welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Showing posts with label Facts. Show all posts
Showing posts with label Facts. Show all posts

Tuesday, July 26, 2011

అంధకార చారిత్రిక

 
"అరిగిన సబ్బు
తరిగిన మబ్బు
పెరిగిన గబ్బు
కావేవీ అవార్డులకు అనర్హం"
అనేవారేమో శ్రీశ్రీ!
"Graveyards are full of indispensable men" said Charles DeGaulle. కాదు, బతికినప్పుడు కుడా అన్నట్లు, ఉన్నప్పుడు చూపని గౌరవమంతా లేనప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం, వారికి ఫలానా అవార్డులివ్వకపోవడం గురించి మాట్లాడుకోవడం తెలుగువారి ప్రత్యేకతగా మారిపోతుందేమో అని చెడ్డ అనుమానం!

ఎవ్వరైనా ఏడిపించొచ్చు. నవ్వించడం, ఎవ్వరినీ నొప్పించకుండా నవ్వించడం, అదీ అక్షరాలతో సాధించడం నవ్వులాట కాదు. చతురోక్తులతో చిత్రోక్తులతో చిరునవ్వును సరసంగా గుబాళింపజేసిన ముళ్ళపూడివారి మాటలకు ఏ అవార్డులొచ్చినా రాకపోయినా నవ్వును మాత్రం రివార్డుగా ఇస్తూనే ఉంటాయి.

కథలో నవ్వించడం ఒక ఎత్తు. జీవితంలో నవ్వును గుర్తించడం ఇంకో ఎత్తు. క్లిష్ట సమయాల్లో సైతం sense of humor వీడకపోవడం చాలా మందికి అందనంత ఎత్తు. అంతటి ఎత్తులను కూడా పరికించి, గుర్తించి జరిగిన ఉదంతాలను మనసులనుండి జరిగిపోకుండా ఉండే రీతిగా వారు వ్రాసిన కొన్నిటిని పంచుకోవడం మాత్రమే.
[Source: ముళ్ళపూడూ గారి "హాస్యజ్యోతి" నుండి]
-------------------------------
* వేదాంతి, రసతపస్వి అయిన ముట్నూరి కృష్ణారావుగారు మరణ శయ్యపై ఉండగా, ఆయన భార్య పక్కనే కూచుని కంట తడి పెట్టింది. ఆ దశలో కూడా ఆయన చిరునవ్వుతో "అప్పుడే రిహార్సల్స్ మొదలు పెట్టావా" అన్నారట ఆమెతో.

* టైముకి రావడం శాస్త్రీయం, టైముకి రాకపోవడం కృష్ణశాస్త్రీయం- శ్రీశ్రీ

* ఒకసారి జ్వరపడి మంచంలోఉన్న దిగ్గిరాలవారిని పరామర్శించడానికి వెళ్ళారు దువ్వూరి సుబ్బమ్మగారు. ఆయనను పలకరించి "జ్వరం ఎక్కువగా ఉందా" అంటూ చెయ్యిపట్టికు చూడసాగింది.
"అసలే నేను జ్వరంతో బాధపడుతుంటే పైగా పాణిగ్రహణం కూడానా" అన్నారట ఆంధ్రరత్న చలోక్తిగా.

* కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రవిశ్వవిద్యాలం ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆంధ్రవిశ్వవిద్యాలయమే తన ప్రేయసీ అని చెప్పుకునేవారు. ఒక సభలో ఆయనను భీషుడు, హనుమంతుడు అంటూ కొందరు వక్తలు ప్రస్తుతించడం ప్రారంభించారు. తర్వాత రెడ్డిగారు అందుకొని "లేనిపోని ఉపమానాలని విశేషాణలను ఎందుకు దురివినియోగం చేస్తారు?" "అవివాహితుడు" అంటే
సరిపోతుంది" అన్నారు.

* శ్రీపాద వారు "స్మశాని వాటికి" రచనను ప్రాణం మీదికి వచ్చిన రోగిన చూడడానికి వెళ్తున్న డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారికి ఇచ్చారట. "శాస్త్రిగారూ మీకి బొత్తిగా లొక్యం లేదండీ" అన్నారటాయన.

* 1949 లో హైదరాబాదు నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వాం "పోలీసు చర్య" అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చూ ఏ పద్దుకింద చేర్చాలో ప్రభుత్వానికి అర్థం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భార్త రక్షణ శాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధంలేదని హోంశాఖ
తరస్కరించింది. పైగా అది క్రమశిఖణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ అందుకు నిరాకరించి "హైదరాబాదుపై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధినిర్మూలన పథకంలో భాగం కనుక ఖర్చు ఆయోగ్య శాఖపరణ్గా వ్రాయించ" మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యాశాఖ భరించింది."
---------
అంధకార చారిత్రిక సంఘటనలో సైతం హాస్యాన్ని వెతికి పట్టుకోవడం ముళ్ళపూడివారికే చెల్లు.
=======================================
విధేయుడు
-శ్రీనివాస్


Wednesday, March 31, 2010

స్వాములూ మనుషులే

 
స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

Sunday, October 18, 2009

పట్టుదల ముందు ఓడిన పేదరికం

పట్టుదల ముందు ఓడిన పేదరికం దుగ్గిరాల, న్యూస్‌టుడే దుగ్గిరాలకు చెందిన మళావత్ బాలనాగయ్యనాయక్ తండ్రి తారునాయక్ రిక్షా తొక్కుతూ భార్య, నలుగురు పిల్లల్ని పోషించాడు. పిల్లలు తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో వారిని చదివించాడు. ఇలా సాగుతున్న కుటుంబంపై విధి కాటు వేసింది. 2000 సంవత్సరం సెప్టెంబరులో మృత్యురూపంలో తండ్రి తారునాయక్‌ను కుటుంబం నుంచి విధి దూరం చేసింది.



దీంతో కుటుంబసభ్యులంతా దిక్కులేని వారయ్యారు. అంతటి దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని తల్లి ధ్వాలీబాయి కూలికి వెళ్ళసాగింది. రెక్కలు ముక్కలు చేసుకుంది. అయినా ఆ సంపాదన కుటుంబ పోషణకు సరిపోలేదు. ఈదశలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న బాలనాగయ్యనాయక్ ఇంటికి పెద్దకొడుకుగా పరిణితి చెందిన మనస్సుతో కర్తవ్యాన్ని గుర్తించాడు. కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు.

తండ్రి రిక్షాను అందుకున్నాడు. కళాశాల వదిలిపెట్టగానే ఇంటికి వచ్చేవాడు. రిక్షా లాగేవాడు. దుగ్గిరాల యార్డులో పనిచేశాడు. రైల్వేస్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికుల లగేజీని తీసుకెళ్ళేవాడు. బస్తాకు మూడు రూపాయలు చొప్పున రోజుకు రూ. 50 నుంచి రూ. 70 వరకూ వచ్చేవి. బిడ్డ పడుతున్న కష్టం బాధనిపించినా కుటుంబ పరిస్థితుల వల్ల ఆ తల్లి కాదనలేకపోయింది.

స్నేహితుని మార్గదర్శకం 2002లో డిగ్రీ పూర్తి చేసిన బాలయ్యనాయక్ 2002-03లో విజయవాడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ పండిట్ శిక్షణ పూర్తిచేశాడు. అప్పుడు కూడా ఇంటికి వచ్చి రిక్షా వృత్తి కొనసాగించాడు. 2003-04లో గణితం, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులుగా బి.ఇడి. చేశాడు. నాయక్ మాటల్లో చెప్పాలంటే అతని స్నేహితుడు కాకాని యలమందరావు ఒత్తిడి చేసి బి.ఇడి. ప్రవేశపరీక్ష రాయించాడు.

కష్టపడుతున్న స్నేహితుడికి యలమంద మార్గదర్శకుడయ్యాడు. అతని ప్రోత్సాహమే లేకపోతే తాను ఈనాడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని బాలునాయక్ అంటున్నారు. బి.ఇడి. పూర్తికాగానే ఏం చేద్దామని అన్పించింది. అప్పుడు స్నేహితుని మార్గదర్శకమే. ఎం.ఎస్.సి. చేయమని సలహా ఇచ్చాడు. డబ్బులు సరిపోతాయా? తన వల్ల అవుతుందా? ఇవన్నీ నాయక్ మదిలో మెదిలిన భావనలు. రిక్షా ఎక్కువ సేపు తొక్కుదాం అనుకున్నాడు. అంతే
దూరవిద్య ద్వారా 2004-06లో ఎం.ఎస్.సి. పట్టా అతని చేతిలోకి వచ్చింది. తాను ఎమ్మెస్సీ పూర్తి చేసి అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాలలోనే నాగయ్యనాయక్‌కు కూడా యలమందయ్య అధ్యాపకుని పోస్టు వచ్చేలా ప్రయత్నించాడు. నలంద కళాశాలలో ఒక సంవత్సరం పనిచేశాడు. విజయవాడలో ఉచితంగా గ్రూప్-2 శిక్షణ ఇస్తుంటే దానిలో చేరాడు. అక్కడ నేర్చుకున్న జనరల్ నాలెడ్జి తనకు డీఎస్సీలో ఉపయోగపడిందని నాయక్ చెప్పారు.


ఈదశలోనే స్నేహితుడితో కలిసి 2008లో డీఎస్సీకి సిద్ధమయ్యాడు. గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా ఎంపికయ్యాడు. నూజెండ్ల మండలం ములకలూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో పోస్టు పొందాడు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్న నాయక్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు వచ్చేలా కృషి చేస్తానంటున్నారు. తనను ఇంతటి వాడిని చేసిన తల్లికి, స్నేహితునికి, అక్కలు-బావలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొంటున్నారు.

ఆనందంగా ఉంది: తల్లి ధ్వాలీబాయి నా భర్త చనిపోయినప్పుడు ఇంట్లో పరిస్థితుల కొడుకు రిక్షా తొక్కుతానన్నా కాదనలేకపోయాను. ఇప్పుడు బిడ్డ ఉపాధ్యాయుడు అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి ఫలితం లభించింది.eenadu18.10.2009


Thursday, September 24, 2009

మనం ముస్లిములమా?హిందువులమా?

ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు.


ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వే

టపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం.


ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది?

ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు.రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.

Thursday, June 11, 2009

Election facts

1. In the 2004 elections the oldest candidate was Mr. Ramachandra Veerappa in Bidar, Karnataka-94 years.

2. This time, a record number of 1000 unrecognized parties are registered with the election commission of India. Of them, more than 90 are based in Tamil Nadu and nearly 20 in Kerala. Karnataka has about 25 registered parties while Andhra Pradesh has more than 40.

3. For the first time, the country-barring Assam, Nagaland and Jammu and Kashmir-will vote on the basis of photo electoral rolls (522 out of 543 Lok Sabha constituencies)

4. Kerala, Tamil Nadu and Puducherry have the highest number of state parties-four each.Gujarat,

Himachal Pradesh, Rajasthan, Chhattishgarh and Tripura besides a few union territories have none.

5. A total of 3, 89, 816 vials if indelible ink were used in the first general election in 1952.

6. In 2004, polling station no29 (Dharampur) in the Miao Assembly segment of Arunachal east parliamentary constituency had only one voter.

7. There will be a total 0f 8, 28,804 polling stations for the 2009 elections as against 6, 87,402 booths in 2004, an increase of 1, 41,402.

8. Modakurichi Assembly constituency in Tamil Nadu had a record number of 1033 candidates in the 1996 Assembly elections.

9. The highest number of candidates an electronic voting machine can support is 64. If the number exceeds this, a manual ballot is used.

10. The total electorate in 2009 is 714 million, up by 43 million from 2004.

11. Electronic voting machines run on a 6-volt alkaline battery and can be used in areas with no power connections.

12. Electing to vote:_ voter turn out in Lok Sabha election
Year1952:- 61.22%
Year 2004:- 57.65%

13. The EVEM was first used in India in 1982 in a by-election at the Parur assembly constituency of Kerala and in only 50 polling stations.

14. An electronic voting machine can record a maximum number of 3,840 votes which far exceeds the number of voters(usually less than 1,400) assigned to a polling station.

15. The 2004 general elections were conducted totally by using 10.75 lakh (1.75million) electronic machines in the country.

16. The indelible ink used to mark voter’s finger nails is made by Mysore Paints and Varnishes Private Limited, the only company authorized to make the black ink.

17. The Congress Party got 44.99% of the total votes in the first general election of 1951, giving it a sweeping majority in parliament.

18. Independents polled 15.90% of the total votes cast in the first general election of 1951, which was second only to that of the congress

19. In 2004 general election, total seats: 543
Total candidates: 5,435
Women candidates: 355
Women elected: 45


20. Did you know that the use of electro voting machine or EVMs, results in saving of 10,000 tones of paper that in return preserves forests.

Wednesday, March 11, 2009

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు
ఏకగ్రీవ ఎన్నిక : ప్రజలు తమ నియోజకవర్గ ప్రతినిధిగా పోటీ లేకుండా ఎన్నుకునే విధానాన్నే ఏకగ్రీవ ఎన్నిక అని వ్యవహరిస్తారు. ఈ రకపు ఎన్నికలు, సంఘాలలో, సంస్థలలో, కంపెనీలలో, చివరకు సార్వత్రిక ఎన్నికలైనటువంటి, పార్లమెంటు, అసెంబ్లీ మరియు స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు మొదలగువాటిలో, ఈ తరహా పోటీరహిత ఎన్నికలు కానవస్తాయి.

ఈ పద్దతి వలన లాభాలు

1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
* 1955 : రామారావు కామారెడ్డి
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : కే.వి.రెడ్డి బోదన్
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎస్.భూపాల్ అమరచింత
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
* 1981 టి.అంజయ్య రామాయంపేట
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి

Tuesday, January 13, 2009

లంచం నిషిద్ధం

బైబిల్ లో లంచం నిషిద్ధం న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును (సామెతలు 17:23)లంచము పుచ్చుకొనువాని దృష్టికి లంచము మాణిక్యమువలె నుండును.(సామెతలు 17:8)లంచము పుచ్చుకొనకూడదు.లంచము దృష్టిగలవారికి గుడ్డితనము కలుగజేసి,నీతిమంతులమాటలకు అపార్దము చేయించును.(నిర్గమ 23:8)లంచము పుచ్చుకొనకూడదు.లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును (ద్వితీయోపదేశకాండము 16:19) ఖురాన్ హదీసుల్లో లంచం నిషిద్ధం లంచం ఇచ్చేవాడినీ పుచ్చుకునేవాడినీ ప్రవక్త శపించారు(దావూద్ :1595)ఒకరిధనాన్ని ఒకరు కాజేయకండి.అధికారులకు లంచం ఇవ్వకండి (ఖురాన్ 2:188)