Thursday, July 12, 2012

తల్లి భాష పట్ల నిరాదరణ తగునా!

 

మన తల్లి భాష తెలుగు. అది మన రాష్ట్ర రాజ భాష కూడా. తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో పదికోట్లతో మూడవ స్థానంలో ఉందని గర్వంగా చెప్పుకుంటాము. కానీ దానికి తగిన ఆదరణ లభించడం లేదు. విదేశాల్లో తెలుగు భాషాభివృద్ధికై పలు సంస్థలు పాటుపడుతుంటే మన రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారిపోతోంది. ఇటీవల జరిగిన గ్రూప్‌-1 పరీక్షలో తెలుగు ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లితే ఇంగ్లీష్‌నే అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటామని ఎపిపిఎస్సీ ప్రకటించడం కొసమెరుపు. ఇతర రాష్ట్రాలకొచ్చేసరికి ఆ రాష్ట్రాలు వాటి మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో స్వచ్ఛమైన తెలుగు భాషపై ఎందుకంత చిన్నచూపు? అలాగే ప్రైవేట్‌ స్కూల్స్‌ పెరిగిపోయి తెలుగుభాషకు ప్రాధాన్యత లేకుండా పోతోంది. దీనికితోడు పిల్లల్లోకూడా తెలుగులో మాట్లాడడానికి, రాయడానికి కూడా చాలా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పాలకులు స్పందించి తగిన నిధులు కేటాయించి మన మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

No comments:

Post a Comment