Monday, January 25, 2010

విజయవాడ వద్ద కృష్ణా నదిపై 5 ప్రతిపాదనలు

 
1.ప్రకాశం బ్యారేజి మూసివేసినందువల్ల ట్రాఫిక్ సమశ్య పెరిగింది.విజయవాడ-తాడేపల్లి మధ్య కృష్ణా నదిపై ఉన్న పాత రైలు బ్రిడ్జిని ఊడదీశారు.తాడేపల్లి ఈమధ్య మునిసిపాలిటీ అయ్యింది.ఈ వంతెనను సైకిళ్ళు పాదచారుల కోసం రెండు మునిసిపాలిటీలు వుడా వారు కలిసి పునరుద్ధరిస్తే రెండుజిల్లాల మధ్య ట్రాఫిక్ సమస్య కొంతవరకైనా తగ్గుతుంది.
2.ప్రకాశం బ్యారేజి నుండి లీక్ అయ్యే నీరు వృధాగా పోతోంది.విజయవాడ-తాడేపల్లి మునిసిపాలిటీలు వుడా వారు కలిసి కనకదుర్గ వారధి వద్ద 1గజం ఎత్తున అడ్డుగోడ నిర్మిస్తే నీళ్ళు నిలబడి పర్యాటకులకు అహ్లాదకరంగా ఉంటుంది.భూగర్భజలాలలో ఉప్పు శాతం తగ్గి మంచి నీరు దొరుకుతుంది.నదీ గర్భంలో ఆక్రమణలు తగ్గుతాయి.భక్తుల పుణ్యస్నానాలకు మరింత చోటులభిస్తుంది.
3.ప్రకాశం బ్యారేజిపై నుండి ఆర్టీసీ మినీ బస్సులు నడిపించాలి.
4.కనకదుర్గ వారధి నుండి ప్రకాశం బ్యారేజివరకు కృష్ణానది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.
5.గ్రేటర్ విజయవాడలో కేవలం ౩కి.మీ దూరంలో గుంటూరుజిల్లాలో ఉన్నకృష్ణాకెనాల్ జంక్షన్, తాడేపల్లి మునిసిపాలిటీని కూడా కలిపి జంట నగరాలుగా అభివృద్ధి చెయ్యాలి.

No comments:

Post a Comment