Tuesday, September 25, 2012

ఆ పద్యం

 

 అందంగా అందమైన భావాన్ని అందించిన కరుణశ్రీ గారి ఒక పద్యాన్ని పంచుకోవడం.

తెలతెలవారు వేళ, తెరతీయగ పక్షి సమూహ సంతతుల్
కలకలకూయు వేళ, పయిగ్రమ్మిన మబ్బులు వాన చింకులన్
జలజలరాల్చు వేళ, సహజమ్ముగ స్వప్నములో స్తనంధయుల్
కిలకిల నవ్వు వేళ, తిలకింతును నీ సొగసుల్ జగత్ప్రభూ!

ఆ పద్యం స్ఫూర్తితో ఒక ప్రయత్నం. అయ్య వారిని గుర్తుచేసుకున్నప్పుడు, అమ్మవారిని కూడా స్మరించడం.

మిలమిల తెల్లవారుటకు మేలిమి బంగరు సంధ్యకాంతులన్
గలగల పారు యేరులకు గానము సేయు తరంగనాదముల్
కళకళలాడు పూలకు సుగంధముతో మకరంద మాధురుల్
పలుపలు రీతి గూర్చెదవు భాగ్యముగా జగదంబ యంతటన్!
================
విధేయుడు
_శ్రీనివాస్





1 comment: