండా తిండి తినాలని. అయితే మాకేంటి అనుకోకండి. వారందరికీ అన్నం పెట్టకున్నా ఫర్వాలేదు కానీ మీరు తిండిని మాత్రం వృథా చేయకండి.కడుపులో మంట... వికారం... నీరసం... తెలియని వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ. ఆకలి బాధతో అలమటిస్తున్న వారు మాత్రం మన దేశ జనాభాలో సుమారుగా ముప్పై కోట్ల మంది ఉన్నారు. రాజధానిలో వీరి సంఖ్య రెండు లక్షలకు పైనే. ఈ ఆకలి బాధ నుంచి బయట పడటానికి ఏంతో మంది కష్టపడుతుంటే మరికొందరు తప్పు దోవ పడుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిసినా శుభకార్యాల పేరిట పుట్టిన రోజు పేరిట, హోటళ్లలో మితిమీరి ఆర్డర్ చేయడం అలవాటైంది. దాన్ని పూర్తిగా తింటున్నారా అంటే అదీ లేదు. ఆహారం రుచిగా లేదని కొందరు, ఇష్టం లేదని మరికొందరు దాన్ని వృథా చేస్తున్నారు.

No comments: